![విరాట్ కోహ్లీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/11/virat-kohli-150-150.png)
విరాట్ కోహ్లీ
రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. క్రికెట్ దేవుడు సచిన్ తర్వాత మోస్ట్ క్రేజీ ప్లేయర్గా యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలచిన టీమిండియా ఆటగాడు. ఇక నీ పని అయిపోయింది.. పొయ్యి రెస్ట్ తీస్కో.. టీమిండియా నుంచి తీసెయ్యండి.. అంటూ విషం కక్కే తన హేటర్స్కి ప్రతిసారీ తన బ్యాట్తోనే సమాధానం చెబుతాడు. తనపై వచ్చే విమర్శలను సైలెంట్గా భరించే కింగ్ కోహ్లీ తన బ్యాటింగ్తో వయెలెంట్ రిప్లయ్ ఇచ్చేస్తాడు. 1988 నవంబరు 5న ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన కింగ్ కోహ్లీ.. తన మూడో ఏట నుంచే బ్యాటింగ్లో శిక్షణ మొదలుపెట్టాడు. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన కోహ్లీ.. ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట తిరగరాసుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే మేటి ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు సాధించాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను 2017లో కోహ్లీ పెళ్లి చేసుకున్నాడు.
2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కోహ్లీ..ఆనతి కాలంలోనే టీమిండియా వన్డే జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ దశాబ్ధపు మేటి పురుష క్రికెటర్గా కోహ్లీ పేరును ఐసీసీ 2020లో ప్రకటించడం విశేషం. వన్డేలో అత్యధిక సెంచరీలు (50) సాధించిన ఆటగాడికి ప్రపంచ రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్తో నవంబరు 15న ముంబై వేదికగా జరిగిన వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్లో కోహ్లీ తన 50వ సెంచరీని పూర్తి చేసి.. సచిన్ (49) రికార్డును అధిగమించాడు. కేవలం 279 ఇన్నింగ్స్లో కోహ్లీ ఈ రికార్డు సాధించాడు. అలాగే వరల్డ్ కప్లో ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ కోహ్లీ ఘనత సాధించాడు. టీ20, ఐపీఎల్లో అత్యధిక పరుగుల రికార్డులు కోహ్లీ పేరిటే ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలుస్తున్నాడు. 2011 క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా జట్టులో కోహ్లీ ప్రాతినిధ్యంవహించాడు. 2013లో ఐసీసీ ర్యాంకింగ్స్లో వన్డే ఫార్మెట్లో నెం.1 బ్యాట్స్మన్గా నిలిచాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ)కి ఐపీఎల్లో ప్రాతినిధ్యంవహిస్తున్న కోహ్లీకి.. తన జట్టుకు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించకపోవడం మాత్రమే కాస్త అసంతృప్తి కలిగించే అంశం.
Virat Kohli: విరాట్ కోహ్లీతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంది? ప్రెస్ కాన్ఫరెన్స్లో ఊహించని ఆన్సర్ ఇచ్చిన గంభీర్..
Gautam Gambhir on Virat Kohli: ఊహించిన విధంగానే ప్రెస్ కాన్ఫరెన్స్ లో గౌతమ్ గంభీర్కు ఎన్నో బర్నింగ్ క్వశ్చన్స్ వేయగా, వాటికి ధీటుగా సమాధానమిచ్చాడు. ఆ ప్రశ్నలలో ఒకటి విరాట్ కోహ్లీతో గంభీర్ సత్సంబంధాలపైనా కూడా అడిగారు. విరాట్తో రిలేషన్షిప్ గురించి అడిగిన ప్రశ్నకు కూడా గంభీర్ చక్కటి సమాధానం చెప్పుకొచ్చాడు. గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో చెప్పిన 5 కీలక విషయాలను తెలుసుకుందాం..
- Venkata Chari
- Updated on: Jul 22, 2024
- 12:19 pm
Video: కోహ్లీ, రోహిత్ భవిష్యత్పై గంభీర్ కీలక వ్యాఖ్యలు.. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నాడంటే?
Virat Kohli and Rohit Sharma Future: టీమిండియా ICC T20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. రాబోయే కాలంలో టీమిండియా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2027లో వన్డే ప్రపంచకప్ ఆడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఎన్ని రోజులు ఆడతారు, వీరి విషయంలో టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనేంటి అన్నది కూడా చర్చనీయాంశమవుతోంది.
- Venkata Chari
- Updated on: Jul 22, 2024
- 12:04 pm
SL vs IND: వామ్మో.. 5 మ్యాచ్ల్లో 4 సెంచరీలు.. ఇదెక్కడి విశ్వరూపం భయ్యా.. ఎవరో తెలుసా?
