10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.
Hyderabad: HCU విద్యార్థి మృతి కేసులో కీలక పరిణామం.. రూ. కోటి పరిహారం ఇవ్వాలని ఆదేశం!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సింటీ విద్యార్థి సూర్య ప్రతాప్ భారతి మృతి కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. వైద్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి మరణించాడని తేల్చిన కమిషన్, డాక్టర్లనే బాధ్యులుగా పేర్కొంటూ బాధిత కుటుంబానికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 45 రోజులలోపు పరిహారం చెల్లించకుంటే 9శాతం వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 31, 2026
- 5:01 pm
హైదరాబాద్లో డిజిటల్ అరెస్ట్.. వృద్ధ దంపతుల నుంచి రూ.64 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!
హైదరాబాద్కు చెందిన 71 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, ఆయన భార్యను సైబర్ నేరగాళ్లు నాలుగు నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయపెట్టి రూ.64 లక్షలు కొల్లగొట్టారు. పహల్గాం ఉగ్రదాడి కేసులో మీ పేరు ఉందంటూ నకిలీ పోలీసు అధికారులు బెదిరించారు. బ్యాంకు ఖాతాల వెరిఫికేషన్ పేరుతో పలుమార్లు డబ్బులు బదిలీ చేయించారు..
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 31, 2026
- 4:57 pm
విషం శరీరంలోకి వెళ్లిందా..? ప్రతి నిమిషం కీలకమే
పాయిజనింగ్ కేసుల్లో ప్రతి నిమిషం అత్యంత కీలకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విషపదార్థం శరీరంలోకి వెళ్లిన వెంటనే లక్షణాలు కనిపించకపోయినా.. లోపల అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పాలు, ఉప్పునీరు, నిమ్మరసం ఇవ్వడం లేదా బలవంతంగా వాంతులు చేయించడం వంటి ఇంటి చిట్కాలతో కాలయాపన చేయకుండా
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 29, 2026
- 9:05 pm
Hyderabad: ఆన్లైన్ గేమ్స్ వ్యసనంతో దారితప్పిన మైనర్లు.. భారీ దొంగతనం.. రూ.18 లక్షలతో దొరికిపోయారు!
Hyderabad: దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టి ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. గేమింగ్ జోన్లకు వెళ్లి డబ్బులు ఖర్చు చేయడం, వ్యక్తిగత అవసరాలకు నగదు కొరత ఏర్పడటంతో విలువైన వస్తువులు, నగదు..
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 26, 2026
- 11:57 am
జూబ్లీహిల్స్ రిచ్కిడ్స్ కేసులో బిగ్ అప్డేట్.. మీనాకుమారికి కస్టడీలో వెలుగోకి కీలక విషయాలు!
సాధారణంగా పిల్లలకు మంచి మాటలు చెప్పే తల్లులను చూసి ఉంటారు, అలాగే పిల్లలు చెడు దారిలో వెళ్తే వారిని సరిదిద్దే తల్లిదండ్రులను చూసి ఉంటారు. కానీ ఇక్కడో తల్లి మాత్రం తానే పక్కనుండి పిల్లలతో నేరాలు చేయించడం మొదలుపెట్టింది. తమ పిల్లల సహాయంతో బాగా డబ్బున్న వారి పిల్లలను లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేసేది. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెతో పాటు తన ఇద్దరు కుమారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 22, 2026
- 1:53 pm
Hyderabad: మణికొండలో ట్రాఫిక్ కష్టాలు.. రహదారి విస్తరణ కోసం స్థానికులు ప్రజా వాకథాన్!
హైదరాబాద్ నగరంలో కేవలం ప్రధాన రహదారులే కాదు కాలనీల్లో ఉండే చిన్న దారుల వెంబడి కూడా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా మణికొండలోనూ ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోవడంతో రోడ్డు విస్తరణ చేపట్టి.. ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగించాలని స్థాసినికలు డిమాండ్ చేస్తున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 22, 2026
- 1:27 pm
Hyderabad: ఫొటోలో చూసి అమాయకుడు అనుకునేరు.. చేసిన పని తెలిస్తే..
