AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు…

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్ళించారంటూ ఫెమా చట్టం కింద ఆయనతో పాటు ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపై కూడా కేసులు నమోదయ్యాయి. సింగపూర్, మలేషియాకు రూ.16 కోట్లను తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే రాయపాటితో పాటు కుమారుడు రామారావు, ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 15 బ్యాంకుల నుంచి సుమారు రూ.8,832 కోట్లు రుణం తీసుకున్న ఈ కంపెనీ రూ.3822 కోట్లు డైవర్ట్ చేసినట్లు […]

మాజీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు...
Ravi Kiran
|

Updated on: Jan 03, 2020 | 11:48 AM

Share

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్ళించారంటూ ఫెమా చట్టం కింద ఆయనతో పాటు ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపై కూడా కేసులు నమోదయ్యాయి. సింగపూర్, మలేషియాకు రూ.16 కోట్లను తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే రాయపాటితో పాటు కుమారుడు రామారావు, ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 15 బ్యాంకుల నుంచి సుమారు రూ.8,832 కోట్లు రుణం తీసుకున్న ఈ కంపెనీ రూ.3822 కోట్లు డైవర్ట్ చేసినట్లు సీబీఐ అనుమానిస్తోంది. సింగపూర్, మలేషియా, రష్యా దేశాలకు పెద్ద ఎత్తున నిధులు మళ్లించినట్లు అభియోగాలు ఉన్నాయి.