AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jatara: మేడారం జాతర ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం పూర్తి.. మొక్కులు చెల్లించి బాధ్యతల స్వీకరణ

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర నిర్వహణ కోసం నూతనంగా నియామకమైన కమిటీ చైర్మన్ తో సహా 14 మంది సభ్యులు సమ్మక్క సారక్క దేవతల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.. మంత్రి సీతక్క సమక్షంలో వారంతా బాధ్యతలు స్వీకరించి ప్రమాణం చేశారు.. జాతర నిర్వహణలో మా వంతు పాత్ర పోషిస్తామని ప్రమాణం చేశారు

Medaram Jatara: మేడారం జాతర ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం పూర్తి.. మొక్కులు చెల్లించి బాధ్యతల స్వీకరణ
Medaram Jatara
G Peddeesh Kumar
| Edited By: Surya Kala|

Updated on: Feb 15, 2024 | 8:58 PM

Share

మేడారం మహా జాతర నిర్వాణకు అట్టహాసంగా ఏర్పాట్లుచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 మహా జాతర నిర్వహణ కోసం నూతనంగా ఉత్సవ కమిటీని నియమించింది.. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం దిగ్విజయంగా జరిగింది. తాడ్వాయి మండలం కామరం గ్రామానికి చెందిన ఆదివాసి నాయకుడు అర్రెం లచ్చు పటేల్ ను ఉత్సవ కమిటీ చైర్మన్ గా నియమించారు.. చైర్మన్ తో పాటు 14 మంది కమిటీ సభ్యులతో ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ ప్రకటించింది.

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర నిర్వహణ కోసం నూతనంగా నియామకమైన కమిటీ చైర్మన్ తో సహా 14 మంది సభ్యులు సమ్మక్క సారక్క దేవతల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.. మంత్రి సీతక్క సమక్షంలో వారంతా బాధ్యతలు స్వీకరించి ప్రమాణం చేశారు.. జాతర నిర్వహణలో మా వంతు పాత్ర పోషిస్తామని ప్రమాణం చేశారు

ఉత్సవ కమిటీలో గిరిజన – గిరిజనేతరులకు అవకాశం కల్పించిన మంత్రి సీతక్క.. పార్టీలకతీతంగా జాతర సక్సెస్ లో భాగస్వామ్యం కావాలని కోరారు.. ఉత్సవ కమిటీ నియామకాన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..