Virat Kohli Last Five Innings at Colombo: శ్రీలంక పర్యటనలో టీ20 మ్యాచ్ల తర్వాత భారత జట్టు ఆగస్టు 2 నుంచి 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆడాల్సి ఉంది. ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్మెన్స్ కూడా ఇందులో ఆడతారు. కొలంబో వేదికగా జరగనున్న సిరీస్లో ఆతిథ్య జట్టుపై భారత జట్టు పటిష్ట ప్రదర్శన కనబరుస్తోంది.
- Venkata Chari
- Updated on: Jul 21, 2024
- 7:05 pm
IPL 2025: లక్నోకు గుడ్బై చెప్పనున్న కేఎల్ రాహుల్.. ఖర్చీఫ్ వేసిన కోహ్లీ టీం..
IPL 2025: కేఎల్ రాహుల్ IPLలో RCB తరపున మొత్తం 19 మ్యాచ్లు ఆడాడు. అతను 14 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 4 అర్ధసెంచరీలతో మొత్తం 417 పరుగులు చేశాడు. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన రాహుల్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్లో ఉన్నాడు. అయితే, త్వరలో జరగనున్న మెగా వేలానికి ముందే ఎల్ఎస్జీ జట్టు నుంచి తప్పుకుంటాడనే వార్తలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
- Venkata Chari
- Updated on: Jul 21, 2024
- 2:17 pm
Video: కోహ్లీ – రవిశాస్త్రిలను ఏకిపారేసిన షమీ.. ఆటలో అరటిపండు చేశారంటూ విమర్శలు.. 2019లో అసలేం జరిగింది?
Mohammed Shami - Virat Kohli: మహ్మద్ షమీ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రసిద్ధి చెందాడు. వన్డే అయినా, టెస్టు అయినా.. ప్రతి ఫార్మాట్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఎన్నో వికెట్లు తీశాడు. అయినప్పటికీ, అతను విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒకసారి బెంచ్లోనే కూర్చోవాల్సి ఉంది. ఆ సమయంలో టీమిండియా ఓడిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించి కోహ్లీపై షమీ ప్రశ్నలు సంధించాడు.
- Venkata Chari
- Updated on: Jul 20, 2024
- 3:46 pm
Virat Kohli: కృష్ణదాస్ కీర్తనలకు డాన్స్ చేస్తూ సందడి చేసిన కింగ్ కోహ్లీ- అనుష్క..
బాలీవుడ్ ప్రముఖ నటీనటులు, దర్శకులు, గాయకులు, క్రికెటర్లందరూ అనంత్ అంబానీ ఇంటి పెళ్లిలో సందడి చేశారు. కానీ ది మోస్ట్ సెలబ్రిటీ కపుల్ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ- నటి అనుష్కా శర్మ మాత్రం ఈ పెళ్లికి గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట లండన్లో ఉంది. T20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే లండన్ కు వెళ్లిపోయాడు కింగ్ కోహ్లీ. అనుష్క శర్మ తన పిల్లలిద్దరితో కలిసి ఇప్పుడు లండన్లోనే ఉంటోంది. అందుకే విరాట్ కూడా టోర్నీ ముగిసిన వెంటనే లండన్ కు వెళ్లిపోయాడు.
- Anil kumar poka
- Updated on: Jul 18, 2024
- 9:23 am
Virat Kohli: లండన్లో కింగ్ కోహ్లీ- అనుష్క..కృష్ణదాస్ కీర్తనలు వింటూ సందడి చేసిన క్యూట్ కపుల్.. వీడియో
బాలీవుడ్ ప్రముఖ నటీనటులు, దర్శకులు, గాయకులు, క్రికెటర్లందరూ అనంత్ అంబానీ ఇంటి పెళ్లిలో సందడి సందడి చేశారు. కానీ ది మోస్ట్ సెలబ్రిటీ కపుల్ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ- నటి అనుష్కా శర్మ మాత్రం ఈ పెళ్లికి గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట లండన్లో ఉంటోంది.
- Basha Shek
- Updated on: Jul 15, 2024
- 2:14 pm
Team India: రోహిత్కు డెడ్లైన్.. కోహ్లీకి కండీషన్.. గంభీర్ ఎంట్రీతో మారిన సీన్.. రిటైర్మెంట్పై కీలక అప్డేట్?
Virat Kohli And Rohit Sharma: టీ20 అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు పలికారు. ఇక నుంచి వన్డే, టెస్టు జట్లలో మాత్రమే బరిలోకి దిగనున్నారు. అయితే, రోహిత్ శర్మ రిటైర్మెంట్కు డెడ్లైన్ విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే విరాట్ కోహ్లీ కూడా కొన్నాళ్లలో గుడ్ బై చెప్పే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
- Venkata Chari
- Updated on: Jul 10, 2024
- 7:31 pm
Video: కోహ్లీ ‘డ్రీమ్ హౌస్’ చూశారా.. అలీబాగ్లో ఔరా అనిపించేలా నిర్మాణం.. ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే?
