Lakshmi Praneetha Perugu

Lakshmi Praneetha Perugu

Correspondent - TV9 Telugu

lakshmipraneetha.perugu@tv9.com

10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.

తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే

తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే

తెలంగాణలో డేటింగ్ యాప్ నేరాలు విపరీతంగా పెరిగాయి. గతంతో పోలిస్తే ఏకంగా 46శాతం ఎక్కువగా డేటింగ్ యాప్ ద్వారా నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఆన్లైన్ యాప్స్ ఎక్కువగా అలవాటుపడ్డ యువత డేటింగ్ యాప్‎లపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. డేటింగ్ ఆప్‎లోను ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి బాధితుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ముఠాలు ఎక్కువయ్యాయి. డేటింగ్ యాప్‎ల ద్వారా సంతోషం కంటే రిస్క్‎లు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ తర్వాత ఆన్లైన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

Pat Cummins: హైదరాబాద్ బిర్యానీ అంటే మస్త్ ఇష్టం.. ఆ రెండు జట్లతోనే మాకు పోటీ: సన్‌రైజర్స్ కెప్టెన్..

Pat Cummins: హైదరాబాద్ బిర్యానీ అంటే మస్త్ ఇష్టం.. ఆ రెండు జట్లతోనే మాకు పోటీ: సన్‌రైజర్స్ కెప్టెన్..

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దూసుకెళ్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదో స్థానంలో ఉంది. మే2 న ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ సందర్భంగా మూడు రోజుల క్రితమే సన్‌రైజర్స్ టీం హైదరాబాద్‌కు చేరుకుని కసరత్తులు ప్రారంభించింది. గతంతో పోలిస్తే ఈసారి సన్‌రైజర్స్ జట్టుకు ఎక్కడికి వెళ్లినా విపరీతంగా ఆదరణ లభిస్తుంది.

Cyber Fraud: ఒక్క కాల్‌తో కోట్లు కొట్టేస్తున్న సైబర్ మాఫియా.. నెల రోజుల్లో 100 మంది ట్రాప్..!

Cyber Fraud: ఒక్క కాల్‌తో కోట్లు కొట్టేస్తున్న సైబర్ మాఫియా.. నెల రోజుల్లో 100 మంది ట్రాప్..!

టెక్నాలజీ అప్‌డేట్ అయినట్లే.. సైబర్ క్రిమినల్స్ కూడా దానికి మించిన రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. రోజుకో స్టైల్లో.. కొత్త కొత్త స్ట్రాటజీలతో అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. ఇటీవల పార్సిల్స్ పేరుతో జరుగుతున్న మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొరియర్ సంస్థల పేర్లు చెప్పి వాటిలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయంటూ అమాయకులను మభ్యపెడుతున్న ఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకుంటున్నాయి.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..

హైదరాబాదులో ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరిగినా టికెట్ల కొరత కనిపిస్తుంది. ఇప్పటివరకు హైదరాబాదులో మూడు ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఈ మూడు మ్యాచ్లకు టికెట్లు దొరకక క్రికెట్ అభిమానులు చాలామంది నిరాశతో ఉన్నారు. అయితే టికెట్లు దొరకకపోవటంపై అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు..

ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు..

తీగ లాగితే డొంక కదిలినట్లు.. మొబైల్ స్నాచింగ్ కేసును చేధించే క్రమంలో అంతర్జాతీయ మొబైల్ ఫోన్ల స్మగ్లింగ్‌ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‎లో మొబైల్‌ ఫోన్లను స్నాచింగ్ చేసి వాటిని సూడాన్కు తరలిస్తున్న ముఠా పట్టుబడింది. ఈ ముఠా నుండి పదుల సంఖ్యలో కాదు ఏకంగా ఏడు వందల స్మార్ట్‌ఫోన్లను రికవరీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో గత కొద్ది రోజులుగా సెల్ ఫోన్ల దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి.

మహిళా క్రికెట్లో ఒకేరోజు ఇద్దరు స్టార్ల సంచలనం.. పురుషులకు కూడా సాధ్యం కాని రికార్డ్.!

మహిళా క్రికెట్లో ఒకేరోజు ఇద్దరు స్టార్ల సంచలనం.. పురుషులకు కూడా సాధ్యం కాని రికార్డ్.!

మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టు సంచలన రికార్డు చేసింది. ఇప్పటివరకు మహిళా క్రికెట్లో 300కు పైబడి రన్స్‎ను ఏ ఇతర జట్టు చేజింగ్ చేయలేకపోయింది. కానీ బుధవారం సౌత్ ఆఫ్రికా‎తో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక జట్టు ఈ ఘనత సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా నిర్దిష్ట 50 ఓవర్లలో 301 పరుగులు చేసింది. చేజింగ్‎కు దిగిన శ్రీలంక మహిళ క్రికెటర్లు 44.3 ఓవర్లలోనే 305/4 పరుగులు చేసి మహిళా క్రికెట్లో రికార్డు సృష్టించారు.

సినిమా తరహాలో ప్లాన్.. అధికారులకు షాక్ ఇచ్చిన బాల నేరస్తులు..

సినిమా తరహాలో ప్లాన్.. అధికారులకు షాక్ ఇచ్చిన బాల నేరస్తులు..

అచ్చం సినిమాలో చూపించిన మాదిరిగానే జువైనల్ హోమ్ నుండి పారిపోయారు 8 మంది నేరస్తులు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‎లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాజులరామారం కైసర్ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న యూనియన్ హోమ్ నుండి మంగళవారం ఉదయం 8 మంది బాల నేరస్తులు తప్పించుకున్నారు. ఘటనపై సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: జైలులో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఖైదీలు.. వాటి కోసమే ఏకంగా దాడి..!

Telangana: జైలులో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఖైదీలు.. వాటి కోసమే ఏకంగా దాడి..!

సాధారణంగా బయట ఏదైనా నేరానికి పాల్పడితే జైలుకు పంపుతూ ఉంటారు. అయితే జైలులోనే బరితెగించారు కొంతమంది నిందితులు. హైదరాబాద్ శివారు చర్లపల్లి జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. నేరం చేసి జైలులో ఉన్న నిందితులు ఏకంగా సిబ్బందిపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జైలు అధికారులు విచారణ జరుపుతున్నారు.

Cyber fraud: తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ లాభాలు.. మెసేజ్‌ చూసి క్లిక్ చేశారా..? మీ పని గోవిందా!

Cyber fraud: తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ లాభాలు.. మెసేజ్‌ చూసి క్లిక్ చేశారా..? మీ పని గోవిందా!

టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట కోట్లు కొల్లగొడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. తక్కువ ఇన్వెస్ట్ మెంట్ పెడితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సైబర్‌ కేటుగాళ్లు వేసిన వలలో చిక్కి, భారీ మొత్తంలో మోసపోయారు.

ఆన్లైన్ గేమ్స్‎తో యువతి అప్పులపాలు.. డబ్బుకోసం కూతురు చేసిన పని చూసి షాకైన తల్లితండ్రులు..

ఆన్లైన్ గేమ్స్‎తో యువతి అప్పులపాలు.. డబ్బుకోసం కూతురు చేసిన పని చూసి షాకైన తల్లితండ్రులు..

ఆన్లైన్లో గేమ్స్‎కు అలవాటు పడి భారీగా డబ్బులు పోగొట్టుకున్న యువతి తిరిగి వాటిని రాబట్టుకునేందుకు మళ్లీ పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయింది. తీరా తన వద్ద డబ్బులు అన్ని అయిపోవడంతో సొంత ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సొంత ఇంట్లో దొంగలు పడ్డారని తల్లిదండ్రులను నమ్మించి డబ్బు మొత్తం కాజేసి అప్పులు తీర్చాలని భావించింది.

Cyber Crime: షాది డాట్ కామ్‎లో ప్రేమ వల.. పెళ్లి పేరుతో రూ. 40 లక్షలు టోకరా..

Cyber Crime: షాది డాట్ కామ్‎లో ప్రేమ వల.. పెళ్లి పేరుతో రూ. 40 లక్షలు టోకరా..

ఇటీవల సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పించినా పలువురు అమాయకులు మాత్రం సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఇట్టే మోసపోతున్నారు. పదేపదే ఒకే రకమైన నేరానికి అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ఒక యువకుడు కోసం ఏకంగా రూ.40 లక్షల రూపాయలు పోగొట్టుకుంది ఒక యువతి.

Hyderabad: హెచ్‎సీఏ కీలక నిర్ణయం.. తెలంగాణలో క్రికెట్ క్యాంపులు.. ఎప్పుడంటే..

Hyderabad: హెచ్‎సీఏ కీలక నిర్ణయం.. తెలంగాణలో క్రికెట్ క్యాంపులు.. ఎప్పుడంటే..

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో మెగా సమ్మర్‌ క్రికెట్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధికి కట్టుబడుతూ, పేద క్రికెటర్ల కోసం హెచ్‌సీఏ చరిత్రలో తొలిసారి వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు కనీసం 2500 మంది క్రికెటర్లకు నిపుణులైన కోచింగ్‌ సిబ్బందితో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.