Asian Games 2023 Medals Tally: ఒక్కరోజే 6 స్వర్ణాలు.. ఆసియా క్రీడల్లో సెంచరీ దాటిన భారత్ పతకాలు.. పూర్తి వివరాలు ఇవే..
ఆసియా క్రీడల పురుషుల కబడ్డీ ఈవెంట్లో భారత్కు స్వర్ణ పతకం లభించింది. వివాదాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 33–29తో ఇరాన్ను ఓడించింది. ఇప్పటివరకు భారత్ 28 స్వర్ణాలు సహా 105 పతకాలు సాధించింది. ఇరు జట్లు 28-28తో సమంగా నిలవడంతో పాయింట్ల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. వివాదం సద్దుమణిగిన తర్వాత మళ్లీ పోటీ ప్రారంభమై భారత్ స్వర్ణం సాధించింది.

ఆసియా క్రీడల పురుషుల కబడ్డీ ఈవెంట్లో భారత్కు స్వర్ణ పతకం లభించింది. వివాదాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 33–29తో ఇరాన్ను ఓడించింది. ఇప్పటివరకు భారత్ 28 స్వర్ణాలు సహా 105 పతకాలు సాధించింది. ఇరు జట్లు 28-28తో సమంగా నిలవడంతో పాయింట్ల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. వివాదం సద్దుమణిగిన తర్వాత మళ్లీ పోటీ ప్రారంభమై భారత్ స్వర్ణం సాధించింది.
విలువిద్య 2 రెండు స్వర్ణాలతో సహా, పురుషుల క్రికెట్, బ్యాడ్మింటన్, మహిళల కబడ్డీలలో భారతదేశం ఒకేరోజో 6 స్వర్ణాలు సాధించింది. ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా 100 పతకాల మార్కును దాటింది. అంతకుముందు 2018 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది.
14వ రోజు పతకాల ఈవెంట్లు..
రెజ్లింగ్లో భారత్కు రజతం లభించగా, పురుషుల 86 కేజీల ఫ్రీస్టైల్ ఫైనల్లో దీపక్ పునియా 10-0తో ఇరాన్కు చెందిన హసన్ యజ్దానీ చరతీపై ఓడిపోయాడు. పునియా రజతంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కబడ్డీ మహిళలు, పురుషుల జట్టు స్వర్ణం సాధించగా.. ఫైనల్లో భారత మహిళల కబడ్డీ జట్టు 26-25తో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం సాధించింది. పురుషుల జట్టు 33-29తో ఇరాన్ను ఓడించి స్వర్ణం సాధించింది.




క్రికెట్ ఫైనల్ వర్షంతో రద్దు..
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. టాప్ సీడింగ్ టీమ్ కావడంతో భారత్ను విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లకు 112 పరుగులు చేసిన ఈ మ్యాచ్లో ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తి కాలేదు. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు.
బ్యాడ్మింటన్లో సాత్విక్-చిరాగ్ స్వర్ణం..
అంతకుముందు బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఈవెంట్లో సాత్విక్-చిరాగ్ జోడీ భారత్కు స్వర్ణం అందించింది. ఆ తర్వాత మహిళల కబడ్డీ జట్టు ఫైనల్లో చైనీస్ తైపీని 26-25తో ఓడించి స్వర్ణం సాధించింది. ఈ ఈవెంట్లో భారత్కు ఇది 100వ పతకం.
ఆర్చరీ ఈవెంట్లలో రెండు స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం..
ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత మహిళల ఈవెంట్లో రెండు పతకాలతో నేడు అంటే అక్టోబర్ 7న ప్రారంభమైంది. కాంపౌండ్ వ్యక్తిగత మహిళల ఆర్చరీలో అదితి గోపీచంద్ స్వామి భారత్కు తొలి పతకాన్ని అందించారు. కాంస్య పతకం కోసం జరిగిన ఈ మ్యాచ్లో అదితి 146-140తో మలేషియాకు చెందిన రతీహ్ ఫడ్లీపై విజయం సాధించింది.
అదే సమయంలో భారత్కు ఇదే ఈవెంట్లో రెండో పతకం లభించింది. స్వర్ణ పోరులో జ్యోతి సురేఖ వెన్నం 149-145తో దక్షిణ కొరియాకు చెందిన సో చెవాన్పై విజయం సాధించింది. చావోన్ రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత పురుషుల ఈవెంట్లో మహిళల తర్వాత భారత్కు బంగారు, రజత పతకాలు లభించాయి. స్వర్ణం పోరులో ఓజాస్ ప్రవీణ్ 149-147తో స్వదేశానికి చెందిన అభిషేక్ వర్మపై విజయం సాధించాడు. అభిషేక్ రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అక్టోబరు 10న ఆసియా పతక విజేతలతో ప్రధాని భేటీ..
ఆసియా క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులందరినీ ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 10న కలవనున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆసియా క్రీడల్లో భారత్కు ఒక ముఖ్యమైన విజయం! 100 పతకాలు సాధించడం పట్ల భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు.
‘క్రీడాకారులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రదర్శన చరిత్ర సృష్టించి మన హృదయాలను గర్వంతో నింపారు. అక్టోబర్ 10న మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, మన అథ్లెట్లతో సంభాషించడానికి నేను ఎదురుచూస్తున్నాను’ అంటూ పీఎం మోడీ రాసుకొచ్చారు.