10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.
ఆపరేషన్ క్రాక్ డౌన్.. తెలంగాణలో ఎంత మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారో తెలుసా?
సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టింది. “ఆపరేషన్ క్రాక్ డౌన్” పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక దాడుల్లో సైబర్ మోసాలకు వినియోగిస్తున్న మ్యూల్ అకౌంట్లపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఒకేసారి దాడులు నిర్వహించి అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Feb 25, 2026
- 8:38 pm
YouTuber Komali: ప్రేమికుడితో బ్రేకప్.. తీవ్ర మనస్తాపంతో చివరికి
యూట్యూబర్ కోమలి హైదరాబాద్లోని చిత్రపురి కాలనీలో ఆత్మహత్య చేసుకున్నారు. యూట్యూబర్ అఖిల్తో ప్రేమ విఫలం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆత్మహత్యాయత్నం చేసిన కోమలి, తాజాగా ప్రియుడితో ఫోన్ సంభాషణ తర్వాత ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Feb 25, 2026
- 5:29 pm
Hyderabad: 56 లక్షలతో జంప్.. పుణేలో జల్సాలు.. కట్ చేస్తే.. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో..
హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో సంచలనం సృష్టించిన ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ మిస్టరీ వీడింది. నమ్మిన బంటే.. నట్టేట ముంచినట్లు ఏటీఎంలకు నగదు చేరవేసే డ్రైవరే నగదుతో ఉడాయించిన ఘటన కలకలం రేపింది. అనంతపురం నుంచి పుణే నగరాలను చుట్టొచ్చిన వెళ్లిన అజిత్ కుమార్.. చివరికి పోలీసుల సాంకేతిక వలలో ఎలా చిక్కాడు? అసలు ఆ డబ్బుతో ఏం చేశాడు? అనేది తెలుసుకుందాం..
- Lakshmi Praneetha Perugu
- Updated on: Feb 24, 2026
- 8:11 pm
దారుణం.. భార్య నిద్రపోతుండగా గొడ్డలితో నరికి చంపిన భర్త.. ఆ తరువాత ఏం చేశాడంటే..?!
రంగారెడ్డి జిల్లా నోముల గ్రామంలో భయంకర ఘటన చోటుచేసుకుంది. భర్త బాబు తన భార్య అమృతను ₹1000 అప్పు విషయంలో జరిగిన గొడవ, మద్యం మత్తులో గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, మద్యం దురలవాటు ఈ దారుణానికి కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Feb 24, 2026
- 8:07 pm
తెలివి మీరి పోతున్న గంజాయి స్మగ్లర్లు.. హోలీకి ముందుగానే కొత్త ఎత్తుగడతో రంగంలోకి.. కట్ చేస్తే…
హైదరాబాద్లో గంజాయి అక్రమ రవాణాకు కొత్త పంథా తెరపైకి వచ్చింది. ఎక్సైజ్ శాఖ నిఘాతో, నిందితులు గంజాయిని 'బంగ్' గోళీలు, చాక్లెట్ల రూపంలో మార్చి విక్రయిస్తున్నారు. ఎస్టీఎఫ్ ఏ టీమ్ ప్రత్యేక నిఘాలో చూడీబజార్, శంకర్బజార్లలో దాడులు నిర్వహించి లవకుశ్ శర్మ, భాను ప్రతాప్లను అరెస్టు చేసింది. భారీగా 'బంగ్' గోళీలు, గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Feb 24, 2026
- 7:24 pm
వాగులోకి దూసుకెళ్లిన బస్సు.. బస్సులో 37 మంది..
అదిలాబాద్ జిల్లా శ్యాంపూర్ బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు వాగులోకి దూసుకెళ్లింది. పొగమంచు, ఇరుకు వంతెనే దీనికి కారణం. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడినప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కండక్టర్ సహా 25 మందికి పైగా గాయపడ్డారు. మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Feb 24, 2026
- 1:57 pm
Hyderabad: సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి రూ.కోటి మాయం.. చివరకు ఎలా చిక్కారంటే..?
మీ ఫోన్కి ముంబై పోలీసుల పేరుతో వీడియో కాల్ వచ్చిందా..? మీరు అక్రమ లావాదేవీలు చేస్తున్నారని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా..? అయితే జాగ్రత్త.. మీరు డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో పడే ప్రమాదం ఉంది. తాజాగా హైదరాబాద్లో ఒక వృద్ధుడిని భయపెట్టి ఏకంగా రూ.1.07 కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Feb 10, 2026
- 7:04 pm
HCA President: హెచ్సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్.. అంబుడ్స్మన్ కీలక ఆదేశాలు..
HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 2023 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అంబుడ్స్మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్, ప్రస్తుత అధ్యక్షుడు జగన్ మోహన్ రావును పదవి నుంచి తొలగిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఆయన స్థానంలో గెలాక్సీ క్రికెట్ క్లబ్కు చెందిన అమర్నాథ్ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Feb 3, 2026
- 8:59 am
Telangana: ‘ఆపరేషన్ స్మైల్’తో 5,582 మంది చిన్నారులకు విముక్తి.. పిల్లలతో పనులు చేయిస్తే తాట తీస్తామంటున్న పోలీస్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు లక్ష్యంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. నెల రోజుల పాటు చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్- XII’ కార్యక్రమం ద్వారా మొత్తం 5,582 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా తెలిపారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 31, 2026
- 8:54 pm
Hyderabad: ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా తీన్ పత్తీ.. సడెన్గా పోలీస్ ఎంట్రీ..!
హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్జాదుల్లా బాగ్ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. శుక్రవారం (జనవరి 31) చేపట్టిన ఈ దాడిలో తీన్ పత్తీ (పేకాట) ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఫలక్నుమా ఇన్స్పెక్టర్ ఎ. సీతయ్య తెలిపారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 31, 2026
- 6:44 pm
హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం.. సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ సజ్జనార్
హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున జరిగిన కాల్పుల ఘట ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. కాల్పుల కేసులో హత్యాయత్నంతో పాటు రాబరీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 31, 2026
- 4:49 pm
Hyderabad: ఎయిర్పోర్టులో అనుమానంగా కనిపించిన గ్యాంగ్.. ఆపి చెక్ చేయగా.. వామ్మో..
హైదరాబాద్లో మరోసారి భారీ స్థాయిలో గంజాయి పట్టివేత కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 9.5 కోట్ల విలువైన 27.15 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. వీటిని తరలిస్తున్న మొత్తం ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 31, 2026
- 4:53 pm