10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.
ఐ మిస్ యూ.. ఐ లవ్ యూ.. అంటూ మెసేజ్ వస్తుందా..? ఆ జబ్బులో పడితే మీ పని ఖతమే..
"ఐ మిస్ యూ", "ఐ లవ్ యూ" అంటూ ఆన్లైన్లో త్వరగా సన్నిహితమై.. చివరికి డబ్బు అడిగే రోమాన్స్ స్కామ్లపై హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్లు, మెసేజింగ్ ప్లాట్ఫారమ్ల ద్వారా పరిచయమైన వ్యక్తులకు డబ్బు పంపొద్దని సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 27, 2026
- 9:27 pm
చేతబడి చేస్తా.. మళ్లీ తొలగిస్తా.. ఎన్నారై పూజారి చిట్టా చాంతాడంత..
పూజలు, ప్రత్యేక పరిహారాల పేరుతో లక్షల రూపాయలు మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నారై పూజారి చామర్తి రామ లచ్చారావును శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని నుంచి రూ.20 లక్షలు మోసం చేసిన కేసుతో పాటు అమెరికాలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 27, 2026
- 3:40 pm
Indian Cricket Legends : గౌరవ హోదాల్లో క్రికెట్ దిగ్గజాలు.. మైదానంలోనే కాదు.. దేశసేవలోనూ ముందే..!
Indian Cricket Legends : మైదానంలో విజయాలతో దేశానికి కీర్తి తెచ్చిన భారత క్రికెట్ దిగ్గజాలకు సైన్యం, వైమానిక దళం, పోలీసు శాఖలు గౌరవ హోదాలు ప్రదానం చేశాయి. ధోనీ, సచిన్, కపిల్ దేవ్, సిరాజ్, హర్భజన్, హర్మన్ప్రీత్లకు లభించిన ఈ గుర్తింపు యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 26, 2026
- 1:23 pm
చిన్నారుల రక్షణకు ‘కృత్రిమ మేధస్సు’.. సైబర్ నేరగాళ్లకు వణుకు పుట్టిస్తున్న తెలంగాణ పోలీస్ సాంకేతిక ఆయుధం!
చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆన్లైన్ చైల్డ్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM) వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన C-SIGHT అనే AI ఆధారిత ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర డేటా బయటకు వెళ్లకుండా భద్రంగా ఉంచే విధంగా ఈ ప్లాట్ఫామ్ను రూపొందించడం దీని ప్రత్యేకత.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 25, 2026
- 8:31 pm
Hyderabad: రేయ్ ఎవర్రా మీరంతా.. పైకేమో వన్ప్లస్ బ్రాండెడ్.. లోపలేమో అంతా తుస్.. నమ్మితే అంతే సంగతులు..
హైదరాబాద్లోని అబిడ్స్ జగదీష్ మార్కెట్లో నకిలీ OnePlus ఉత్పత్తుల విక్రయాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. నెక్బ్యాండ్లు, ఇయర్పాడ్స్, ఛార్జర్లు, అడాప్టర్ల రూపంలో విక్రయిస్తున్న రూ.12 లక్షల విలువైన నకిలీ సరుకును స్వాధీనం చేసుకుని, దుకాణ యజమాని రామ్ చౌదరిని అరెస్ట్ చేశారు. కంపెనీ ప్రతినిధి ఫిర్యాదుతో నిర్వహించిన దాడిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 22, 2026
- 4:54 pm
FIFA World Cup 2026 : వరుసగా రెడ్ కార్డులు.. ఫిఫా వరల్డ్కప్ 2026లో కొత్త రికార్డుల దిశగా టోర్నీ!
