10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.
High Court: తెలంగాణ హైకోర్టులో ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో తెలుసా? నెంబర్ వింటే..
తెలంగాణ హైకోర్టులో కేసుల పెండెన్సీ భారీగా పెరిగిపోతోంది. న్యాయమూర్తుల కొరతకు తోడు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో న్యాయవ్యవస్థపై భారం ఎక్కువవుతుంది. 2025 జూన్ 30 నాటికి తెలంగాణ హైకోర్టులో 2.29 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో సివిల్, క్రిమినల్ కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Sep 5, 2026
- 4:46 pm
ఇలాక్కూడా చేస్తారా! ఇన్స్టా రీల్స్ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
శంషాబాద్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రూ.2.91 లక్షల నకిలీ నోట్లతో పాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నకిలీ నోట్లను తయారు చేసినట్లు విచారణలో తేలింది. సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్పై చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Sep 2, 2026
- 8:27 pm
Hyderabad: హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ట్రాఫిక్ లేని ప్రయాణం.. పోలీసుల కీలక నిర్ణయమిదే..
ఐటీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ట్రాఫిక్ పోలీసులు కొత్త ఆలోచన చేస్తున్నారు. జేఎన్టీయూ నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్ వరకు ప్రత్యేక క్యారేజ్వే ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. దీని వల్ల ఐటీ ఉద్యోగులు వేగంగా తమ ఆఫీసులకు చేరుకోవచ్చు. ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Sep 2, 2026
- 8:21 pm
పది చదివి.. పెద్ద డాక్టర్లలా ఫోజులు! హైదరాబాద్లో 10 మంది ఫేక్గాళ్లు అరెస్ట్
హైదరాబాద్లో నకిలీ వైద్యులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్లు నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్న 10 మందిని అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి మందులు, సెలైన్ బాటిళ్లు, సిరంజీలు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Sep 2, 2026
- 8:10 pm
Fake PhonePe Payment: నకిలీ ఫోన్పే స్క్రీన్తో కుచ్చుటోపీ.. అంబర్పేటలో నలుగురు అరెస్ట్
Fake PhonePe Payment: ఫోన్పే, గూగుల్పే లావాదేవీల సమయంలో స్క్రీన్షాట్ లేదా ‘పేమెంట్ సక్సెస్’ మెసేజ్ను మాత్రమే నమ్మి నగదు ఇవ్వవద్దని పోలీసులు సూచించారు. డబ్బు నిజంగా తమ ఖాతాలో జమ అయ్యిందో లేదో బ్యాంక్ యాప్, ఖాతా బ్యాలెన్స్ లేదా ఇతర అధికారిక..
- Lakshmi Praneetha Perugu
- Updated on: Sep 2, 2026
- 10:07 am
Hyderabad: గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు.. ఇవి పాటించకపోతే..
హైదరాబాద నగరంలో అప్పుడే వినాయక శోభ మొదలైంది. అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అత్తాపూర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉత్సవాలు ప్రశాంతంగా సాగేలా రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని హెచ్చరించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Sep 1, 2026
- 7:09 pm
Hyderabad: వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి విచారించగా..
హైదరాబాద్లో భారీగా హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. నగరంలో డ్రగ్స్ విక్రయించేందుకు వచ్చిన ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను టాస్క్ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏకంగా రూ.21 లక్షల 37 వేల 500 విలువైన 1.710 లీటర్ల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Sep 1, 2026
- 6:50 pm
డ్రంక్ అండ్ డ్రైవ్.. ఇకపై జరిమానాతో పాటు ఆ శిక్ష కూడా .!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి రూ.6 వేల జరిమానాతో పాటు ఒక రోజు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ డ్యూటీ చేయాలని ఆదేశించింది .
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 31, 2026
- 10:26 pm
Hyderabad: చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడని బుద్దిమంతుడనుకునెరు.. ఏం చేశాడో తెలిస్తే..
హైదరాబాద్లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు సయ్యద్ ముఖర్రమ్కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా రేప్, పోక్సో కేసుల ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 31, 2026
- 8:23 pm
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ముగ్గురు పోలీసులు.. ఒక్కో ఫ్యామిలీకి రూ.కోటి పరిహారం అందజేత!
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరుల కుటుంబాలకు తెలంగాణ పోలీస్ శాఖ కొండంత అండగా నిలిచింది. కర్తవ్య పాలనలో అసువులు బాసిన ముగ్గురు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్ల విలువైన ఎస్బీఐ బీమా పరిహార చెక్కులను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్వయంగా అందజేసి, వారిక పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందనే భరోసానిచ్చారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 31, 2026
- 8:02 pm
హైదరాబాద్లో అర్ధరాత్రి దొంగల హల్చల్.. గోడలు దూకి చోరీకి యత్నం! వీడియో
హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని పీర్జాదిగూడ బీపీఎం గ్రీన్ల్యాండ్స్ కాలనీలో అర్ధరాత్రి నలుగురు దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. ఇళ్ల చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతూ ఓ ఇంట్లోకి ప్రవేశించిన వారు.. మరో ఇంటి గోడ దూకేందుకు ప్రయత్నించగా, మహిళ అప్రమత్తమై కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 31, 2026
- 7:49 pm
Hyderabad: HCU విద్యార్థి మృతి కేసులో కీలక పరిణామం.. రూ. కోటి పరిహారం ఇవ్వాలని ఆదేశం!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సింటీ విద్యార్థి సూర్య ప్రతాప్ భారతి మృతి కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. వైద్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి మరణించాడని తేల్చిన కమిషన్, డాక్టర్లనే బాధ్యులుగా పేర్కొంటూ బాధిత కుటుంబానికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 45 రోజులలోపు పరిహారం చెల్లించకుంటే 9శాతం వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 31, 2026
- 5:01 pm