AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రయాణీకుడికి బస్సులో కనిపించిన పర్సు… ఓపెన్ చేయగా.. ధగధగా మెరుస్తూ

సంగారెడ్డిలో ఓ ఆర్టీసీ ప్రయాణీకుడు చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రజంట్ బంగారం ధర దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తులం లక్షా 50 వేల దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయి. అయితే ఇతను మాత్రం....

Telangana: ప్రయాణీకుడికి బస్సులో కనిపించిన పర్సు... ఓపెన్ చేయగా.. ధగధగా మెరుస్తూ
RTC Bus (representative image)
Ram Naramaneni
|

Updated on: Oct 17, 2025 | 2:40 PM

Share

బంగారం ధర ఎగసిపడుతోంది. పది గ్రాముల పసిడి ధర లక్షా 20 వేల రూపాయలు దాటేసింది. ఇక రానున్న రోజుల్లో గోల్డ్ మరింత ఖరీదవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద బంగారం సామాన్యులకు చిక్కుకుండా పరుగులు పెరుగుతుంది. బంగారం ఇప్పుడు కేవలం ఆభరణం కాదు, కలగానే మిగిలిపోతోంది. ఇదిలా ఉంటే.. ఇంత బంగారం మీద మోజు పెరుగుతున్న ఈ కాలంలో ఓ వ్యక్తి చూపించిన నిజాయితీ అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు 50 లక్షల రూపాయల విలువ చేసే 39 తులాల బంగారం దొరికినా.. దాన్ని కాజేయకుండా యజమానులకే తిరిగి ఇచ్చేశాడు. అతడి పేరు దుర్గయ్య. అతడి పనిని ఇప్పుడు సంగారెడ్డి ప్రజానీకం అంతా ప్రశంసిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశ్రాంత ఉద్యోగి వసుధ, ప్రకాశ్ దంపతులు తమ మనవరాలి పెళ్లి కోసం సికింద్రాబాద్‌లో 39 తులాల బంగారం బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేశారు. తిరిగి బస్సులో తమ ఊరు వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్నాక గోల్డ్ బిస్కెట్స్ ఉన్న పర్స్ కనిపించడం లేదని గ్రహించారు. క్షణాల్లోనే ఆందోళన, భయం వారిని ఆవరించాయి. వెంటనే ఆర్టీసీ డిపోకు పరుగెత్తి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అదే బస్సులో ప్రయాణించిన దుర్గయ్యకు బంగారం ఉన్న పర్స్ కనిపించింది. ఎవరిదో తెలియకపోయేసరికి.. వెంటనే కండక్టర్‌కు అప్పగించాడు. కండక్టర్ దానిని సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ వద్దకు చేర్చాడు.

తరువాత వసుధ దంపతులు బిల్లులు చూపించి, అది తమదేనని నిర్ధారించడంతో అధికారులు బంగారాన్ని వారికే తిరిగి ఇచ్చారు. నిజాయితీకి ప్రతీకగా నిలిచిన దుర్గయ్యను డిపో మేనేజర్ ఉపేందర్ ఘనంగా సన్మానించారు. తమ బంగారం సురక్షితంగా తిరిగి లభించడంతో వసుధ దంపతులు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారంటే… మనసు నిండిపోతుంది’ అంటున్నారు స్థానికులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?