AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderbad News: మద్యం మత్తులో యువతి వీరంగం.. రోడ్డుపై వెళ్తున్న వారిని తన కారుతో..

Hyderabad News: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో మద్యం మత్తులో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మద్యం సేవించి..

Hyderbad News: మద్యం మత్తులో యువతి వీరంగం.. రోడ్డుపై వెళ్తున్న వారిని తన కారుతో..
Shiva Prajapati
|

Updated on: Jan 27, 2022 | 4:12 PM

Share

Hyderabad News: రంగారెడ్డి(Rangareddy) జిల్లాలోని శంషాబాద్‌(Shamshabad)లో మద్యం మత్తులో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మద్యం(Drunk and Dri సేవించి కారు నడుపుతూ.. రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, స్థానికులు అతి కష్టం మీద కారును అడ్డుకున్నారు. యువతిని ప్రశ్నించగా.. అందులో ఉన్న మరో వ్యక్తి స్థానికులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడి స్థానికుు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కారును స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న యువతిని, కారులో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, కారు ఢీకొనడంతో గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also read:

TMC Jobs: డిగ్రీ అర్హతతో.. టాటా మెమోరియల్ సెంటర్‌లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే!

Telangana: 50 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్​ చేయించి పెళ్లాడిన వివాహిత.. ఎందుకో ఆరా తీయగా పోలీసులు షాక్

PRC: చ‌ర్చ‌లకు రండి.. మీరు మా శ‌త్రువులు కాదు.. ఉద్యోగులకు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల సూచన..