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్కప్ 2026లో గ్రూప్ దశ పూర్తికాకముందే 6 రెడ్ కార్డులు నమోదయ్యాయి. 2018, 2022 ప్రపంచకప్లను అధిగమిస్తూ ఈ టోర్నీ కొత్త రికార్డుల దిశగా సాగుతోంది. కఠినమైన VAR అమలు, రిఫరీ నిర్ణయాలు, పెరిగిన పోటీ ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 20, 2026
- 11:16 am
పన్నీర్ కొంటున్నారా..? ఒక్కసారి ఆలోచించండి.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో పనీర్ వ్యాపారంలో జరుగుతున్న భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు కల్తీ నూనెలు, పాలు, మసాలా దినుసులు, స్వీట్లపై దృష్టి సారించిన అధికారులు తాజాగా పనీర్ పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్న ముఠాలపై ప్రత్యేకంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాలతో తయారైన అసలైన పనీర్కు బదులుగా వెజిటబుల్ ఫ్యాట్స్, వనస్పతి కొవ్వులు, ఇతర పాలేతర పదార్థాలతో తయారు చేసిన ‘చీజ్ అనలాగ్’ ఉత్పత్తులను పనీర్గా విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 19, 2026
- 2:26 pm
తింటే ప్రాణాలకే ముప్పు..! చార్మినార్ ఫాస్ట్ ఫుడ్ గోదాములో బయటపడ్డ షాకింగ్ బండారం!
హైదరాబాద్ మహానగరంలో గత రెండు రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీలు కల్తీ ఆహార వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న నాణ్యతలేని, అపరిశుభ్ర ఆహార తయారీ కేంద్రాలపై అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 19, 2026
- 1:24 pm
వైద్యులే లక్ష్యంగా సైబర్ మాయాజాలం.. రూ.29.8 కోట్లు నష్టపోయిన వందలాది మంది డాక్టర్లు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
నగరంలో సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాల్చుతున్నాయి. నిరక్షరాస్యులు, సామాన్యులే కాకుండా సమాజంలో అత్యంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న విద్యావంతులను సైతం సైబర్ నేరగాళ్లు చాకచక్యంగా బురిడీ కొట్టిస్తున్నారు. ప్రస్తుతం సైబర్ ముఠాల టార్గెట్ వైద్యులుగా మారినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సంచలన విషయాలను వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ నుండి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 735 మంది వైద్యులు సైబర్ మోసాల బారిన పడి దాదాపు రూ.29.8 కోట్లను కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 17, 2026
- 7:31 pm
సోషల్ మీడియా ఎక్కువగా వాడుతారా? అయితే మీరిక తప్పించుకోలేరు.. థర్డ్ ఐ నిఘాతో..
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోషల్ మీడియాపై నిఘా పెట్టింది. ఆత్మహత్య సంకేతాలు ఇచ్చే పోస్టులపై మెటాతో సమన్వయంతో ప్రాణాలను కాపాడుతోంది. గత 7 నెలల్లో 800 మందిని రక్షించింది. మహిళలను వేధించడం, ఫేక్ న్యూస్ వంటి దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రతి డిజిటల్ కదలిక రికార్డవుతుంది కాబట్టి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 17, 2026
- 3:41 pm
తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్పై ఈగల్ ఫోర్స్ మెరుపుదాడులు.. బయటపడ్డ సినీ పరిశ్రమ లింకులు..?
తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈగల్ (EAGLE) ఫోర్స్ మరో కీలక ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతో పాటు మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఒకేసారి ప్రత్యేక దాడులు చేపట్టిన అధికారులు డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ను బలహీనపరచడంతో పాటు డిమాండ్ను తగ్గించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 16, 2026
- 5:20 pm
Hyderabad: వర్క్ ఫ్రమ్ బైక్.. పని కడుపు నింపుకోవడానికి.. కడతేర్చుకునేందుకు కాదు..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. రద్దీ రహదారిపై బైక్ నడుపుతూనే ల్యాప్టాప్లో పని చేస్తున్న ఓ యువకుడి వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రయాణం చేస్తూనే ల్యాప్టాప్ను బైక్ ముందు భాగంలో ఉంచుకుని పని చేస్తున్న ఈ యువకుడి నిర్లక్ష్య వైఖరిపై సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jun 13, 2026
- 11:35 am