AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025: భారత్‌లోనే 2025 ఆసియా కప్‌.. 5 జట్లు క్వాలిఫై.. 6వ జట్టు ఏదంటే?

Asia Cup 2025: పురుషుల ఆసియా కప్‌ 2025కు ఆతిథ్యం ఇచ్చే హక్కును భారత్ గెలుచుకుంది. ఈ టోర్నీ 20 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది. ఇందులో 6 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి. క్వాలిఫికేషన్ రౌండ్ ద్వారా ఆరో జట్టును నిర్ణయిస్తామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది పాకిస్థాన్ భారత్‌లో పర్యటించాల్సి ఉంటుంది.

Asia Cup 2025: భారత్‌లోనే 2025 ఆసియా కప్‌.. 5 జట్లు క్వాలిఫై.. 6వ జట్టు ఏదంటే?
Asia Cup 2025
Venkata Chari
|

Updated on: Jul 30, 2024 | 8:58 AM

Share

Asia Cup 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఒకవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, వన్డే ప్రపంచకప్ ఆడేందుకు మా జట్టును భారత్‌కు పంపాం. అందుకే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టును పాకిస్థాన్‌కు పంపాలన్న వాదనను బీసీసీఐ ముందుకు తెచ్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం భుజాలపై వేసింది బీసీసీఐ. వీటన్నింటి మధ్య, ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. వచ్చే ఏడాది పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారతదేశంలో పర్యటించే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆసియా కప్‌నకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం.

భారత్‌కు రానున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు..

నివేదికల ప్రకారం, 2025 పురుషుల ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇచ్చే హక్కును భారత్ దక్కించుకుంది. ఈ టోర్నీ 20 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది. ఇందులో 6 జట్లు పాల్గొంటాయి. ఇందులో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఇప్పటికే క్వాలిఫై అయ్యాయని, క్వాలిఫికేషన్ రౌండ్ ద్వారా ఆరో జట్టును నిర్ణయిస్తామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది పాకిస్థాన్ భారత్‌లో పర్యటించాల్సి ఉంటుంది.

వాస్తవానికి, 2023 ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇచ్చే హక్కు పాకిస్థాన్‌కు లభించింది. అయితే ఈ టోర్నీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో టోర్నీని హైబ్రిడ్‌ పద్ధతిలో నిర్వహించారు. దీని ప్రకారం శ్రీలంకలో భారత్ మ్యాచ్‌లు జరిగాయి.

ఇవి కూడా చదవండి

ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం..

ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన IEOI పత్రం ప్రకారం, 2025లో పురుషుల ఆసియా కప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. అదే సమయంలో, 2027 ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇచ్చే హక్కు బంగ్లాదేశ్‌కు లభించింది. కానీ, 2027 ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. ఈ రెండు ఎడిషన్‌లలో ఒక్కొక్క దాంట్లో 13 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. షెడ్యూల్, తేదీ, ఫార్మాట్, వేదికతో సహా ఈ వివరాలన్నింటినీ కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్ మార్చవచ్చని పత్రంలో పేర్కొంది.

భారత్‌కు రెండో అవకాశం..

ఆసియా కప్ 1984లో ప్రారంభమైంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 16 ఎడిషన్లు జరిగాయి. కానీ, భారత్ ఒక్కసారి మాత్రమే ఆసియా కప్‌నకు ఆతిథ్యమిచ్చింది. 1990/91 ఆసియా కప్‌నకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఎడిషన్‌లో భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఇటువంటి పరిస్థితిలో, 2025 ఆసియా కప్ చాలా ప్రత్యేకమైనది. 34 ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ టోర్నీ జరగనుంది.

ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా ఆధిపత్యం..

ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా టీమిండియా నిలిచింది. భారత్ ఇప్పటి వరకు 8 సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. అదే సమయంలో శ్రీలంక 6 టైటిల్స్‌తో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఆసియాకప్‌లో పాకిస్థాన్ జట్టు రెండుసార్లు మాత్రమే ఛాంపియన్‌గా అవతరించింది. గత ఆసియా కప్‌లో భారత్‌ విజయం సాధించింది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించిన టీమిండియా 8వ సారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..