Crime News: షాకింగ్… రూ. 879కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్

అఫ్గానిస్తాన్​ నుంచి అక్రమంగా హెరాయిన్ తరలిస్తున్న ఓ స్మగ్లర్​ను మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్​ఐ) అధికారులు అరెస్టు చేశారు . నిందితుడి దగ్గర నుంచి...

Crime News:  షాకింగ్... రూ. 879కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్
Heroin Seized
Follow us

|

Updated on: Jul 04, 2021 | 12:55 PM

అఫ్గానిస్తాన్​ నుంచి అక్రమంగా హెరాయిన్ తరలిస్తున్న ఓ స్మగ్లర్​ను మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్​ఐ) అధికారులు అరెస్టు చేశారు . నిందితుడి దగ్గర నుంచి దాదాపు 300 కేజీల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ రూ. 879 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఇరాన్​, అఫ్గానిస్తాన్​ నుంచి అక్రమంగా తరలించిన సరుకును.. జిప్సమ్​ స్టోన్​, తాల్కమ్​ పౌడర్​గా అధికారులు గుర్తించారు. ఈ సరుకును సరఫరా చేస్తున్న ప్రబ్​జోత్​ సింగ్ అనే నిందితుడిని రాయ్​గఢ్ దగ్గర్లోని జవహర్​లాల్​ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(జేఎన్​పీటీ) సమీపంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఏడాది నుంచి నిందితుడు మత్తు పదార్థాల దందా కొనసాగిస్తున్నట్లు తెలిసిందని అధికారులు వివరించారు. గతేడాది ఆగస్టులోనూ ఆయుర్వేదిక్ మందుల పేరిట హెరాయిన్ సరఫరా చేస్తున్న కంటైనర్​ను డీఆర్​ఐ బృందాలు గుర్తించాయి. రూ. 1,000 కోట్ల విలువ చేసే హెరాయిన్​ను సీజ్​ చేశాయి. అప్పుడు కూడా ఆ మత్తుపదార్థాలు అఫ్గాన్​ నుంచే సరఫరా అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

ముంబైలో  రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం

మహారాష్ట్ర ముంబైలో 290 కిలోల హెరాయిన్​ను రెవెన్యూ ఇంటిలిజెన్స్​ డైరెక్టరేట్​(ఆర్​ఐడీ)అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.300 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. సముద్ర మార్గం ద్వారా విదేశాల నుంచి ముంబైలోని జేఎన్​పీటీ పోర్టుకు మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు.. తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే భారీగా హెరాయిన్​ పట్టుబడినట్లు వెల్లడించారు. అలాగే జేఎన్​పీటీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు.

Also Read: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 151 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తుల గడువు రేపటితోనే ముగియనుంది..

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?