10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.
HCA President: హెచ్సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్.. అంబుడ్స్మన్ కీలక ఆదేశాలు..
HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 2023 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అంబుడ్స్మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్, ప్రస్తుత అధ్యక్షుడు జగన్ మోహన్ రావును పదవి నుంచి తొలగిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఆయన స్థానంలో గెలాక్సీ క్రికెట్ క్లబ్కు చెందిన అమర్నాథ్ను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Feb 3, 2026
- 8:59 am
Telangana: ‘ఆపరేషన్ స్మైల్’తో 5,582 మంది చిన్నారులకు విముక్తి.. పిల్లలతో పనులు చేయిస్తే తాట తీస్తామంటున్న పోలీస్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు లక్ష్యంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. నెల రోజుల పాటు చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్- XII’ కార్యక్రమం ద్వారా మొత్తం 5,582 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా తెలిపారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 31, 2026
- 8:54 pm
Hyderabad: ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా తీన్ పత్తీ.. సడెన్గా పోలీస్ ఎంట్రీ..!
హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్జాదుల్లా బాగ్ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. శుక్రవారం (జనవరి 31) చేపట్టిన ఈ దాడిలో తీన్ పత్తీ (పేకాట) ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఫలక్నుమా ఇన్స్పెక్టర్ ఎ. సీతయ్య తెలిపారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 31, 2026
- 6:44 pm
హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం.. సంచలన విషయాలు బయటపెట్టిన సీపీ సజ్జనార్
హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున జరిగిన కాల్పుల ఘట ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. కాల్పుల కేసులో హత్యాయత్నంతో పాటు రాబరీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 31, 2026
- 4:49 pm
Hyderabad: ఎయిర్పోర్టులో అనుమానంగా కనిపించిన గ్యాంగ్.. ఆపి చెక్ చేయగా.. వామ్మో..
హైదరాబాద్లో మరోసారి భారీ స్థాయిలో గంజాయి పట్టివేత కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 9.5 కోట్ల విలువైన 27.15 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. వీటిని తరలిస్తున్న మొత్తం ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 31, 2026
- 4:53 pm
కోఠి ఎస్బీఐ వద్ద బుల్లెట్ల మోత.. ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగింది
హైదరాబాద్ కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. వస్త్ర వ్యాపారి రిన్షద్పై కాల్పులు జరిపి, 6 లక్షల రూపాయల నగదుతో ఇద్దరు నిందితులు ఉడాయించారు. పక్కా ప్రణాళికతో వచ్చిన దుండగులు సీసీ కెమెరాల్లో రికార్డయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 31, 2026
- 4:06 pm
అధికారినంటూ ఫోన్ చేస్తారు.. డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరిస్తారు.. భయపడ్డావో అంతే ఇక
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను మోసం చేస్తున్న ఓ హ్యాబిట్యువల్ సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తాను సైబర్ క్రైం పోలీస్ అధికారినని నటిస్తూ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడినట్లు డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. అంతేకాదు, డిజిటల్ ఆధారాలు లేకుండా చేసేందుకు బాధితులను మొబైల్ ఫోన్లను ఫ్యాక్టరీ రీసెట్ చేయించినట్టు విచారణలో కనుగొన్నారు. నిందితుడిపై పలు సెక్షల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 30, 2026
- 9:08 pm
Hyderabad: జాగ్రత్త గురూ.. డాక్టర్ సలహా లేకుండా ఈ ఇంజెక్షలు వాడితే అంతే ఇక..
హైదరాబాద్లో యువత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ల అక్రమ విక్రయాలు సాగిస్తున్న అబ్దుల్ గఫార్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కండరాల వృద్ధి కోరుకునే యువతను లక్ష్యంగా చేసుకుని, లైసెన్స్ లేకుండా ఈ షెడ్యూల్ హెచ్ డ్రగ్ను అధిక ధరకు విక్రయిస్తున్నాడు. దీని వాడకం వల్ల గుండెపోటు, అధిక రక్తపోటు వంటి తీవ్ర సమస్యలు వస్తాయని పోలీసులు హెచ్చరించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 30, 2026
- 7:05 pm
Hyderabad: చూడ్డానికి ఇలా ఉన్నాడు కానీ.. వీడు పడ్డ కథలు తెలిస్తే విస్తుపోవాల్సిందే..
సైబర్ క్రైం పోలీస్ అధికారిగా నటిస్తూ అమాయకులను మోసం చేసిన హ్యాబిట్యువల్ సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ మహిళా ప్రొఫైల్స్తో బాధితులను ట్రాప్ చేసి, అరెస్ట్ చేస్తామని భయపెట్టి యూపీఐ ద్వారా డబ్బులు వసూలు చేసిన ఈ నిందితుడిపై తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి 44 సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 30, 2026
- 6:16 pm
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
పాలమూరు జిల్లాలో నకిలీ పోలీసుల ముఠా కలకలం రేపుతోంది. అమాయక మహిళలు, వృద్ధులే లక్ష్యంగా బంగారాన్ని దోచుకుంటున్నారు. తాము మఫ్టీ పోలీసులమని నమ్మించి, దొంగల ముప్పు ఉందని చెప్పి, బంగారాన్ని కాగితంలో పెట్టినట్టు నటించి గులకరాళ్లు ఇచ్చి పరారవుతున్నారు. మహబూబ్నగర్లో వరుస దోపిడీలు జరిగాయి. పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 30, 2026
- 5:19 pm
Telangana: డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వెతికితే.. అకౌంట్ ఖాళీ అయ్యింది.. యువకుడికి ఊహించని షాక్..
మీరు ఫోన్లో చేసే ఒక చిన్న సెర్చ్.. మీ డబ్బును మాయం చేయగలదు. అనారోగ్యంతో బాధపడుతూ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం గూగుల్లో వెతికిన ఒక యువకుడికి, సైబర్ నేరగాళ్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. హాస్పిటల్ పేరుతో వచ్చిన ఒక్క ఫోన్ కాల్.. కేవలం 24 గంటల్లోనే అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ. 4.5 లక్షలను చిటికెలో మాయం చేసింది. ఎలా అంటే..?
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 30, 2026
- 4:12 pm
Hyderabad: తేడాగా కనిపించిన బాత్రూమ్ పైపులు.. చెక్ చేసిన చూసిన పోలీసులు షాక్..!
హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాపై ఎక్సైజ్ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ధూల్పేట్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో దాదాపు 2.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. బుధవారం ఎస్టీఎఫ్ టీమ్-ఏతో పాటు ధూల్పేట్ ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటి బాత్రూమ్లో అత్యంత చాకచక్యంగా దాచిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Jan 29, 2026
- 10:28 am