10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.
Telangana: అడ్రస్ చేయాల్సిన ఇష్యూ.. చైల్డ్ ట్రాఫికింగ్లో తెలంగాణనే టాప్
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాలు కీలకంగా ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది తెలంగాణలోనే 7 ప్రధాన చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలను ఛేదించి 90 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 25, 2025
- 12:15 pm
Telangana: లంచం కొట్టు.. పర్మిషన్ పట్టు.. 2025లో ఏ శాఖలో ఎక్కువ అవినీతి జరిగిందో తెలుసా?
Record Corruption Crackdown in 2025: తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అవినీతిపై ఉక్కుపాదం మోపుతుంది ఏసీబీ. అయితే ఏసీబీ దాడుల్లో ఈ ఏడాది సరికొత్త రికార్డులు నమోదు అయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కరప్షన్ కేసులు భారీగా పెరిగాయి. ఆ లెక్కలేంటో చూద్దాం పదండి.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 25, 2025
- 10:57 am
Hyderabad: బార్బర్ దారుణ హత్య.. పోలీసులు అనుమానం అదే..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవేలిగూడ వద్ద గుర్తుతెలియని దుండగులు యువకుడిని హత్య చేయడంతో కలకలం రేగింది. మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్ (26)గా మృతుడిని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 25, 2025
- 10:43 am
Telangana: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే IASల సతీమణులు ప్రసవం.. మారుతోన్న నయా ట్రెండ్!
ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరుగుతోందని మరోసారి స్పష్టమైంది. రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులనే ఎంచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిపుణులైన వైద్యులు, ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని..
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 24, 2025
- 6:11 pm
Hyderabad: ప్రజల్ని కాపాడాల్సినవాళ్లే ఎర అవుతున్నారు.. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి.?
క్రికెట్ బెట్టింగ్పై అవగాహన కల్పించాల్సిన పోలీసులే కొంతమంది దానికి బానిసలుగా మారి అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా పలువురు పోలీస్ కానిస్టేబుళ్లు క్రికెట్ బెట్టింగుల్లో నష్టాల పాలయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు రోడ్డుపాలైన పరిస్థితి ఉంది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 23, 2025
- 12:31 pm
Telangana: ఇదేం పని మాస్టారూ.! పాఠాలు చెప్పాల్సిన మీరే.. ఒకేసారి 10 మంది స్కూల్ పిల్లలతో ఇలా
స్టూడెంట్ తన మాట వినకపోతే.. అతడ్ని మందలించడం లేదా రెండు దెబ్బలు కొట్టాలి. కానీ ఇక్కడ ఓ హెడ్మాస్టర్ తన బాధ్యతలు విస్మరించి.. ఏకంగా ఓ రౌడీ మాదిరిగా బిహేవ్ చేశాడు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 23, 2025
- 10:50 am
వీకెండ్ వచ్చిందంటే చాలు… ఇదేం పనిరా సామి.. రికార్డ్ సృష్టిస్తున్న మందు బాబులు..!
వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్లో మందు బాబులు రెచ్చిపోతున్నారు. తాగడం ఒక ఎత్తు అయితే, తాగి వాహనాలు నడిపి యాక్సిడెంట్లకు కారకులు అవుతున్నారు. న్యూ ఇయర్ దగ్గర పడుతున్న తరుణంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 21, 2025
- 6:50 pm
Hyderabad: మహిళ స్నానం చేస్తుండగా బాత్రూంలోని వెంటిలేటర్ నుంచి కనిపించిన లైట్.. పరిశీలించగా
స్నానం చేస్తుండగా వెంటిలేటర్ ద్వారా మొబైల్ ఫోన్ కనిపించడం కలకలం రేపింది. బోడుప్పల్లోని శ్రీలక్ష్మీనగర్లో మహిళను రహస్యంగా వీడియో తీయడానికి ప్రయత్నించిన ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. .. ... ..
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 20, 2025
- 9:56 pm
Hyderabad: భారీ మోసానికి ఏం ప్లాన్ చేశార్రా.. మన పోలీసులు అంతకంటే స్మార్ట్ కదా..!
హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ను టార్గెట్గా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.14 కోట్లను కాజేసిన భారీ మోసానికి సంబంధించి దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 20, 2025
- 9:43 pm
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న క్రీడాకారుల డోపింగ్ టెస్ట్.. భారత్ స్థానం ఎంతో తెలుసా..?
డోపింగ్ ఉల్లంఘనల్లో భారత్ టాప్లో ఉంది. ఈ లెక్క మేం చెప్పడం లేదు.. తాజాగా WADA నివేదిక లో ఈ అంశం వెల్లడైంది. డోపింగ్ ఉల్లంఘనల విషయంలో ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) విడుదల చేసిన 2024 టెస్టింగ్ ఫిగర్స్ రిపోర్ట్ ప్రకారం, 5 వేలకుపైగా డోపింగ్ పరీక్షలు నిర్వహించిన దేశాల్లో భారత్లోనే అత్యధిక సంఖ్యలో ఉల్లంఘనలు నమోదయ్యాయి.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 18, 2025
- 5:11 pm
Hyderabad: ప్రాణం తీసిన వేగం.. కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు.. తండ్రికొడుకులు మృతి
మైలార్ దేవులపల్లి రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో యూపీకి చెందిన ప్రభు మహారాజ్, ఆయన కుమారుడు దీపక్ మృతి చెందారు. మరో వ్యక్తి సత్తునాథ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 17, 2025
- 12:00 pm
Hyderabad: హైదరాబాదీస్ జాగ్రత్త.! ఈసారి న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలివే.. తేడా వస్తే ఊసలు లెక్కపెట్టాల్సిందే
హైదరాబాద్ నగరం న్యూఇయర్ సెలబ్రేషన్స్కు రెడీ అవుతోంది. ఈసారి మరింత వినూత్నంగా కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు ఎదురుచూస్తున్నారు. అయితే.. హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. స్టార్ హోటల్స్, క్లబ్స్, బార్లపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతోపాటు.. పలు ఆంక్షలు విధించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Dec 16, 2025
- 11:25 am