Hyderabad: మందుబాబులు అలెర్ట్.. ఇక తాగి వాహనం నడిపితే దబిడి దిబిడే.!
హైదరాబాద్ పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు. కర్నూల్ ఘోర ప్రమాద ఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. తాగి వాహనం నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

హైదరాబాద్ పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు. కర్నూల్ ఘోర ప్రమాద ఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. తాగి వాహనం నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాగి వాహనం నడిపి వారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరులు సైతం ప్రాణాలు కోల్పోయేలా ఘటనలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు అభివర్ణించారు.
కొద్దిరోజుల క్రితం కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన ఘటనే ఉదాహరణగా హైదరాబాద్ పోలీసులు చూపిస్తున్నారు.. శివశంకర్ అనే యువకుడు తాగి వాహనం నడిపి డివైడర్ను ఢీ కొట్టి ప్రమాదానికి గురికాగా అతడు నడిపిన బైక్ రోడ్డు మీదే పడి ఉండటం ఆ తర్వాత అదే రూట్లో వెళుతున్న వి కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైక్ను ఢీకొనటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై 19 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనలో అసలు శివశంకర్ అనే యువకుడు మద్యం సేవించకుండా ఉండి ఉంటే 19 మంది ప్రాణాలతో ఉండి ఉండేవారని పోలీసులు చెబుతున్నారు. ఆ యువకుడు మద్యం సేవించడం వల్లే ఈరోజు 19 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
కర్నూల్ ఘటన తర్వాత హైదరాబాదులోనూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. తాగి వాహనం నడిపి ఇతరుల ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యే వారిని ఉగ్రవాదులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ అభివర్ణించారు. తమ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలు సైతం తీస్తున్న వారిని ఉగ్రవాదులుగా చూడటమే కరెక్ట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నూల్ ఘటన తర్వాత హైదరాబాదులో అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం డ్రంకెన్ తనిఖీలు కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ సజనార్ స్పష్టం చేశారు.




