AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Reservation Bill: జోరందుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్య.. పార్లమెంట్‌లో ఏ పార్టీలో ఎంత మంది మహిళా ఎంపీలు ఉన్నారో తెలుసా?

2019 లోక్‌సభ ఎన్నికల్లో 78 మంది మహిళా ఎంపీలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అంతేకాదు ఎగువ సభ గురించి మాట్లాడితే రాజ్యసభలో 25 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఉభయ సభలు కలిపి మొత్తం మహిళా ఎంపీలు 103 మంది ఉన్నారు. విషయమేమిటంటే ఇప్పటి వరకు మహిళా ఎంపీల భాగస్వామ్యంలో ఇదే అత్యధిక సంఖ్య. ప్రస్తుతం మహిళల ప్రాధాన్యత 14 శాతానికి పైగా ఉంది.

Women Reservation Bill: జోరందుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్య.. పార్లమెంట్‌లో ఏ పార్టీలో ఎంత మంది మహిళా ఎంపీలు ఉన్నారో తెలుసా?
Women Reservation Bill
Surya Kala
|

Updated on: Sep 19, 2023 | 8:39 AM

Share

నేటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో మహిళా రిజర్వేషన్లపై చర్చ జోరందుకుంది. ఇప్పుడు దానిని సెప్టెంబర్ 20న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వీటన్నింటి నడుమ ఈరోజు పార్లమెంట్‌లో మహిళల భాగస్వామ్యం ఏ మేరకు ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది.

అదే సమయంలో భారత కూటమిలోని అనేక భాగస్వామ్య పార్టీలు మహిళా బిల్లుకు అనుకూలంగా నిలుస్తున్నాయి. ఈ బిల్లును ఆమోదించాలన్న విషయంపై కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. దీంతో ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం కోసం క్రెడిట్ తమకు దక్కేలా చూసుకోవడం పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుండి ఎంత మంది మహిళలు సభలో ఎంపీలుగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏ పార్టీలో ఎంత మంది మహిళా ఎంపీలున్నారంటే

మీడియా నివేదికల ప్రకారం 2019 లోక్‌సభ ఎన్నికల్లో 78 మంది మహిళా ఎంపీలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అంతేకాదు ఎగువ సభ గురించి మాట్లాడితే రాజ్యసభలో 25 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఉభయ సభలు కలిపి మొత్తం మహిళా ఎంపీలు 103 మంది ఉన్నారు. విషయమేమిటంటే ఇప్పటి వరకు మహిళా ఎంపీల భాగస్వామ్యంలో ఇదే అత్యధిక సంఖ్య. ప్రస్తుతం మహిళల ప్రాధాన్యత 14 శాతానికి పైగా ఉంది.

ఇవి కూడా చదవండి

లోక్‌సభలో అత్యధిక మహిళా ఎంపీలు

లోక్‌సభలో అత్యధికంగా 42 మంది మహిళా ఎంపీలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన వారున్నారు.    2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ మాత్రమే పార్లమెంటు హౌస్‌కు ఎంపీగా చేరుకున్నారు.

2019లో 78 మంది మహిళా ఎంపీలు ఎన్నిక

నిజానికి 2019 లోక్‌సభ ఎన్నికల్లో 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. సమాచారం ప్రకారం.. 2019 ఎన్నికల సమయంలో 8054 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 726 మంది అంటే 9 శాతం మంది మహిళలు. అదే సమయంలో డిసెంబర్ 2021 వరకు రాజ్యసభలో మహిళా ఎంపీల సంఖ్య 12.24 శాతం.

మహిళలకు అత్యధిక సంఖ్యలో టిక్కెట్లు ఇచ్చిన కాంగ్రెస్

2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అత్యధికంగా 54 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. కాగా బీజేపీ తమ పార్టీ నుంచి 53 మంది మహిళలను ఎన్నికల బరిలోకి దింపింది. బీఎస్పీ 24 మంది, టీఎంసీ 23, సీపీఎం 10, సీపీఐ నలుగురు, ఎన్సీపీ ఒక మహిళా అభ్యర్థులను నిలబెట్టాయి.

సభలో పెరిగిన మహిళల వాటా

శాతాల వారీగా సభలో మహిళా ఎంపీల సంఖ్యను పరిశీలిస్తే.. లోక్‌సభలో 14.36 శాతం, రాజ్యసభలో 10 శాతానికి పైగా మహిళా సభ్యులు ఉన్నారు. 1951 నుండి 2019 వరకు లోక్‌సభలో మహిళల వాటా నిరంతరం పెరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..