విరాట్ కోహ్లీ
రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. క్రికెట్ దేవుడు సచిన్ తర్వాత మోస్ట్ క్రేజీ ప్లేయర్గా యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలచిన టీమిండియా ఆటగాడు. ఇక నీ పని అయిపోయింది.. పొయ్యి రెస్ట్ తీస్కో.. టీమిండియా నుంచి తీసెయ్యండి.. అంటూ విషం కక్కే తన హేటర్స్కి ప్రతిసారీ తన బ్యాట్తోనే సమాధానం చెబుతాడు. తనపై వచ్చే విమర్శలను సైలెంట్గా భరించే కింగ్ కోహ్లీ తన బ్యాటింగ్తో వయెలెంట్ రిప్లయ్ ఇచ్చేస్తాడు. 1988 నవంబరు 5న ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన కింగ్ కోహ్లీ.. తన మూడో ఏట నుంచే బ్యాటింగ్లో శిక్షణ మొదలుపెట్టాడు. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన కోహ్లీ.. ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట తిరగరాసుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే మేటి ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు సాధించాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను 2017లో కోహ్లీ పెళ్లి చేసుకున్నాడు.
2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కోహ్లీ..ఆనతి కాలంలోనే టీమిండియా వన్డే జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ దశాబ్ధపు మేటి పురుష క్రికెటర్గా కోహ్లీ పేరును ఐసీసీ 2020లో ప్రకటించడం విశేషం. వన్డేలో అత్యధిక సెంచరీలు (50) సాధించిన ఆటగాడికి ప్రపంచ రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్తో నవంబరు 15న ముంబై వేదికగా జరిగిన వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్లో కోహ్లీ తన 50వ సెంచరీని పూర్తి చేసి.. సచిన్ (49) రికార్డును అధిగమించాడు. కేవలం 279 ఇన్నింగ్స్లో కోహ్లీ ఈ రికార్డు సాధించాడు. అలాగే వరల్డ్ కప్లో ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ కోహ్లీ ఘనత సాధించాడు. టీ20, ఐపీఎల్లో అత్యధిక పరుగుల రికార్డులు కోహ్లీ పేరిటే ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలుస్తున్నాడు. 2011 క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా జట్టులో కోహ్లీ ప్రాతినిధ్యంవహించాడు. 2013లో ఐసీసీ ర్యాంకింగ్స్లో వన్డే ఫార్మెట్లో నెం.1 బ్యాట్స్మన్గా నిలిచాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ)కి ఐపీఎల్లో ప్రాతినిధ్యంవహిస్తున్న కోహ్లీకి.. తన జట్టుకు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించకపోవడం మాత్రమే కాస్త అసంతృప్తి కలిగించే అంశం.
IND vs SA: విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ‘హ్యాట్రిక్’తో 2వసారి దూకుడు..?
IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే వన్డే సిరీస్ చివరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక పెద్ద రికార్డును సృష్టించవచ్చు. అతను చివరిసారిగా 2018లో సాధించిన ఈ ఘనతను సాధించాడు. మరోసారి సాధించాలంటే వైజాగ్ మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది.
- Venkata Chari
- Updated on: Dec 5, 2025
- 12:19 pm
Virat Kohli: 53వ సెంచరీకి ఫిదా.. సోషల్ మీడియాలో అనుష్క శర్మ పోస్ట్ వైరల్
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలతో చెలరేగడంతో భారత్ 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, బౌలర్ల వైఫల్యం కారణంగా దక్షిణాఫ్రికా ఈ లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టు ఓడిపోయినప్పటికీ, కోహ్లీ పోరాటపటిమకు, అనుష్క మద్దతుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
- Venkata Chari
- Updated on: Dec 4, 2025
- 1:42 pm
Virat Kohli: 7 ఏళ్లలో ఇదే తొలిసారి.. టీమిండియాకు కలసిరాని విరాట్ కోహ్లీ..!
India vs South Africa: సాధారణంగా వన్డేల్లో కోహ్లీ సెంచరీ చేస్తే భారత్ గెలిచి తీరుతుంది. గత ఏడేళ్లుగా ఇదే సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. కానీ, బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 102 పరుగులు చేసి, తన కెరీర్లో 53వ వన్డే శతకాన్ని నమోదు చేసినా, భారత్ గెలవలేకపోయింది.
