AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్‌‌లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..

థాయిలాండ్ నుండి ప్రయాణించిన ఈ ముగ్గురు.. కొలంబో ద్వారా బెంగళూరు చేరుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఈ డ్రగ్స్ దందా వెనుక ఎవరున్నారనే దానిపై చర్యలు చేపట్టారు. విచారణలో బయటకొచ్చిన వివరాల ప్రకారం.. ఈ సరుకును తమిళనాడుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని తేలిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎన్సీబీ అధికారులు తెలిపారు.

Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్‌‌లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..
Drugs
Noor Mohammed Shaik
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 14, 2025 | 1:28 PM

Share

బెంగళూరు కెంపేగౌడా అంతర్జాతీయ విమానాశ్రయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) బృందం భారీగా మాదకద్రవ్యాలను సీజ్‌ చేసింది. అధికారుల ప్రకారం.. ఎన్‌సీబీ బెంగళూరు జోనల్ యూనిట్ పర్యవేక్షణలో చేపట్టిన చర్యలో మొత్తం 45.4 కిలోల హైడ్రో గంజా, 6 కిలోల సైలోసైబిన్ మష్రూమ్స్ పట్టుబడింది. ఈ డ్రగ్స్‌ను మొత్తం 250 ఫుడ్ టిన్‌లలో దాచి వాక్యూమ్ సీలింగ్ చేశారు. వాటి మార్కెట్ విలువ కోట్లల్లో ఉండవచ్చని బెంగళూరు ఎన్‌సీబీ అంచనా వేస్తోంది. ఈ కేసులో ముగ్గురు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు భారతీయులు, ఒక శ్రీలంకకు చెందిన వ్యక్తి ఉన్నాడని తెలిపారు. థాయిలాండ్ నుండి ప్రయాణించిన ఈ ముగ్గురు.. కొలంబో ద్వారా బెంగళూరు చేరుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఈ డ్రగ్స్ దందా వెనుక ఎవరున్నారనే దానిపై చర్యలు చేపట్టారు. విచారణలో బయటకొచ్చిన వివరాల ప్రకారం.. ఈ సరుకును తమిళనాడుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని తేలిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎన్సీబీ అధికారులు తెలిపారు.

కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు బెంగళూరు జోన్ యూనిట్ పూర్తి స్థాయిలో 220 కిలోల హైడ్రో గంజాను స్వాధీనం చేసుకుందని.. మొత్తం 18 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో 45 మందిని అరెస్ట్‌ చేశామని అధికారులు పేర్కొన్నారు. వీరిలో కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, శ్రీలంక పౌరులు కూడా ఉన్నారు. గంజా, డ్రగ్స్‌ని తరలించేందుకు నూతన పద్ధతులను అవలంభిస్తున్నారు అక్రమార్కులు. గత పరీక్షల్లో డ్రగ్స్‌ను నట్ ప్యాకెట్ల మధ్యలో దాచడం, బాహ్య పొరగా చాక్లెట్ కోటింగ్ చేయడం వంటి పద్ధతులు అనుసరించేవారు. ఇప్పుడు ఫుడ్ టిన్‌లను వాక్యూమ్ సీలింగ్ చేసి మాస్కింగ్ చేయడం గమనార్హం. నిందితులకు విదేశీ సంబంధాలపై దర్యాప్తు చేపడతామని ఎన్‌సీబీ తెలిపింది.

Drugs Case

Drugs Case

అలాగే బెంగళూరు ఎయిర్‌పోర్టు అథారిటీస్, ఇండియన్ కోస్ట్‌గార్డ్, ఇతర విచారణ ఏజన్సీలతో సహకారంతో ఈ కేసులను చేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు, సిబ్బంది ఇంకా మేనేజ్‌మెంట్ స్థాయిలో తీసుకున్న జాగ్రత్త చర్యలూ, భవిష్యత్తులో అలాంటి మాదకద్రవ్య ప్రవాహాలను నిరోధించడానికి బలమైన ఇంటర్‌ సర్వీస్ కోఆర్డినేషన్ అవసరం ఉందని అంటున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్‌కు మార్కెట్‌లో విలువ, నెట్‌వర్క్‌కి సంబంధించిన అంతర్జాతీయ సంబంధాలు తదితర అంశాలపై దర్యాప్తు పూర్తి చేసిన తరువాతే వెలుగులోకి వస్తాయని ఎన్‌సీబీ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా