AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Food Day 2025: మన దేశంలోనే కాదు విదేశాల్లో ఈ ఆహారాలకు ఫుల్ డిమాండ్..

ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు.భారతదేశంలో ఆహారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రతీయులు భోజన ప్రియులు. క్కడ ప్రత్యేకమైన రుచులతో ప్రసిద్ధి చెందిన అనేక రకాల ఆహారాలను ఆస్వాధించవచ్చు. ఈ రోజు విదేశాలలో డిమాండ్ పెరుగుతున్న 5 భారతీయ ఆహారాల గురించి తెలుసుకుందాం..

World Food Day 2025: మన దేశంలోనే కాదు విదేశాల్లో ఈ ఆహారాలకు ఫుల్ డిమాండ్..
World Food Day 2025
Surya Kala
|

Updated on: Oct 16, 2025 | 2:57 PM

Share

ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవ ఉద్దేశ్యం ఆహార ప్రాముఖ్యతను హైలైట్ చేయడం. ప్రపంచవ్యాప్తంగా ఆహార సంస్కృతి, ఆహారపు అలవాట్లు , పోషక విలువలను హైలైట్ చేయడం. భారతదేశంలో ఆనేక రకాల ఆహార పదార్ధాలు కనిపిస్తాయి. దేశంలోని ప్రతి మూలలో మీరు విభిన్న రుచులను కనుగొంటారు. గుజరాత్‌ డోక్లా, హైదరాబాద్ బిర్యానీ, బీహార్‌ లిట్టి-చోఖా ఇలా ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన ఆహారం ఉంటుంది.

భారతీయులు ఆహార ప్రియులుగా కూడా చాలా ప్రాచుర్యం పొందారు. కారం కారంగా, రుచికరమైన ఆహారం ఇక్కడ దొరుకుతుంది. సమోసా, జిలేబీల నుంచి బిర్యానీ వరకు..ప్రతి ఒక్కటీ దాని సొంత రుచిని కలిగి ఉంటుంది. కొన్ని భారతీయ ఆహార పదార్ధాలు విదేశాలలో కూడా తమదైన ముద్ర వేశాయి. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా.. విదేశాలలో గొప్ప డిమాండ్ ఉన్న ఐదు భారతీయ ఆహారాల గురించి తెలుసుకుందాం.

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

ఇవి కూడా చదవండి

ఆహార , వ్యవసాయ సంస్థ (FAO) 1981 లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. ఈ అంతర్జాతీయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేస్తుంది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఆహారం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి హక్కు, అవసరం అని ప్రజలకు గుర్తు చేయడం. ఈ సంవత్సరం FAO స్థాపించబడిన 80వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆహార దినోత్సవానికి ఒక థీమ్‌ను నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరం దాని థీమ్ మెరుగైన ఆహారం ..మెరుగైన భవిష్యత్తు కోసం చేయి చేయి కలపడం..

విదేశాల్లో ప్రసిద్ది చెందిన భారతీయ ఆహారపదార్ధాలు

బటర్ చికెన్: ఇది భారతదేశంలో ఒక ప్రసిద్ధ వంటకం. కానీ దీనికి భారతదేశంలోనే కాదు.. విదేశాలలో కూడా డిమాండ్ ఉంది. ఉత్తర భారత వంటకం.. ఇది క్రీమీ , వెన్న రుచితో ప్రసిద్ధి చెందింది. ఇంగ్లాండ్ , యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో కూడా బటర్ చికెన్ ఒక ప్రసిద్ధ ఎంపిక.

బిర్యానీ : బాస్మతీ బియ్యంతో తయారుచేసిన బిర్యానీ రుచి చాలా గొప్పగా ఉంటుంది. హైదరాబాదీ, మొరాదాబాద్ బిర్యానీలను భారతదేశంలో విస్తృతంగా వినియోగిస్తారు. అదేవిధంగా గల్ఫ్ దేశాలు, యూరప్‌లో కూడా బిర్యానీ ఒక ప్రసిద్ధ ఎంపిక.

సమోసా: భారతీయులకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ సమోసా.. ప్రతి వీధి మూలలో మీరు వీటిని అమ్ముతారు. సాయంత్రం స్నాక్‌గా ప్రసిద్ది చెందాయి. చాలా రుచికరంగా ఉంటాయి. బంగాళాదుంపలు, బఠానీలు మసాలా దినుసులతో నిండిన ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. సమోసా డిమాండ్ భారతదేశం దాటి కెనడా, UK , యునైటెడ్ స్టేట్స్‌లో కూడా డిమాండ్ పెరుగుతోంది.

మసాలా టీ: భారతీయులు టీ లేని రోజుని అసంపూర్ణంగా భావిస్తారు. కొంతమంది తమ రోజుని ఉదయం టీతో ప్రారంభిస్తారు. భారతదేశంలో మీరు అనేక రకాల టీలు కనిపిస్తాయి. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందినది మసాలా చాయ్. అయితే ఈ మసాలా చాయ్ భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలలో కూడా ప్రజాదరణ పొందుతోంది. దీనిని చాయ్ లట్టే అని కూడా అంటారు.

పప్పు , నాన్ లకు డిమాండ్ విదేశాల్లోని భారతీయ రెస్టారెంట్లలో దాల్ తడ్కా, హాట్ నాన్ తప్పనిసరిగా ఆర్డర్ చేయాల్సిందే. ఈ కాంబో భారతీయ కంఫర్ట్ ఫుడ్ లాగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టమైన వంటకంగా మారింది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us