Medak: పిల్లలు పుట్టలేదని దంపతుల ఆత్మహత్యా యత్నం.. 6 రోజులు పోరాడి నేడు మృతి..
నీరుడి లక్ష్మణ్ (31), రాణి (24) ఇద్దరికి పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ పిల్లలు కాలేదు అనే బాధ వారిని తీవ్రంగా కలిచివేసింది.. ఆరు రోజుల క్రితం ఇంట్లోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు...దీంతో కుటుంబ సభ్యులు ముందుగా హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు

పిల్లలు పుట్టలేదని దంపతుల ఆత్మహత్యా యత్నం చేసి.. గత ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడి నేడు ఇద్దరు మృతి చెందారు. వివాహమై 5 సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదన్న మనస్థాపంతో గడ్డి మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది..దంపతులు ఇద్దరు 6 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో నర్సాపూర్ మండలం హైమద్ నగర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరుడి లక్ష్మణ్ (31), రాణి (24) ఇద్దరికి పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ పిల్లలు కాలేదు అనే బాధ వారిని తీవ్రంగా కలిచివేసింది.. ఆరు రోజుల క్రితం ఇంట్లోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు…దీంతో కుటుంబ సభ్యులు ముందుగా హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు..ఇలా ఆరు రోజులు చికిత్స పొందుతూ, నిన్న రాత్రి 11 గంటలకు భర్త లక్ష్మణ్ మృతిచెందగా..నేడు తెల్లవారు జామున ఆరు గంటలకు భార్య రాణి మృతి చెందింది..లక్ష్మణ్ గత కొన్ని సంవత్సరాలుగా బొంతపల్లి లోని డ్రగ్స్ కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయ్ గా పని చేస్తున్నాడు..ఇలా ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది..మరో వైపు దీని పై పోలిసులు కేస్ నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..