Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranya Rao: రన్య రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. ఆ ఇద్దరు హీరోయిన్లకు షాకిచ్చిన సీసీబీ..

రన్య రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఎంతమంది పాత్ర ఉందనేది తెలుసుకోవడానికి సీబీఐ రంగంలోకి దిగింది. కొన్ని రోజులుగా ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే రన్య రావు భర్తను రెండుసార్లు విచారించింది. తాజాగా ఇద్దరు హీరోయిన్లకు సీసీబీ షాకిచ్చింది.

Ranya Rao: రన్య రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. ఆ ఇద్దరు హీరోయిన్లకు షాకిచ్చిన సీసీబీ..
Ragini, Sanjana
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 12, 2025 | 12:13 PM

బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్య రావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రన్య వెనుక రాజకీయ నాయకులు, పోలీసులు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఎక్కడ చూసిన రన్య రావు పేరు మారుమోగుతుంది. రన్యరావు కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లకు షాకిచ్చింది. . గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన సంజన గల్రానీ, రాగిణి ద్వివేదిలపై ఎఫ్ఐఆర్ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సీసీబీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తోంది.

2020లో, మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి పోలీసులు హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజన గల్రానీలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ నటీమణులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు, ఆధారాలు లేకపోవడంతో రాగిణిపై కేసును కూడా కొట్టివేసింది. సంజనపై నమోదైన ఎఫ్ఐఆర్ కూడా రద్దు చేసింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీసీబీ ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఇద్దరు హీరోయిన్స్ కేసులో హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఇందుకు హోంశాఖ, న్యాయశాఖ అనుమతి తీసుకుంది. అంతకుముందు, దర్శన్ కేసులో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర పోలీసులు కూడా అప్పీల్ దాఖలు చేశారు. కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఉన్నట్లు అనిపించడం లేదు. ఐదేళ్ల నాటి కేసుపై వారు ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి

హీరోయిన్స్ రాగిణి, సంజన గల్రానీ డ్రగ్స్ సరఫరాలో సహకరించారు. మాదకద్రవ్యాల వాడకం ఆరోపణలపై వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాగిణి, సంజనలతో పాటు మరికొంతమందిని సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో, డ్రగ్ కేసుకు సంబంధించి అనేక మంది నటులు, నటీమణులను పిలిపించి ప్రశ్నించారు. లూజ్ మాద యోగి, దిగంత్, అనేక మందిని పిలిపించి విచారించారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..