Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జూన్ 2న సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కాంగ్రెస్ ఘన సత్కారం.. ఎన్నికల్లో గెలిస్తే కోటి నగదు బహుమతి’

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ క్విజ్ కాంపిటీషన్ శుక్రవారం (మే 12) బోయిన్ పల్లిలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

'జూన్ 2న సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కాంగ్రెస్ ఘన సత్కారం.. ఎన్నికల్లో గెలిస్తే కోటి నగదు బహుమతి'
Revanth Reddy With Rahul Sipligunj
Follow us
Srilakshmi C

|

Updated on: May 12, 2023 | 6:20 PM

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ క్విజ్ కాంపిటీషన్ శుక్రవారం (మే 12) బోయిన్ పల్లిలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేద కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అందుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ఆస్కార్ స్థాయికి ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఘరంగా సన్మానిస్తుందని తాము భావించామన్నారు. కానీ కేసీఆర్ సర్కార్ ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ విస్మరించినా.. రాహుల్ సిప్లిగంజ్‌ను తాము గౌరవిస్తామని మాట ఇచ్చారు. కళాకారులను సన్మానించవల్సిన అవసరం ఎంతైన ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

జూన్ 2న రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ సన్మానం ఏర్పాటు చేయడంతోపాటు రూ.10 లక్షల నగదు బహుమతి కూడా అందిస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక కోటి రూపాయల నగదు బహుమతి అందిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఆర్ఆర్ఆర్ మువీలోని నాటు నాటు పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (ఉత్తమ పాట) విభాగంలో ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, తొలి భారతీయ సినిమా పాటగా చరిత్ర సృష్టించింది. ఈ పాటకు గేయ రచయిత చంద్రబోస్‌ సాహిత్యం అందించగా ఎమ్‌.ఎమ్‌ కీరవాణి స్వరపరిచారు. కాల భైరవ, రాహుల్‌ సిప్లీగంజ్‌ ఆలపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.