షాకింగ్ : గద్వాలలో కుక్కలకు కరోనా పరీక్షలు..
ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఇప్పుడు చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పటికే ఎన్నో దేశాలు లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం టెస్టులపై ఫోకస్ పెట్టాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో జంతువులకూ కరోనా టెస్టులు తప్పడం లేదు. కుక్కలకు కరోనా వైరస్ సోకిందని గ్రామస్థుల కంప్లైంట్ చేయడంతో అధికారులు అందుకు సంబంధించిన టెస్టులు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామంలో మంగళవారం (ఏప్రిల్ 29) ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో కొన్ని కుక్కలు వింతగా ప్రవర్తిస్తుండటంతో […]
ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఇప్పుడు చిన్నాభిన్నం చేస్తోంది. ఇప్పటికే ఎన్నో దేశాలు లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం టెస్టులపై ఫోకస్ పెట్టాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో జంతువులకూ కరోనా టెస్టులు తప్పడం లేదు. కుక్కలకు కరోనా వైరస్ సోకిందని గ్రామస్థుల కంప్లైంట్ చేయడంతో అధికారులు అందుకు సంబంధించిన టెస్టులు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామంలో మంగళవారం (ఏప్రిల్ 29) ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామంలో కొన్ని కుక్కలు వింతగా ప్రవర్తిస్తుండటంతో కోవిడ్-19 సోకిందని అనుమానించారు. గ్రామ సర్పంచ్ ఈ విషయాన్ని అధికారులకు తెలియపరిచారు. దీంతో పశుసంవర్ధ శాఖకు చెందిన మెడికల్ టీమ్ గ్రామంలోని కుక్కల నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వాటికి కరోనా సోకలేదని స్పష్టం చేశారు.
గ్రామ సమీపంలోని కోళ్ల వ్యర్థాలను తిని కుక్కలు వింతగా ప్రవర్తిస్తున్నాయని.. అంతేగానీ వాటికి కరోనా వైరస్ సోకలేదని డాక్టర్ రాజేశ్ వెల్లడించారు. వాటికి రోగ నిరోధక టీకాలు వేశామని ఆయన పేర్కొన్నారు . అమెరికాలోని న్యూయార్క్ సిటీలోని ఓ జూలో కొన్ని పులులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. న్యూయార్క్ నగరంలో రెండు పెంపుడు పిల్లులకు కూడా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.