AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Praneetha Perugu

Lakshmi Praneetha Perugu

Correspondent - TV9 Telugu

lakshmipraneetha.perugu@tv9.com

10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.

స్పా సెంటర్లపై పోలీసుల సర్జికల్ స్ట్రైక్..  ఒకేసారి 113 చోట్ల దాడులు.. వణకిపోయిన నిర్వహకులు!

స్పా సెంటర్లపై పోలీసుల సర్జికల్ స్ట్రైక్.. ఒకేసారి 113 చోట్ల దాడులు.. వణకిపోయిన నిర్వహకులు!

హైదరాబాద్ మహానగరంలో స్పా సెంటర్ల ముసుగులో సాగుతున్న అసాంఘిక దందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం (జూన్ 05) అత్యంత భారీస్థాయిలో మూకుమ్మడి దాడులు జరిగాయి. నగర చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్లలో ఒకటిగా నిలిచిన ఈ దాడిలో ఏకంగా 500 మంది పోలీసులు ఒకేసారి రంగంలోకి దిగారు.

కలెక్టరేట్‌లో తీవ్ర విషాదం.. ఉన్నతాధికారి వేధింపులకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి బలి!

కలెక్టరేట్‌లో తీవ్ర విషాదం.. ఉన్నతాధికారి వేధింపులకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి బలి!

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని గిరిజన సంక్షేమ శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పై అధికారి మానసిక వేధింపులు తట్టుకోలేక వాడ్త్య శ్రీధర్ బాబు (39) అనే అవుట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: అలా ఎలా నమ్మించార్రా.. పోలీసుల మని చెప్పి లక్షలు కాజేసిన ముఠా.. సీన్ కట్‌చేస్తే..

Hyderabad: అలా ఎలా నమ్మించార్రా.. పోలీసుల మని చెప్పి లక్షలు కాజేసిన ముఠా.. సీన్ కట్‌చేస్తే..

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు.. జనాలను మోసం చేసేందుకు రోజుకో వ్యూహం రచిస్తున్నారు. తాజాగా అలానే పోలీసు అధికారులమని చెబుతూ జనాలను నుంచి డబ్బులు కాజేస్తున్న ఓ నకిలీ పోలీస్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు గన్స్‌ , రెండు నకిలీ పోలీస్ స్టిక్కర్లు ఉన్న కార్లు, ల్యాప్‌టాప్, పోలీస్ యూనిఫాంలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

తొమ్మిదేళ్లు జైల్లోనే.. చివరకు నిర్దోషిగా విడుదల.. మహిళ హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

తొమ్మిదేళ్లు జైల్లోనే.. చివరకు నిర్దోషిగా విడుదల.. మహిళ హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిజామాబాద్‌లో 2017లో జరిగిన హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రాజస్థాన్‌కు చెందిన వలస కార్మికుడు మంగీలాల్‌కు విధించిన శిక్షను రద్దు చేస్తూ విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. అభియోగాలను సందేహాతీతంగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొన్న హైకోర్టు, నిందితుడికి అనుమాన లాభం (Benefit of Doubt) వర్తిస్తుందని స్పష్టం చేసింది.

వాట్సాప్ కాల్స్ రికార్డింగ్‌ అవుతున్నాయా..? అసలు నిజం బయటపెట్టిన హైదరాబాద్ పోలీసులు..!

వాట్సాప్ కాల్స్ రికార్డింగ్‌ అవుతున్నాయా..? అసలు నిజం బయటపెట్టిన హైదరాబాద్ పోలీసులు..!

హైదరాబాద్ నగర పోలీస్ విభాగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక తప్పుడు వార్తపై పౌరులను హెచ్చరించింది. వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. తప్పుడు వార్తల నమ్మి భయాందోళనలకు గురి కావద్దని నగర పోలీసులు సూచిస్తున్నారు.