Virat kohli Share Glimpse Stunning Luxury Home: టీ20 ప్రపంచ కప్ 2024 చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో 2వసారి టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ప్రపంచకప్ విజయం తర్వాత ఆటగాళ్లంతా తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లగా, విరాట్ తన కుటుంబంతో లండన్లో సెలవులు గడుపుతున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత X ఖాతాలో అలీబాగ్లోని తన ఇంటిని తొలిసారి పంచుకున్నాడు.
- Venkata Chari
- Updated on: Jul 10, 2024
- 3:50 pm
Virat Kohli: విరాట్ కోహ్లీ పబ్పై పోలీసుల రైడ్.. కేసు నమోదు.. కారణమిదే
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. జూన్ 6వ తేదీన రాత్రి, కబ్బన్ పార్క్ పోలీసులు రెస్టారెంట్లు, బార్లు, పబ్బులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ప్రభుత్వం విధించిన నిబంధనలను తుంగలో తొక్కి...
- Basha Shek
- Updated on: Jul 9, 2024
- 10:53 am
Virat Kohli: టీమిండియా విక్టరీ పరేడ్ ముగిసిన వెంటనే.. రాత్రికి రాత్రే లండన్ వెళ్లిపోయిన కింగ్ కోహ్లీ.. కారణమిదే
టీ20 ప్రపంచకప్ 2024 విక్టరీ పరేడ్ ముంబైలో అట్టహాసంగా జరిగింది. గురువారం (జులై 04) నిర్వహించిన టీమిండియా క్రికెటర్ల ఓపెన్ బస్ రోడ్ లో లక్షలాది మంది అభిమానులు భాగమయ్యారు. ఈ సందర్భంగా వాంఖడే స్టేడియం వరకు టీమ్ ఇండియా మెగా రోడ్ షో నిర్వహించింది
- Basha Shek
- Updated on: Jul 5, 2024
- 7:41 pm
Virat Kohli: కోహ్లీ మొబైల్ వాల్పేపర్గా ఉన్నది ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే
ముంబైలో టీమిండియా విజయోత్సవ పరేడ్ అనంతరం.. విరాట్ కోహ్లీ లండన్కు పయనమయ్యాడు. ఈ క్రమంలోనే కోహ్లీ ముంబై విమానాశ్రయం చేరుకున్నప్పుడు.. అందరి కళ్లు అతడి మొబైల్ వాల్పేపర్పై పడ్డాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
- Ravi Kiran
- Updated on: Jul 5, 2024
- 6:11 pm
Video: ఇదేందయ్యా జైషా.. కోహ్లీ ఎఫెక్ట్తో బుమ్రాకు షాక్ ఇచ్చావ్.. వైరల్ వీడియో చూస్తే పరేషానే..
Virat Kohli - Jay Shah: ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీకి అభిమానులున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆయనకు 27 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీని అభిమానించని వారు ఉండరు. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా విరాట్ కోహ్లీకి అభిమాని. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా మారింది.
- Venkata Chari
- Updated on: Jul 5, 2024
- 12:48 pm
Video: రోహిత్, మట్టి రుచి ఎలా ఉంది.. సూర్య, ఆ 7 సెకన్ల సీక్రెట్ ఏంటి? ప్రధాని మోడీ ఎవరితో ఏం మాట్లాడారంటే?
టీ20 ప్రపంచకప్ 2024 విజేత భారత క్రికెట్ జట్టు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. బార్బడోస్ నుంచి 16 గంటల ప్రయాణం తర్వాత భారత్ చేరుకున్న టీమ్ ఇండియా ప్రధాని నివాసానికి వెళ్లింది. ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, టీ20 ప్రపంచకప్తో ఫొటో కూడా దిగారు.
- Venkata Chari
- Updated on: Jul 5, 2024
- 10:09 am
Team India: అతను 8వ వింత.. అలాంటోడు దొరకడం చాలా అరుదు: విరాట్ కోహ్లీ భావోద్వేగ ప్రసంగం
Team India Victory Parade: గురువారం సాయంత్రం ముంబైలో టీమిండియాకు ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి బస్ ఎక్కి మెరైన్డ్రైవ్కు చేరుకోగా, ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టుకు స్వాగతం పలికేందుకు అప్పటికే వేలాది మంది జనం తరలివచ్చారు. నారిమన్ పాయింట్ నుంచి, భారత ఆటగాళ్లందరూ ఓపెన్ బస్సులో ఎక్కి విజయోత్సవ పరేడ్ను ప్రారంభించారు.
- Venkata Chari
- Updated on: Jul 5, 2024
- 7:20 am