Telangana: తనను జైల్లో పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.. పొంగులేటి షాకింగ్ కామెంట్స్..

అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు. వచ్చే కురుక్షేత్రంలో మీరంతా కొట్టుకుపోతారు. ఇదీ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు. అవును, గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానంపై..

Telangana: తనను జైల్లో పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.. పొంగులేటి షాకింగ్ కామెంట్స్..
Ex Mp Ponguleti Srinivas Reddy
Follow us

|

Updated on: Jan 31, 2023 | 8:32 AM

అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు. వచ్చే కురుక్షేత్రంలో మీరంతా కొట్టుకుపోతారు. ఇదీ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు. అవును, గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్న పొంగులేటి.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఖమ్మం వ్యాప్తంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ సమావేశంలోనూ బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మధిరలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలోనూ ఈ తరహా కామెంట్సే చేశారు.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొన్న ఆయన అధికారపార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. నాలుగేళ్లుగా.. ఖమ్మం ప్రజలు ఆవేదనలో ఉన్నారు. ఇబ్బందులు ఎదుర్కుంటున్నారనీ అన్నారాయన. 2109 పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయిన తనకు టికెట్ ఇవ్వలేదనీ. తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు పొంగులేటి. తాను పార్టీలో చేరినపుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదని అన్నారు మాజీ ఎంపీ. కేటీఆర్ తో ఉన్న పరిచయమే తాను ఇంతకాలం పార్టీలో కొనసాగేలా చేసిందనీ. తనను జైల్లో పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు పొంగులేటి. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేందుకు ఏం చేయడానికైనా సిద్ధమేనన్నారు పొంగులేటి.

మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి భారీ ఎత్తున పొంగులేటి అనుచరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు హామీల గురించి ప్రస్తావించారు పొంగులేటి. ఇరవై నాలుగ్గంటల విద్యుత్ రైతులకు అందడం లేదనీ. డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తామో తెలీడం లేదనీ అన్నారాయన. తనను నమ్ముకుని వచ్చిన వారిలో ఏ ఒక్కరికీ పదవి ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు శ్రీనివాసరెడ్డి.

ఇవి కూడా చదవండి

అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని. శ్రీనన్న అభిమానులను తాత్కాలికంగా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాపాడుకుంటానని అన్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి. శ్రీనన్న ఒంటరివాడు కాడు. వేలాదిగా సైన్యముంది. రాబోయే కురుక్షేత్రంలో మీరంతా కొట్టుకుపోవడం ఖాయమంటూ ఘాటైన వ్యాఖ్యలే చేశారు పొంగులేటి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..