AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: ఆ 3 రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో వారం రోజుల్లో థర్డ్ వేవ్ ఉధృతి మరింత తగ్గుముఖంపట్టే అవకాశముందని అంచనావేస్తున్నారు.

Covid-19: ఆ 3 రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
Covid
Janardhan Veluru
|

Updated on: Jan 27, 2022 | 5:45 PM

Share

India Covid-19 Acive Cases: దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ ఉధృతి గత వారంతో పోల్చితే కాస్త  తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో వారం రోజుల్లో థర్డ్ వేవ్(Covid-19 Third Wave) ఉధృతి మరింత తగ్గుముఖంపట్టే అవకాశముందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. గత వారం వారం రోజులుగా ప్రతి రోజూ సరాసరిగా 3 లక్షల కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి.  థర్డ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న సంకేతాలు వెలువడున్నా..  దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఇంకా మూడు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండటం కాస్త ఆందోళనకు గురిచేసే అంశం. దేశంలో ప్రస్తుతం 22 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. దేశంలో కోవిడ్ పరిస్థితిపై గురువారంనాడు మీడియాకు వివరాలు వెల్లడించిన ఆరోగ్య శాఖ అధికారులు.. దేశంలోని 11 రాష్ట్రాల్లో 50 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

అలాగే 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 వేల నుంచి 50 వేల లోపు యాక్టివ్ కేసులు ఉన్నాయి. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 వేల లోపు యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత వారం దేశంలో సరాసరి పాజిటివిటీ రేటు 17.75శాతంగా ఉంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 77శాతం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ గురువారంనాడు విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గం.ల వ్యవధిలో దేశంలో 2,86,384 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472కు చేరుకుంది. ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటి వరకు 163.84 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read..

Hyderbad News: మద్యం మత్తులో యువతి వీరంగం.. రోడ్డుపై వెళ్తున్న వారిని తన కారుతో..

Hyderabad: చెత్త కింద చారిత్రక నిర్మాణం.. హైదరాబాద్‌లో బయటపడిన పురాతన కట్టడం..!

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..