భూములు, ప్లాట్లపై భారీ బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామంటూ అమాయకులకు ఎర... ఆపై అసలైన సేల్ డీడ్ పత్రాలు చేజిక్కించుకుని, వారికే తెలియకుండా మూడో వ్యక్తి పేరిట మార్చి కోట్లాది రూపాయల బ్యాంక్ రుణాలు కొల్లగొట్టడం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదేళ్లుగా సాగుతున్న ఈ లోన్ దందా సాగిస్తున్న కేటుగాడికి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు చెక్ పెట్టారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 15, 2026
- 7:00 pm
హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల రూపాయల సరుకు సీజ్!
హైదరాబాద్ నగర శివార్లలో గడువు ముగిసిన ముడిసరుకులు, ప్రమాదకర రసాయనాలు, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ఒక అక్రమ కేంద్రాన్ని సైబరాబాద్ సీపీ టాస్క్ఫోర్స్ పోలీసులు బాహాటం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరు గ్రామంలో ఉన్న M/s KSM ఫుడ్ ప్రోడక్ట్స్ తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 15, 2026
- 5:08 pm
ఇక బాదుడే..! ఇంటి ముందు కారు పార్క్ చేసినా రూ.25 వేలు.. కొత్త పార్కింగ్ రూల్స్ ఇవే!
Bengaluru Parking Rules 2026: బెంగళూరులో కొత్త పార్కింగ్ విధానం నగరవాసులపై అదనపు భారం మోపనుంది. ఇంటి ముందు పబ్లిక్ రోడ్డుపై కారును పార్క్ చేసేందుకు వాహనం పరిమాణాన్ని బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు రుసుము చెల్లించాల్సి రావచ్చు. కొత్త పార్కింగ్ రూల్స్లో ఇంకా ఏం ప్రతిపాదించారో తెలుసుకోండి.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 14, 2026
- 2:21 pm
Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
హైదరాబాద్లో ఏటీఎం చోరీకి యత్నించిన ముఠా గుట్టును మియాపూర్ పోలీసులు ఛేదించారు. మియాపూర్ ఎక్స్ రోడ్డులోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. రాడ్లు, రాళ్లతో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఏటీఎం తెరుచుకోక పోవడంతో నగదు చోరీ కాలేదు. కానీ ఏటీఎంకు సంబంధించిన బ్యాకప్ బ్యాటరీలను మాత్రం ఎత్తుకెళ్లారు.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 12, 2026
- 9:32 pm
ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
హైదరాబాద్ నగర శివారులో అమానుష ఘటన వెలుగు చూసింది. తీసుకున్న అప్పు తీర్చలేదని పసికందుకు ఎత్తుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కేవలం రూ.30 వేల అప్పు తీసుకున్న వ్యవహారంలో ఓ కుటుంబానికి చెందిన 21 రోజుల పసిబాబును కొందరు వ్యక్తులు ఇంటి నుంచి ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 12, 2026
- 7:53 pm
Telangana: ఈ అమ్మాయిల నుంచి మీకు ఫోన్ వచ్చిందా.. వీళ్లది మామూలు కథ కాదు.. దిమ్మతిరిగిపోతుంది..
లోన్ ఇప్పిస్తామంటూ ఫోన్ కాల్.. ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో వసూళ్లు.. ఆపై సర్వస్వం ఊడ్చేసి, ప్రశ్నిస్తే వ్యక్తిగత వివరాలతో బెదిరింపులు. గత ఏడాదిన్నరగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ సైబర్ మాయాజాలాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. విస్తుపోయే విషయమేమిటంటే.. హైదరాబాద్, జగిత్యాల ప్రాంతాలకు చెందిన యువతులనే టెలికాలర్లుగా మార్చుకుని ఈ దందాను నడిపిస్తుండటం.
- Lakshmi Praneetha Perugu
- Updated on: Aug 10, 2026
- 8:47 pm