- Venkata Chari
- Updated on: Dec 4, 2025
- 12:57 pm
Virat Kohli: ఇకపై మరెవరికీ సాధ్యం కాదు భయ్యో.. కోహ్లీ ఖాతాలో అదిరిపోయే రికార్డ్..
Virat Kohli Records: రికార్డు హోల్డర్ విరాట్ కోహ్లీ తన పేరు మీద మరో ప్రపంచ రికార్డును జోడించాడు. ఈసారి, కింగ్ కోహ్లీ మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు మైఖేల్ బెవెన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించాడు.
- Venkata Chari
- Updated on: Dec 4, 2025
- 9:03 am
ధోనిని మేం ఎప్పుడూ అడగలే.. రోకోలపైనే టార్గెట్ ఎందుకు: గంభీర్, అగార్కర్లకు మాస్ వార్నింగ్
ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్ల కంటే రోహిత్, కోహ్లీనే అద్భుతంగా రాణిస్తున్నారని ప్రసాద్ గుర్తుచేశారు. "వారి మనసులను పాడుచేయకూడదు. జాతీయ జట్టుకు ఆడని సమయంలో వారు దేశవాళీ క్రికెట్ ఆడితే అది యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుంది. కానీ వారిపై అనవసరమైన ఒత్తిడి తేవడం సరికాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
- Venkata Chari
- Updated on: Dec 3, 2025
- 11:16 am
Virat Kohli: 16 ఏళ్ల తర్వాత కోహ్లీ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. అదేంటంటే?
India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. 16 సంవత్సరాల తర్వాత అతను దేశీయ టోర్నమెంట్లోకి తిరిగి రాబోతున్నాడు. తన నిర్ణయాన్ని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీకి తెలియజేశాడు.
- Venkata Chari
- Updated on: Dec 3, 2025
- 7:56 am
IND vs SA: 10 ఏళ్ల ప్రస్థానం కొనసాగించేనా.. రాయ్పూర్లో టీమిండియా టార్గెట్ ఇదే..?
IND vs SA 2nd ODI Shaheed Veer Narayan Singh Stadium: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మైదానం మూడు సంవత్సరాల తర్వాత వన్డే మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది.
- Venkata Chari
- Updated on: Dec 3, 2025
- 7:04 am
6,6,6,6,6,6.. 10 ఫోర్లు.. 45 బంతుల్లో కోహ్లీ కెప్టెన్ ఖతర్నాక్ ఇన్నింగ్స్..
Syed Mushtaq Ali Trophy 2025: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ గ్రూప్ డి మ్యాచ్లో, కర్ణాటక జట్టు తమిళనాడుపై అద్భుతమైన బ్యాటింగ్ను ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక తరపున దేవదత్ పడిక్కల్ సెంచరీ సాధించాడు. దీని ద్వారా కర్ణాటక జట్టు భారీ స్కోరును సాధించింది.
- Venkata Chari
- Updated on: Dec 2, 2025
- 12:37 pm
Video: అక్కడున్నది కింగ్ రా.! గంభీర్కు గట్టిగా ఇచ్చిపడేసిన కోహ్లి.. మీరూ చూసేయండి
Kohli vs Gambhir: ఆదివారం సాయంత్రం రాంచీలో అభిమానులు ఒక ప్రత్యేక సంఘటనను చూశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు తరపున 52వ వన్డే సెంచరీ సాధించి విరాట్ కోహ్లీ తన పాత ఫాంకి తిరిగి వచ్చాడు. కోహ్లీ ఇప్పుడు తన కెరీర్లో అద్భుతమైన దశలో ఉన్నాడు. 2027లో వన్డే ప్రపంచ కప్ ఆడతాడా లేదా అనేది అతని ఫామ్, ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది.
- Venkata Chari
- Updated on: Dec 2, 2025
- 9:14 am
Virender Sehwag : టీ పెట్టడం ఎంత సింపులో.. కోహ్లీకి రన్స్ కొట్టడం అంతే ఈజీ.. సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ తన కెరీర్లో 52వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
- Rakesh
- Updated on: Dec 1, 2025
- 6:07 pm