Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

రన్‌ మెషిన్‌ విరాట్ కోహ్లీ.. క్రికెట్ దేవుడు సచిన్‌ తర్వాత మోస్ట్‌ క్రేజీ ప్లేయర్‌గా యావత్ ప్రపంచ క్రికెట్‌ అభిమానుల గుండెల్లో నిలచిన టీమిండియా ఆటగాడు. ఇక నీ పని అయిపోయింది.. పొయ్యి రెస్ట్‌ తీస్కో.. టీమిండియా నుంచి తీసెయ్యండి.. అంటూ విషం కక్కే తన హేటర్స్‌కి ప్రతిసారీ తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. తనపై వచ్చే విమర్శలను సైలెంట్‌గా భరించే కింగ్‌ కోహ్లీ తన బ్యాటింగ్‌తో వయెలెంట్‌ రిప్లయ్‌ ఇచ్చేస్తాడు. 1988 నవంబరు 5న ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన కింగ్ కోహ్లీ.. తన మూడో ఏట నుంచే బ్యాటింగ్‌‌లో శిక్షణ మొదలుపెట్టాడు. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన కోహ్లీ.. ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట తిరగరాసుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే మేటి ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు సాధించాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను 2017లో కోహ్లీ పెళ్లి చేసుకున్నాడు.

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కోహ్లీ..ఆనతి కాలంలోనే టీమిండియా వన్డే జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ దశాబ్ధపు మేటి పురుష క్రికెటర్‌గా కోహ్లీ పేరును ఐసీసీ 2020లో ప్రకటించడం విశేషం. వన్డేలో అత్యధిక సెంచరీలు (50) సాధించిన ఆటగాడికి ప్రపంచ రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో నవంబరు 15న ముంబై వేదికగా జరిగిన వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో కోహ్లీ తన 50వ సెంచరీని పూర్తి చేసి.. సచిన్ (49) రికార్డును అధిగమించాడు. కేవలం 279 ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ రికార్డు సాధించాడు. అలాగే వరల్డ్ కప్‌లో ఒక ఎడిషన్‌‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ కోహ్లీ ఘనత సాధించాడు. టీ20, ఐపీఎల్‌‌లో అత్యధిక పరుగుల రికార్డులు కోహ్లీ పేరిటే ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలుస్తున్నాడు. 2011 క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా జట్టులో కోహ్లీ ప్రాతినిధ్యంవహించాడు. 2013లో ఐసీసీ ర్యాంకింగ్స్‌‌లో వన్డే ఫార్మెట్‌లో నెం.1 బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ)కి ఐపీఎల్‌లో ప్రాతినిధ్యంవహిస్తున్న కోహ్లీకి.. తన జట్టుకు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించకపోవడం మాత్రమే కాస్త అసంతృప్తి కలిగించే అంశం.

ఇంకా చదవండి

Video: నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేను వెళ్ళిపోత మావా! ఆ రెండింటిపై కోహ్లీ చిలిపి సమాధానం

విరాట్ కోహ్లీ తన మైదానంలోని వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తన అగ్రెసివ్ స్వభావాన్ని విమర్శించినవారు, ఇప్పుడు అతని ప్రశాంతతను సమస్యగా చూస్తున్నారని అన్నారు. తన పోటీతత్వం తగ్గలేదని, కానీ అది జట్టు గెలుపు కోసం ఉపయోగపడేలా ఉంటుందని స్పష్టం చేశారు. ఐపీఎల్ 2025లో కోహ్లీ కొత్త లక్ష్యాలతో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. 

  • Narsimha
  • Updated on: Mar 16, 2025
  • 10:12 am

Virat Kohli: కింగ్ ఫ్యాన్స్ కి బాడ్ న్యూస్! ఆ విషయంలో ధోనిని ఫాలో అవుతున్న కోహ్లీ

భారత క్రికెట్ జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచినా, విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ నిర్ణయం అతని అభిమానుల్లో ఆశ్చర్యం, అసంతృప్తిని కలిగించింది. RCB ఇన్నోవేషన్ ల్యాబ్‌లో మాట్లాడుతూ, అతను సోషల్ మీడియా పై శ్రద్ధ తగ్గించానని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ RCB శిక్షణలో పాల్గొంటున్నా, అతని మౌనం అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

  • Narsimha
  • Updated on: Mar 16, 2025
  • 9:59 am

Virat Kohli: కింగ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్! T20I లో రీఎంట్రీ..హింట్ ఇచ్చేసాడుగా

విరాట్ కోహ్లీ 2028 ఒలింపిక్స్ కోసం తన T20I రిటైర్మెంట్‌ను పునరాలోచించనున్నాడని వ్యాఖ్యానించడంతో క్రికెట్ లోకంలో ఉత్కంఠ పెరిగింది. కోహ్లీ తన ఫిట్‌నెస్ గురించి, తల్లిని ఎలా ఒప్పించాడో ఆసక్తికరంగా వెల్లడించాడు. ఇక, IPL 2025లో RCB కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌తో కలిసి కోహ్లీ సిద్ధమవుతున్నాడు. కోహ్లీ తిరిగి 2028 ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ఆడతాడా? అనే ప్రశ్న అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

