AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK Video: పాక్ జట్టును బౌల్ ఔట్‌తో భయపెట్టిన భారత్.. 17 ఏళ్ల వీడియో గుర్తుందా?

India vs Pakistan Bowl-Out: 2007 టీ20 ప్రపంచ కప్‌లో, టై మ్యాచ్‌ల ఫలితాన్ని నిర్ణయించడానికి బౌల్ అవుట్ నియమాన్ని ప్రవేశపెట్టారు. ఈ నిబంధనను భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో అమలు చేశారు. కానీ 2007 టీ20 ప్రపంచ కప్ తర్వాత, ఈ నియమం రద్దు చేశారు. టై మ్యాచ్‌ల ఫలితాలను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ ప్రవేశపెట్టారు.

IND vs PAK Video: పాక్ జట్టును బౌల్ ఔట్‌తో భయపెట్టిన భారత్.. 17 ఏళ్ల వీడియో గుర్తుందా?
Ind Vs Pak Bowl Out
Venkata Chari
|

Updated on: Sep 14, 2024 | 5:47 PM

Share

India vs Pakistan Bowl-Out: అది సెప్టెంబర్ 14, 2007.. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ మైదానంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో 10వ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. పాక్ కెప్టెన్ షోయబ్ మాలిక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు.

ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను మహ్మద్ ఆసిఫ్ ఔట్ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ 5 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ (1) కూడా వికెట్ కోల్పోయాడు.

ఇవి కూడా చదవండి

ఈ దశలో చేరిన రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోనీలు జట్టును తొలి షాక్ నుంచి తప్పించడం ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ప్రదర్శించిన ఉతప్ప 39 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. మరోవైపు ధోనీ 31 బంతుల్లో 33 పరుగులు చేశాడు.

చివరి ఓవర్లలో ఇర్ఫాన్ పఠాన్ 20 పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.

పాకిస్థాన్‌కు 142 పరుగుల లక్ష్యం..

142 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్పీ సింగ్ తొలి షాక్ ఇచ్చాడు. మూడో ఓవర్లో ఇమ్రాన్ నజీర్ (7) వికెట్ తీసి తొలి విజయాన్ని అందించాడు. సల్మాన్ బట్ (17)ను అగార్కర్ ఔట్ చేయగా, ఇర్ఫాన్ పఠాన్ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

దీంతో చివరి ఓవర్లో పాక్ జట్టు విజయానికి 12 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్ వేసిన శ్రీశాంత్ 11 పరుగులు ఇచ్చాడు. దీంతో మ్యాచ్ 141 పరుగులతో టైగా ముగిసింది.

బౌల్ అవుట్ నియమం..

మ్యాచ్ టై అయినందున, ఫలితాన్ని నిర్ణయించడానికి బౌల్ అవుట్‌ని ప్రవేశ పెట్టారు. ఈ నియమం ప్రకారం, ఏ జట్టు 5 బంతుల్లో ఎక్కువ వికెట్లు పడగొడుతుందో ఆ జట్టు విజేతగా ప్రకటిస్తారు.

తొలి రౌండ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ భారత్ తరఫున బౌలింగ్ చేశాడు. క్లీన్ బౌల్డ్ చేశాడు.

పాక్‌ తరపున తొలి బంతికి యాసిర్‌ అరాఫత్‌ విఫలమయ్యాడు.

భారత్‌ తరపున రెండో బంతిని వేసిన హర్భజన్ సింగ్ క్లీన్ బౌలింగ్‌లో సఫలమయ్యాడు.

పాకిస్థాన్‌ తరపున రెండో బంతిని ఉమర్‌ గుల్‌ వికెట్‌కి కొట్టలేకపోయాడు.

టీమిండియా తరపున మూడో బంతికే రాబిన్ ఉతప్ప క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

పాకిస్థాన్‌కు కీలకమైన మూడో బంతిని బౌలింగ్ చేయడంలో షాహిద్ ఆఫ్రిది విఫలమయ్యాడు.

దీంతో తొలి బౌలింగ్‌లో భారత జట్టు 3-0 తేడాతో విజయం సాధించింది. కాగా, ఈ బౌల్ అవుట్ మ్యాచ్‌కు నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాచి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ఫలితానికి సంబంధించిన బౌల్ అవుట్ వీడియోను ఐసీసీ తన అధికారిక ఖాతాలో షేర్ చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..