AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవర్రా మీరంతా.. వికెట్ కీపర్‌గా ఎన్నడూ కీపింగ్ చేయని ఆటగాడు.. ఎక్కడో తెలుసా?

Vinoo Mankad Trophy: ఈ సంఘటన మరోసారి DDCA పాలనలో పారదర్శకత లోపాలు ఉన్నాయనే ఆందోళనను పెంచింది. జట్టు ఎంపిక సమావేశాలకు అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు హాజరు కాకూడదని లోక్‌పాల్ (అంబుడ్స్‌మన్) గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈ U19 సెలక్షన్ మీటింగ్‌కు DDCA కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎవర్రా మీరంతా.. వికెట్ కీపర్‌గా ఎన్నడూ కీపింగ్ చేయని ఆటగాడు.. ఎక్కడో తెలుసా?
Vinoo Mankad Trophy
Venkata Chari
|

Updated on: Oct 08, 2025 | 8:12 AM

Share

Delhi Squad: క్రికెట్ ప్రపంచంలో ప్రతిభకు మాత్రమే చోటు ఉండాలి. కానీ, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) లో మాత్రం అంతర్గత రాజకీయాలు, ఒత్తిడికి సెలక్షన్ కమిటీలు తలొగ్గుతున్నాయనడానికి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. త్వరలో జరగబోయే ప్రతిష్టాత్మకమైన వినూ మన్కడ్ ట్రోఫీ (అండర్-19) కోసం ప్రకటించిన ఢిల్లీ జట్టు ఎంపికపై ఇప్పుడు పెద్ద వివాదం చెలరేగింది.

వివాదానికి కారణం ఏంటి?

తాజాగా ప్రకటించిన ఢిల్లీ అండర్-19 జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఒక ఆటగాడిని ఎంపిక చేశారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సదరు ఆటగాడికి వికెట్ కీపింగ్ అనుభవమే లేదని, అతడు కేవలం ఓపెనింగ్ బ్యాటర్‌ మాత్రమేనని DDCA లోని వర్గాలు ఆరోపిస్తున్నాయి.

అధికారుల ఒత్తిడి వల్లే ఎంపిక..!

సెలక్షన్ కమిటీ సభ్యులపై ఒక సీనియర్ DDCA అధికారి తీవ్ర ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆ ఓపెనింగ్ బ్యాటర్‌ను వికెట్ కీపర్‌ కోటాలో జట్టులోకి తీసుకున్నారని తెలుస్తోంది. నిజానికి, జట్టులో అభిరాజ్ గగన్ సింగ్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఉన్నాడు. అతనికి బ్యాకప్‌గా సరైన కీపర్లను ఎంపిక చేయకుండా, ఒక సీనియర్ అధికారి సిఫారసు మేరకు కీపింగ్ అనుభవం లేని ఆటగాడిని చేర్చడంపై అసోసియేషన్‌లోనే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం పక్షపాతానికి, సిఫారసులకు నిదర్శనమని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి

DDCA అధ్యక్షుడు రోహన్ జైట్లీ జోక్యం..

విషయం DDCA అధ్యక్షుడు రోహన్ జైట్లీ దృష్టికి వెళ్లడంతో, ఆయన తక్షణమే దీనిపై చర్యలు తీసుకున్నారు. ఎంపికైన ఆటగాడికి కీపింగ్ అనుభవం లేదని నిర్ధారించుకున్న తర్వాత, ఆ వివాదాస్పద ఆటగాడిని జట్టు నుంచి తొలగించాలని ఆదేశించారు. అతని స్థానంలో మెరిట్ ఆధారంగా, నిజమైన వికెట్ కీపర్‌ను ఎంపిక చేయాలని సూచించారు. అధ్యక్షుడి జోక్యంతో, సవరించిన జట్టును అధికారులు రాంచీకి పంపించారు.

పాలనలో పారదర్శకత లేమి..

ఈ సంఘటన మరోసారి DDCA పాలనలో పారదర్శకత లోపాలు ఉన్నాయనే ఆందోళనను పెంచింది. జట్టు ఎంపిక సమావేశాలకు అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు హాజరు కాకూడదని లోక్‌పాల్ (అంబుడ్స్‌మన్) గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈ U19 సెలక్షన్ మీటింగ్‌కు DDCA కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది అంతర్గత రాజకీయాలు ఇంకా సెలక్షన్ కమిటీల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయనడానికి నిదర్శనమని విమర్శకులు అంటున్నారు.

అధ్యక్షుడు రోహన్ జైట్లీ సకాలంలో జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగినప్పటికీ, ఢిల్లీ క్రికెట్‌లో ఎంపిక ప్రక్రియపై అప్రకటిత ఒత్తిళ్లు, పక్షపాతం కొనసాగుతున్నాయని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..