AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ.. చెక్‌  చేయగా

అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ.. చెక్‌ చేయగా

Phani CH
|

Updated on: Feb 09, 2026 | 9:40 AM

Share

హైదరాబాద్ పోలీసులు ఎస్సార్ నగర్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన ఓ మహిళా సబ్‌-పెడ్లర్‌ను అరెస్ట్ చేసి, ఆమె నుంచి 11.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈమె యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తోంది. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వ్యసనపరులకు కౌన్సిలింగ్ ఇస్తామని భరోసా ఇచ్చారు.

నగరంలో మాదకద్రవ్యాల విక్రేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమిషనర్ టాస్క్‌ఫోర్స్ వెస్ట్‌జోన్ బృందం నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ ఆపరేషన్‌లో ఒక మహిళను అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుంచి రూ.5.7 లక్షల విలువైన 11.4 కిలోల డ్రై గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన మహిళను ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన రినిత రాయితగా పోలీసులు గుర్తించారు. వ్యవసాయ పనులు చేసే ఈమె, తన సోదరుడు మానియెల్ దలబెహెరాతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి సబ్‌-పెడ్లర్‌గా మారింది. నగరం అంతటా తిరుగుతూ యువతనే లక్ష్యంగా చేసుకుని ఈ మత్తు పదార్థాలను విక్రయిస్తోంది. పక్కా సమాచారంతో వెస్ట్‌జోన్ డీసీపీ మొహమ్మద్ ఇక్బాల్ సిద్ధిక్ నేతృత్వంలో పోలీసులు వలపన్ని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్నాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడలేకపోతుంటే, తమను సంప్రదిస్తే తగిన కౌన్సిలింగ్ ఇప్పించి విముక్తి కలిగిస్తామని పోలీసులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!

ఇక 27 భాషల్లో యూట్యూబ్‌ వీడియోలు

పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు

Spirit: ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా కండిషన్.. అదే..