AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదేం కర్మరా భగవంతుడా.! చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చిన్రు.. హైదరాబాదీస్ బీ పరేషాన్

యాదాద్రి జిల్లాలో చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. మారణాయుధాలు చేతపట్టి తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డి గ్యాంగ్ స్థానికులను బ్రాంతులకు గురిచేస్తోంది. చేతిలో మారణాయుధాలతో దొంగలు సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వివరాలు ఇలా..

Telangana: ఇదేం కర్మరా భగవంతుడా.! చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చిన్రు.. హైదరాబాదీస్ బీ పరేషాన్
Cheddi Gang
M Revan Reddy
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 18, 2025 | 12:44 PM

Share

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం సమీపంలో గల అంజన సాయి మెడోస్ వెంచర్లోకి చొరబడ్డారు. తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామానికి చెందిన డొప్ప నరేష్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు. అంజనసాయి మెడోస్ వెంచర్‌లోని కృష్ణవేణి హైస్కూల్ వెనుక వైపున ఉన్న చీకూరి శ్రీనివాస్ ఇంట్లో కుటుంబం అద్దెకు ఉంటోంది. నారాయణపురం మండలం పుట్టపాక బంధువుల ఇంటిలో జరిగిన ఫంక్షన్ కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చిన నరేష్.. ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించాడు. ఆందోళనకు గురై వెంటనే బీరువా ఓపెన్ చేసి చూసాడు. 8గ్రాముల బంగారం, 8.5 తులాల వెండితోపాటుగా నగదు కన్పించలేదు. దీంతో సురేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు.

ముగ్గురు సభ్యులు గల బృందం ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. ముగ్గురు దొంగలు ముసుగులు ధరించారు. అందులో ఒకరు వ్యక్తి డ్రాయర్ మాత్రమే ధరించి, ఒంటికి నూనె రాసుకుని ఉన్నాడు. అయితే దొంగతనానికి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్ సభ్యులేనా లేక స్థానికంగా ఉండే దొంగలే ముసుగులు ధరించి హల్చల్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.

ఇది చదవండి: ఎవడు మమ్మీ వీడు.! 42 ఫోర్లతో 437 పరుగులు.. దెబ్బకు బౌలర్లను పేకాటాడేశాడుగా

ఇవి కూడా చదవండి