Scholarship: తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం.. లాఫాయేట్‌ కాలేజీ రూ. 2 కోట్ల స్కాలర్‌షిప్‌

Scholarship: తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రానికి చెందిన విద్యార్థిని శ్వేతా రెడ్డి(17)కి అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ ఏకంగా 2 కోట్ల రూపాయల.

Scholarship: తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం.. లాఫాయేట్‌ కాలేజీ రూ. 2 కోట్ల స్కాలర్‌షిప్‌
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jul 14, 2021 | 7:33 PM

Scholarship: తెలంగాణ విద్యార్థికి అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రానికి చెందిన విద్యార్థిని శ్వేతా రెడ్డి(17)కి అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ ఏకంగా 2 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ ఆఫర్ చేసింది. లాఫాయేట్‌ కాలేజీలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ(మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) కోర్సులో అడ్మిషన్‌తో పాటు ఈ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ కళాశాలలో అడ్మిషన్ దక్కించుకోవడమే గొప్ప విషయం కాగా, అందులో శ్వేతారెడ్డి స్కాలర్ షిష్‌ను కూడా దక్కించుకుంది. కాగా, డైయర్‌ ఫెలోషిప్‌ పేరిట లాఫాయెట్‌ కాలేజీ ప్రతి ఏడాది ఆరుగురు విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంపికైన ఆరుగురిలో శ్వేతారెడ్డి

కాగా, ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఎంపికైన ఆరుగురిలో తెలుగు విద్యార్థి శ్వేతారెడ్డి కావడం విశేషం. శ్వేతారెడ్డి ప్రతిభ, నాయకత్వ లక్షణాలు చూసే ఈ స్కాలర్‌ షిప్‌కు ఎంపిక చేసినట్లు లాఫాయెట్ కాలేజీ వెల్లడించింది.

స్కాలర్‌షిప్‌ రావడం ఎంతో గర్వకారణంగా ఉంది: శ్వేతారెడ్డి

అయితే ఇలాంటి స్కార్‌షిప్‌కు ఎంపిక కావడం చాలా తక్కువ మంది విద్యార్థులు ఉంటారు. అయితే ఈ స్కాలర్‌షిప్‌ రావడంపై శ్వేతారెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. తనకు ఇలాంటి అద్భుత అవకాశం రావడం వెనక డెక్స్ టెరీటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహం ఉందని, దాని వల్లే తాను ఈ స్కాలర్ షిప్ అందుకోగలిగానని పేర్కొంది. కాగా, శ్వేతారెడ్డి స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడం పట్ల ఎంపీ బండి సంజయ్‌ అభినందించారు. శ్వేతారెడ్డి తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, అందరికి ప్రేరణ అని అన్నారు.

ఇవీ కూడ చదవండి:

India Post Payments Bank: పోస్టల్‌ బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌.. ఆగస్టు 1 నుంచి పెరగనున్న చార్జీలు

Bank Locker: మీకు బ్యాంకులో లాకర్‌ లభించడం లేదా..? అయితే ముందుగానే రిజిస్టర్‌ చేసుకోవచ్చు