AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: బంగ్లాతో రెండో టెస్టు.. ఆ సీనియర్ ప్లేయర్ కు నో ప్లేస్.. టీమ్‌లోకి యంగ్ డైనమైట్

చెన్నైలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. రెండో టెస్టు మ్యాచ్‌కి భారత జట్టును కూడా ఇది వరకే ప్రకటించారు. దీని ప్రకారం తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన ఆటగాళ్లతోనే దాదాపుగా రెండో టెస్టు మ్యాచ్‌కు కూడా  బరిలోకి దిగనుంది భారత్.

IND vs BAN: బంగ్లాతో రెండో టెస్టు.. ఆ సీనియర్ ప్లేయర్ కు నో ప్లేస్.. టీమ్‌లోకి యంగ్ డైనమైట్
India Vs Bangladesh
Basha Shek
|

Updated on: Sep 24, 2024 | 7:45 AM

Share

చెన్నైలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. రెండో టెస్టు మ్యాచ్‌కి భారత జట్టును కూడా ఇది వరకే ప్రకటించారు. దీని ప్రకారం తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన ఆటగాళ్లతోనే దాదాపుగా రెండో టెస్టు మ్యాచ్‌కు కూడా  బరిలోకి దిగనుంది భారత్. తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌, ఆల్‌రౌండర్లు, బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. అయితే టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. అయితే రెండో టెస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాలకు ఎలాంటి ఢోకా లేదు. అయితే కేఎల్ రాహుల్ పై మాత్రం ఉద్వాసన కత్తి వేలాడుతోంది. మొదటి టెస్టులో రాహుల్ చాలా డిఫెన్సివ్ గేమ్‌కు ప్రాధాన్యతనిస్తూ సులువుగా వికెట్ సమర్పించుకున్నాడు. అందుకే అతడిని జట్టు నుంచి తప్పించాలన్న నినాదం బలంగా వినిపిస్తోంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ ఎక్కువ సేపు క్రీజులో ఉండి కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేసిన రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 22 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కాన్పూర్ టెస్టు మ్యాచ్ నుంచి రాహుల్ ను తప్పించే అవకాశం ఉంది.

టెస్టు సిరీస్‌కు ముందు, రాహుల్ శ్రీలంకతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఉన్నాడు. కానీ ఈ సిరీస్‌లోనూ రాహుల్ తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. రాహుల్ తన తొలి మ్యాచ్‌లో 31 పరుగులు, రెండో మ్యాచ్‌లో 0 పరుగులు చేశాడు. ఆ తర్వాత 3వ గేమ్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కాన్పూర్ టెస్టులో రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోకి తీసుకవచ్చు. 2024 ప్రారంభంలో ఇంగ్లండ్‌పై సర్ఫరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో 50 సగటుతో 200 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో సర్ఫరాజ్ ఖాన్ లోయర్ మిడిల్ ఆర్డర్‌లో బాగా ఆకట్టుకున్నాడు. సర్ఫరాజ్ ఆటతీరును రోహిత్ కూడా మెచ్చుకున్నాడు. అటువంటి పరిస్థితిలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌లో రాహుల్ స్థానంలో సర్ఫరాజ్‌కి అవకాశం లభించవచ్చు.

రెండో టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సావి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..