AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: ఆ 3 రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో వారం రోజుల్లో థర్డ్ వేవ్ ఉధృతి మరింత తగ్గుముఖంపట్టే అవకాశముందని అంచనావేస్తున్నారు.

Covid-19: ఆ 3 రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
Covid
Janardhan Veluru
|

Updated on: Jan 27, 2022 | 5:45 PM

Share

India Covid-19 Acive Cases: దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ ఉధృతి గత వారంతో పోల్చితే కాస్త  తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో వారం రోజుల్లో థర్డ్ వేవ్(Covid-19 Third Wave) ఉధృతి మరింత తగ్గుముఖంపట్టే అవకాశముందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. గత వారం వారం రోజులుగా ప్రతి రోజూ సరాసరిగా 3 లక్షల కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి.  థర్డ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న సంకేతాలు వెలువడున్నా..  దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఇంకా మూడు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండటం కాస్త ఆందోళనకు గురిచేసే అంశం. దేశంలో ప్రస్తుతం 22 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. దేశంలో కోవిడ్ పరిస్థితిపై గురువారంనాడు మీడియాకు వివరాలు వెల్లడించిన ఆరోగ్య శాఖ అధికారులు.. దేశంలోని 11 రాష్ట్రాల్లో 50 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

అలాగే 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 వేల నుంచి 50 వేల లోపు యాక్టివ్ కేసులు ఉన్నాయి. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 వేల లోపు యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత వారం దేశంలో సరాసరి పాజిటివిటీ రేటు 17.75శాతంగా ఉంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 77శాతం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ గురువారంనాడు విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గం.ల వ్యవధిలో దేశంలో 2,86,384 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472కు చేరుకుంది. ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటి వరకు 163.84 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read..

Hyderbad News: మద్యం మత్తులో యువతి వీరంగం.. రోడ్డుపై వెళ్తున్న వారిని తన కారుతో..

Hyderabad: చెత్త కింద చారిత్రక నిర్మాణం.. హైదరాబాద్‌లో బయటపడిన పురాతన కట్టడం..!

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!