పాల ప్యాకెట్ కోసం వస్తే పాడుపని.. 70 ఏళ్ల కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

పాల ప్యాకెట్ కోసం వస్తే పాడుపని.. 70 ఏళ్ల కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

హైదరాబాద్ సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో (POCSO) కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 70 ఏళ్ల మహ్మద్ జమీరుద్దీన్‌ను దోషిగా తేల్చిన హైదరాబాద్‌లోని XII అదనపు సెషన్స్ జడ్జి, పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పును ప్రకటించారు.

తెలంగాణ సమ్మర్ స్పెషల్.. కేవలం బీర్ అమ్మకాలతోనే ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలుసా?

తెలంగాణ సమ్మర్ స్పెషల్.. కేవలం బీర్ అమ్మకాలతోనే ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలుసా?

తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ అమ్మకాలు పెరిగాయి. వేసవి తాపం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో మద్యం వినియోగం పెరిగి, ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరింది. ఏప్రిల్ 2026లో మొత్తం రూ.3,618.41 కోట్ల ఆదాయం రాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 10.58 శాతం అధికం.

కశ్మీరీ పండిట్ల పునరాగమనం.. శ్రీనగర్‌లో జూన్ 6 నుంచి చారిత్రక గ్లోబల్ సదస్సు!

కశ్మీరీ పండిట్ల పునరాగమనం.. శ్రీనగర్‌లో జూన్ 6 నుంచి చారిత్రక గ్లోబల్ సదస్సు!

మూడు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. కశ్మీరీ పండిట్ల ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టేందుకు, వారి ఘనమైన వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించేందుకు కశ్మీర్ గడ్డపై ఒక సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. జూన్ మొదటి వారంలో శ్రీనగర్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ సొంత గూటికి చేరనున్నారు.

ఆర్డర్ పిక్ చేసుకునేందుకు లేటుగా వచ్చాడని డెలివరీ బాయ్‌ను చితకబాదారు

ఆర్డర్ పిక్ చేసుకునేందుకు లేటుగా వచ్చాడని డెలివరీ బాయ్‌ను చితకబాదారు

కేవలం పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాడనే కారణంతో హైదరాబాద్‌లో ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పై ఐదుగురు హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

కారును గుద్ది అలా 600 మీటర్లు ఈడ్చుకెళ్లాడు.. దేవుడు కాపాడబట్టి తండ్రీకూతుళ్లు…

కారును గుద్ది అలా 600 మీటర్లు ఈడ్చుకెళ్లాడు.. దేవుడు కాపాడబట్టి తండ్రీకూతుళ్లు…

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ ట్రక్కు ఢీకొట్టడంతో కారు దాని ముందు భాగంలో ఇరుక్కుపోయి సుమారు 600 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కారులో ఉన్న తండ్రి, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడగా, వైరల్ వీడియోల ఆధారంగా పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: నడిరోడ్డుపై మహిళను వేధిస్తారా..? నేపాలీల బెండు తీసిన పోలీసులు

Hyderabad: నడిరోడ్డుపై మహిళను వేధిస్తారా..? నేపాలీల బెండు తీసిన పోలీసులు

నగరంలో మహిళను వేధించిన ఐదుగురు నేపాల్ జాతీయులకు కోర్టు జైలు శిక్ష విధించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితులను వేగంగా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మహిళల భద్రత విషయంలో రాజీ ఉండదని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

Hyderabad: మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా? జర భద్రం.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే..

Hyderabad: మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా? జర భద్రం.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే..

హైదరాబాద్ నగరంలో ఉదయం వాకింగ్‌కు వెళ్లే మహిళలను, ఒంటరిగా నడిచే పాదచారులను లక్ష్యంగా చేసుకుని వరుస చైన్ స్నాచింగ్‌లు, మొబైల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను జీడిమెట్ల పోలీసులు ఛేదించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) కుత్బుల్లాపూర్ బృందంతో కలిసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు గొలుసు, మొబైల్ ఫోన్, నేరాలకు ఉపయోగించిన హోండా డియో స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.