AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లార్డ్స్‌లో హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ ఫిక్స్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరెంట్స్..!

Rohit Sharma ODI Retirement: భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన నాయకుడిగా, తిరుగులేని ఓపెనర్‌గా రోహిత్ శర్మ అందించిన సేవలు చిరస్మరణీయం. 2023 ప్రపంచకప్ ఫైనల్ వరకు జట్టును నడిపించిన రోహిత్, కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. లార్డ్స్ మైదానంలో జరగబోయే తన చివరి వన్డే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ తనదైన శైలిలో భారీ ఇన్నింగ్స్ ఆడి, కన్నవారి సమక్షంలో సగర్వంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు.

ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లార్డ్స్‌లో హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ ఫిక్స్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరెంట్స్..!
Ind Vs Eng 2nd Odi Rohit Sharma Parents
Venkata Chari
|

Updated on: Jul 17, 2026 | 7:48 AM

Share

Rohit Sharma ODI Retirement: భారత క్రికెట్ అభిమానుల గుండెలు పగిలే వార్త ఇది. టీమిండియా దిగ్గజ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన వన్డే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకడానికి సిద్ధమయ్యాడు. జులై 19న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగబోయే ఆఖరి వన్డే మ్యాచ్‌లో రోహిత్ తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలకనున్న తరుణంలో, ఈ అద్భుతమైన ఘట్టాన్ని కళ్లారా వీక్షించడానికి అతని తల్లిదండ్రులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు.

లార్డ్స్‌లో చారిత్రాత్మక క్షణం.. కళ్లారా చూడనున్న కన్నోళ్లు..

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) సెలెక్టర్లు 2027 వన్డే ప్రపంచకప్ కోసం భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేస్తూ, రోహిత్‌ను పక్కన పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే సిరీస్ తన కెరీర్‌లో ఆఖరిది కానుందని సెలెక్టర్లు స్పష్టం చేయడంతో, రోహిత్ శర్మ సైతం సగర్వంగా తప్పుకోవాలని భావిస్తున్నాడు. ముంబై వర్గాల నుంచి అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం, ఆదివారం జరిగే తన వీడ్కోలు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రోహిత్ శర్మ తన తల్లిదండ్రులైన గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మలను లండన్ రప్పించాడు. భారత నీలి రంగు జెర్సీలో తమ కుమారుడిని ఆఖరిసారిగా చూసేందుకు ఆ తల్లిదండ్రులు లార్డ్స్ మైదానంలో హాజరు కానుండటం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే..?

ఇవి కూడా చదవండి

యువ రక్తం వైపే మొగ్గు.. గంభీర్ సరికొత్త వ్యూహం

కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఎంపిక కమిటీ భవిష్యత్తు వైపే అడుగులు వేస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని యశస్వి జైస్వాల్ లాంటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లకు ఓపెనర్లుగా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. నిజానికి గత ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌తోనే రోహిత్ కెరీర్ ముగుస్తుందని భావించినా, ఆ సిరీస్‌లో సాధించిన హాఫ్ సెంచరీ కారణంగా సెలెక్టర్లు ఈ నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేశారు. అయితే ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. మొదటి వన్డేలో 11 పరుగులు, రెండో మ్యాచ్‌లో 26 పరుగులు మాత్రమే చేసి, ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో సెలెక్టర్లు తమ నిర్ణయాన్ని రోహిత్‌కు స్పష్టం చేశారు.

మూడు ఫార్మాట్లలోనూ ముగిసిన అద్భుత శకం..

రోహిత్ శర్మ ఇప్పటికే మిగిలిన రెండు ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేసిన సంగతి తెలిసిందే. 2024 జూన్ 29న భారత జట్టుకు ట్వంటీ-20 ప్రపంచకప్ అందించి ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 2025 మే నెలలో ఒక సామాజిక మాధ్యమం వేదికగా టెస్టు క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరగబోయే మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌కు కూడా తెరపడనుంది.

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు దద్దమ్మలు ఇక ఇంటికే.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన పులి.. కోహ్లీ దోస్త్ గ్రాండ్ ఎంట్రీ?

రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లో సృష్టించిన రికార్డులు అసాధారణమైనవి:

మొత్తం వన్డేలు: 286 మ్యాచ్‌లు

సాధించిన పరుగులు: 11,731 రన్స్

బ్యాటింగ్ సగటు: 48.67

శతకాలు & అర్ధశతకాలు: 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు

అత్యున్నత రికార్డు: వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (264 పరుగులు) చేసిన ఏకైక బ్యాటర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us