AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Myopia: పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందో తెలుసా?

జీవనశైలి వ్యాధులలో మయోపియా ఒకటి. ఈ వ్యాధి నానాటికీ పిల్లల్లో ఎక్కువవుతుంది. ఇందుకు ప్రధాన కారణం అవగాహన లోపమేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే ఏం చేయాలో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..

Myopia: పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందో తెలుసా?
Myopia
Srilakshmi C
|

Updated on: Nov 15, 2024 | 9:41 PM

Share

ఇటీవలి అధ్యయనాలు మయోపియాను తీవ్రమైన వ్యాధిగా పరిగణింస్తున్నాయి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం 2030 నాటికి 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల భారత్‌లోని పట్టణ ప్రాంతాల్లోని పిల్లలలో దాదాపు మూడింట ఒక వంతు మంది మయోపియాతో బాధపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. చెడు జీవనశైలి, ఎక్కువ కాలం స్క్రీన్‌ని ఉపయోగించడం వల్ల ఇది జరిగే అవకాశం ఉంది. భారత్‌లో దీని రేటు 2050 నాటికి 49 శాతానికి చేరుకుంటుందని పరిశోధనలో తేలింది. మయోపియా భవిష్యత్తులో తీవ్రమైన సమస్యగా మారబోతుందట.

మయోపియా అనేది ఒక సాధారణ కంటి సమస్య. ఇది వచ్చిన వారిలో సుదూర వస్తువులను చూడటంలో ఇబ్బంది కలుగుతుంది. కానీ సమీపంలోని వస్తువులను స్పష్టంగా చూడగలడు. మయోపియాలో సుదూర వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. ఈ కంటి సమస్య పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభవిస్తుంది. మయోపియాలో సుదూర దృశ్యాలు స్పష్టంగా కనిపించవు. అటువంటి పరిస్థితిలో వైద్యులు కళ్లద్దాలు ధరించమని సిఫార్సు చేస్తారు. మయోపియా కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. అయితే ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కొరవడింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు, పీడియాట్రిక్ ఆప్తాల్మోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ENTOD ఫార్మాస్యూటికల్స్ సంయుక్తంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా భారత్‌లో 3 కోట్ల మందికి పైగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తున్నారు.

మయోపియా-అవగాహన లోపం

పిల్లల కంటి ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పీడియాట్రిక్ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ జీతేంద్ర జెథాని అంటున్నారు. మయోపియాను నివారించడానికి, రెగ్యులర్ చెకప్‌లు, స్క్రీన్ ఎక్స్‌పోజర్‌ను పరిమితం చేయడం అవసరం. పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్‌లను ఉపయోగిస్తే, మయోపియా ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో పిల్లలు వారి ఫోన్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఎటువంటి కారణం లేకుండా వారికి ఫోన్లు లేదా ల్యాప్‌ టాప్‌లు ఇవ్వవద్దు.

ఇవి కూడా చదవండి

మయోపియాను ఎలా నివారించాలి?

అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులు ధరించడం ద్వారా మయోపియా చికిత్స చేయవచ్చు. కానీ ఇది ఉపశమనం కలిగించకపోతే, లేజర్ శస్త్రచికిత్స ద్వారా మయోపియా నయమవుతుంది. కొన్ని సందర్భాల్లో, కార్నియల్ శస్త్రచికిత్స కూడా అవసరం. అయితే, మయోపియాను నియంత్రించడానికి కళ్ళను క్రమం తప్పకుండా చెకప్‌ చేసుకుంటూ ఉండాలి. స్క్రీన్‌ను తక్కువగా ఉపయోగించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..