అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని డయాజియో విక్రయించనుంది. అమెరికన్ టెక్ బిలియనీర్ సంజయ్ గోవిల్ ఈ బిడ్లో ముందున్నారు. $2 బిలియన్ల విలువైన ఆర్సీబీని 2026 మార్చి నాటికి విక్రయించాలనేది డయాజియో లక్ష్యం. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లతో ఆర్సీబీకి భారీ అభిమాన గణం ఉంది. ఈ విక్రయం ఐపీఎల్ అంతర్జాతీయ ఆదరణకు నిదర్శనం.
ఐపీఎల్లో అత్యంత ఆదరణ కలిగిన ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలానికి సిద్ధమైంది. ప్రస్తుత యజమాని డయాజియో సంస్థ ఈ ఫ్రాంచైజీని విక్రయించాలని నిర్ణయించింది. ఇక ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకోడానికి పలలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ రేసులో అమెరికాకు చెందిన టెక్ బిలియనీర్ సంజయ్ గోవిల్ ముందున్నారు. ఈ విక్రయ ప్రక్రియను 2026 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రముఖ మద్యం తయారీ సంస్థ డయాజియో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేసింది. సంజయ్ గోవిల్ ఇప్పటికే క్రీడా రంగంలో, ముఖ్యంగా క్రికెట్లో అనుభవం ఉన్న వ్యక్తి. ఇంగ్లండ్లో జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్లోని వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీకి, అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లోని వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు ఆయన సహ యజమానిగా ఉన్నారు. క్రికెట్ ఫ్రాంచైజీలలో పెట్టుబడులు పెట్టి, వాటిని విజయవంతంగా నడపడంలో ఆయనకు మంచి పేరుంది. ఇప్పుడు ఆయన బృందం ఆర్సీబీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు అంటే..సుమారు రూ.16,800 కోట్లు ఉంటుందని అంచనా. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి స్టార్ ఆటగాళ్ల కారణంగా ఆర్సీబీకి విపరీతమైన అభిమానులు, బ్రాండ్ విలువ ఉన్నాయి. ఈ ఏడాదే తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంది. ఈ విక్రయ ప్రక్రియలో భారతీయ సంస్థలతో పాటు విదేశీయులు కూడా పాల్గొనడం ఐపీఎల్ అంతర్జాతీయ ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

