AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ద్రవిడ్ హయాంలో తోపు ఫినిషర్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌గా మార్చిన గంభీర్..

Team India: 2026 టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఈ మ్యాచ్ విన్నర్‌ను సరైన రీతిలో వాడుకోవడం టీమ్ ఇండియాకు చాలా ముఖ్యం. గంభీర్ తన వ్యూహాలను మార్చుకుని ఇలాంటి అద్భుతమైన ప్లేయర్‌కు మళ్ళీ ఫినిషర్ పాత్రను ఇస్తారా? లేక మరికొంత కాలం వేచి చూడాల్సిందేనా? అనేది వేచి చూడాలి.

Team India: ద్రవిడ్ హయాంలో తోపు ఫినిషర్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌గా మార్చిన గంభీర్..
Rinku Singh Gambhir
Venkata Chari
|

Updated on: Dec 28, 2025 | 1:51 PM

Share

Team India: భారత క్రికెట్‌లో అత్యంత తక్కువ సమయంలోనే ‘నమ్మదగ్గ ఫినిషర్’గా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు రింకూ సింగ్. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలో మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఈ అలీగఢ్ వీరుడు, ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో తగినన్ని అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. గంభీర్ హయాంలో టీమిండియాలో కేవలం ‘వాటర్ బాయ్’గా మారిపోయాడని వస్తున్న వార్తలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో వేడిని పుట్టిస్తున్నాయి.

భారత టీ20 క్రికెట్‌లో ఎంఎస్ ధోనీ తర్వాత ఆ స్థాయిలో మ్యాచ్‌లను ఫినిష్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడిగా రింకూ సింగ్‌ను అందరూ కొనియాడారు. కానీ, ప్రస్తుతం టీమ్ ఇండియాలో అతని స్థానం ప్రశ్నార్థకంగా మారింది.

ద్రవిడ్ కాలంలో ఒక వెలుగు:

గత ఏడాది రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్న సమయంలో రింకూ సింగ్‌కు స్పష్టమైన పాత్రను ఇచ్చారు. ద్రవిడ్, అప్పటి మేనేజ్‌మెంట్ రింకూపై పూర్తి నమ్మకాన్ని ఉంచారు. అతను ఆడిన దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. లోయర్ ఆర్డర్‌లో వచ్చి భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టిన రింకూ, అతి తక్కువ సమయంలోనే టీ20 స్పెషలిస్ట్‌గా ఎదిగాడు. ఆ సమయంలో రింకూ బ్యాట్ నిప్పులు చెరిగేదని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Team India: టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా యువ సంచలనం.. సూర్యకుమార్‌పై వేటు.. గిల్‌కు నో ఛాన్స్.?

గంభీర్ హయాంలో మార్పులు..

గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక, జట్టులో ‘మల్టీ-స్కిల్డ్’ (బౌలింగ్ కూడా చేయగల) ఆటగాళ్లకు ప్రాధాన్యత పెరిగింది. వాషింగ్టన్ సుందర్, శివం దూబే వంటి ఆల్ రౌండర్ల రాకతో రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లలో రింకూకు తక్కువ అవకాశాలు లభించాయి. జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడకుండా కేవలం బయట కూర్చోవాల్సి రావడం లేదా నీళ్లందించే పనికి పరిమితమవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: లక్కీ ఛాన్స్ పట్టేసిన ఐపీఎల్ బుడ్డోడు.. టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

గందరగోళంలో పాత్ర:

రాహుల్ ద్రవిడ్ కాలంలో ఆటగాళ్లకు వారి పాత్రలపై స్పష్టత ఉండేదని, కానీ గంభీర్ హయాంలో ఎప్పుడు ఎవరు జట్టులో ఉంటారో, ఎవరు తప్పుకుంటారో తెలియని అభద్రతా భావం పెరిగిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రింకూ వంటి ప్యూర్ బ్యాటర్‌ను పక్కన పెట్టి, ఆల్ రౌండర్ల కోసం చూడటం వల్ల అతని ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది.

రంజీలో సత్తా చాటుతున్న రింకూ..

మరోవైపు, టీమ్ ఇండియాలో అవకాశాలు తగ్గినప్పటికీ, రింకూ రంజీ ట్రోఫీలో తన సత్తా చాటుతున్నాడు. ఇటీవల ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతూ 176 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో సెలక్టర్లకు బలమైన సందేశం పంపాడు. తన ఫస్ట్ క్లాస్ యావరేజ్‌లో రాహుల్ ద్రవిడ్‌నే మించిపోయిన రింకూ, తాను కేవలం టీ20 హిట్టర్‌ను మాత్రమే కాదని నిరూపిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..