రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు హర్షవీణ పవన్ కళ్యాణ్ను కలిసేందుకు అవకాశం కోరారు. తరంశెట్టి నాగేంద్ర లాంటి వ్యక్తులు పవన్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ను కలిసి ఆధారాలు సమర్పిస్తానని, తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆమె వీడియోలో స్పష్టం చేశారు.