AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR కుటుంబం తెలంగాణ ప్రజల్ని క్షమాపణ అడగాలి

KCR కుటుంబం తెలంగాణ ప్రజల్ని క్షమాపణ అడగాలి

Phani CH
|

Updated on: Feb 08, 2026 | 10:11 PM

Share

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కుటుంబం విచారణ ఎదుర్కొంటుందని, గతంలో సాక్ష్యాలు ధ్వంసం చేసిన చరిత్ర వారిదని అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో కుట్ర జరిగితే అది వారి వైపు నుంచే ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ, కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్, కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం కేటీఆర్ చిల్లర ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కుటుంబం విచారణ ఎదుర్కుంటోందని, ఈ కేసులకు సంబంధించిన ఆడియో టేపులు, ఇతర వివరాలన్నీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం వెనుక కేటీఆర్ హస్తం ఉందేమోనని చామల అనుమానం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఏదైనా కుట్ర జరిగితే, అది కేటీఆర్ వైపు నుంచే ఉండాలని ఆయన సూచించారు, ఎందుకంటే వారిపై ఇప్పటికే విచారణ జరుగుతోందని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

YS జగన్ తో హీరో సూర్య, కార్తీ, మోహన్ బాబు

Mumbai: ముంబైలో చిరుత కలకలం

కర్ణాటకలో కుప్పకూలిన చార్టర్డ్‌ ఫ్లైట్‌

ఎన్నాళ్లీ మంటలు.. భయపెడుతున్న అగ్నిప్రమాదాలు

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం