జైపూర్ లోహా మండి వద్ద వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. పుష్పేంద్ర సింగ్, వందన కన్వర్ అనే దంపతులు దాదాపు 20 అడుగులు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదం సీసీటీవీలో రికార్డైంది. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.