AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?

ఇరాన్‌పై ఇజ్రాయెల్ - అమెరికా సైనిక దాడుల తరువాత, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా మూసివేశారు. ఇరాన్ దక్షిణ సరిహద్దులో ఉన్న హార్ముజ్ జలసంధి పెర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. రవాణా నిలిచిపోవడంతో హెర్ముజ్ జలసంధి సమీపంలో 150 క్రూడాయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి.

హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?
Oil Tankers ,hormuz Strait
Balaraju Goud
|

Updated on: Mar 01, 2026 | 11:11 PM

Share

ఇరాన్‌పై ఇజ్రాయెల్ – అమెరికా సైనిక దాడుల తరువాత, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా మూసివేశారు. ఇరాన్ దక్షిణ సరిహద్దులో ఉన్న హార్ముజ్ జలసంధి పెర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. రవాణా నిలిచిపోవడంతో హెర్ముజ్ జలసంధి సమీపంలో 150 క్రూడాయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి. అయితే నిలిచిన ట్యాంకర్లపై ఇరాన్‌ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. హర్ముజ్‌ సమీపంలో 3 ఆయిల్‌ ట్యాంకర్లపై దాడులు చేసినట్లు సమాచారం.

ఈ ప్రాంతంలోని చాలా నౌకలు యు-టర్న్‌లు తీసుకున్నాయని, ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారని, ఒమన్ గల్ఫ్‌లో లంగరు వేసినట్లు తెలుస్తోంది. దీంతో సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఎందుకంటే వాటి సముద్రమార్గ ముడి చమురు, లిక్విడ్ సహజ వాయువు ఎగుమతులు ఎక్కువగా హార్ముజ్ జలసంధి గుండా వెళతాయి. మరోవైపు యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగుతున్నాయి. బ్యారెల్‌ ధర 10శాతం పెరిగి, 80 డాలర్లకు చేరుకుంది. బ్యారెల్‌ ధర 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు. కాగా, ఇరాన్‌ హెచ్చరికలతో ఆయిల్‌, గ్యాస్‌ రవాణాను షిప్పింగ్‌ కంపెనీలు, వ్యాపారులు పూర్తిగా ఆపేశారు.

అరేబియా సముద్రంలో ఒమన్‌-ఇరాన్‌ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి హర్మూజ్‌. ఇందులో ఓ చోట అత్యంత ఇరుకుగా.. కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దానిలో ఐదో వంతుకు సమానం. సౌదీ, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ల నుంచి ఎగుమతి అవుతోంది. ఇక లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ రవాణాకు కూడా అత్యంత కీలకం. మూడింట ఒక వంతు ఎల్‌ఎన్‌జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది.

హర్ముజ్ జలసంధి మూసివేస్తే భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. మన దేశం దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీలో సగానికిపైగా ఈ మార్గం నుంచే రావాల్సి ఉంటుంది. హర్మూజ్‌ మీదుగానే వస్తుంది. ఇక రోజువారీ 55 లక్షల పీపాల చమురును భారత్‌ ఈ మార్గం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది భారత చమురు అవసరాల్లో 40 శాతానికి సమానం. హర్మూజ్‌లో ఇబ్బందులతో ప్రపంచ చమురు మార్కెట్లపై భారీ ఎఫెక్ట్ పడుతోంది..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us