  • Narsimha
  • Updated on: Mar 16, 2025
  • 8:21 am

Virat Kohli: కోహ్లీ వల్లే 14 ఏళ్ళ బాలిక మృతి? క్లారిటీ ఇచ్చిన ప్రియాంశి తండ్రి!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ సందర్భంగా 14 ఏళ్ల బాలిక ప్రియాంశి హఠాన్మరణం చెందింది. విరాట్ కోహ్లీ ఔటైన వెంటనే ఆమె మరణించిందని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే బాలిక తండ్రి అజయ్ పాండే దీనిని ఖండిస్తూ, ఇది కేవలం యాధృచ్ఛిక సంఘటన అని తెలిపారు. తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, నిజాన్ని అర్థం చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

  • Narsimha
  • Updated on: Mar 14, 2025
  • 6:07 am

Video: మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఓ పని మర్చిపోయిన కేఎల్ రాహుల్.. పగలబడి నవ్విన విరాట్ కోహ్లీ

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ ఇండియా న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం స్టేజ్ పైకి బ్యాటింగ్ ప్యాడ్స్ తొలగించకుండానే వచ్చిన రాహుల్ అందరినీ నవ్వులపాలు చేశాడు. ఈ సరదా ఘటన క్రికెట్ ఫ్యాన్స్‌లో వైరల్ అవుతూ, రాహుల్‌కి బిరుదులు, ట్రోలింగ్ రెండూ తెచ్చిపెట్టింది.

  • Narsimha
  • Updated on: Mar 11, 2025
  • 10:05 pm

Kohli: ఎవడ్రా నువ్వు కోహ్లీ కి కలర్ జీరాక్స్ ల ఉన్నావు! నీ అభిమానానికి ఫిదా అవ్వాల్సిందే

విరాట్ కోహ్లీ లుక్, స్టైల్, క్రమశిక్షణను కరణ్ కౌశల్ సరిగ్గా అనుసరిస్తున్నాడు. అతని ముఖకవళికలు, జీవనశైలి, ఆహార నియమాలు కోహ్లీని తలపిస్తాయి. కోహ్లీపై తన అభిమానాన్ని నిరూపించుకునేందుకు, అతని ఫోటో టాటూ కూడా వేయించుకున్నాడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కరణ్, తన డెడికేషన్‌తో నిజమైన కోహ్లీ భక్తుడిగా మారాడు!

  • Narsimha
  • Updated on: Mar 11, 2025
  • 2:10 pm

virat kohli: కేన్ మామపై కింగ్ కోహ్లీ ఎమోషనల్ వర్డ్స్! ఎవరికైనా కన్నీళ్లు రావడం ఖాయం!

భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన ఆనందంలో విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఓటమిని చూసి బాధపడ్డాడు. న్యూజిలాండ్ అద్భుతమైన పోటీ ఇచ్చిందని, వారు ఎప్పుడూ తమ ఆటను మెరుగుపరుచుకుంటూనే ఉంటారని కొనియాడాడు. కోహ్లీ మాట్లాడుతూ, భారత క్రికెట్ భవిష్యత్తును బలోపేతం చేయడం తన నిజమైన లక్ష్యం అని పేర్కొన్నాడు. ఫైనల్లో ఒక్క పరుగుకే ఔటైనా, కోహ్లీ టోర్నమెంట్‌లో తన కీలక ప్రదర్శనతో భారత విజయానికి సహాయపడ్డాడు.

  • Narsimha
  • Updated on: Mar 11, 2025
  • 1:29 pm

Champions Trophy: ఆ విషయంలో ఇండియన్ ఫ్యాన్స్ కి నిరాశే .. అసలు కారణం ఇదే!

భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నా, ఈసారి బస్సు పరేడ్ జరగలేదు. ఆటగాళ్లు వేర్వేరు నగరాలకు వెళ్లిపోవడం, IPL 2025 సమీపించడం ప్రధాన కారణాలుగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ ముంబైకి, గౌతమ్ గంభీర్ ఢిల్లీకి వెళ్లగా, ఇతరులు కూడా తమ జట్లకు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంఘటన అభిమానులను కొంత నిరాశపరిచినప్పటికీ, IPL 2025లో వీరి ప్రదర్శన ఆసక్తిగా మారింది.

  • Narsimha
  • Updated on: Mar 11, 2025
  • 1:22 pm

Retirement rumors: ఒక్క స్టేట్‌మెంట్‌తో హేటర్స్ చెంప చెళ్లుమనిపించిన జడ్డు! ఆ మ్యాజికల్ 4 పదాలు!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన తర్వాత, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతారనే పుకార్లు ఊపందుకున్నాయి. అయితే, జడేజా తన సోషల్ మీడియా స్టేట్‌మెంట్‌తో ఈ ఊహాగానాలకు తెరదించాడు. రోహిత్ కూడా మీడియా సమావేశంలో అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశాడు. టీమిండియా చరిత్రలో మరో ఘనతగా నిలిచిన ఈ విజయం, వీరి భవిష్యత్‌పై ఆసక్తిని మరింత పెంచింది.

  • Narsimha
  • Updated on: Mar 11, 2025
  • 1:38 pm

Team India: మరో 2 ఐసీసీ టైటిళ్లపై కన్నేసిన రోహిత్, కోహ్లీ.. రిటైర్మెంట్‌కి ముందే పెద్ద స్కెచ్ వేసిన దిగ్గజాలు

Team India Future ODI Schedule: ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత, రోహిత్ శర్మ ప్రస్తుతానికి ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. అయితే, విరాట్ కోహ్లీ కూడా అలాంటి సూచన ఏమీ ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితిలో, రాబోయే రెండున్నర సంవత్సరాలలో అతను టీం ఇండియా తరపున ఎన్ని వన్డేలు ఆడగలడో ఓసారి తెలుసుకుందాం..