AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్కీ ఛాన్స్ పట్టేసిన ఐపీఎల్ బుడ్డోడు.. టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

Vaibhav Suryavanshi Named India Captain: దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు, వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియాలో జరగనున్న తదుపరి ప్రపంచ కప్‌కు భారత అండర్-19 జట్లను బీసీసీఐ జూనియర్ క్రికెట్ కమిటీ శనివారం ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా, ఆరోన్ జార్జ్ డిప్యూటీగా నియమితులయ్యారు.

లక్కీ ఛాన్స్ పట్టేసిన ఐపీఎల్ బుడ్డోడు.. టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Dec 28, 2025 | 7:08 AM

Share

Vaibhav Suryavanshi Named India Captain: భారత క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టి రికార్డు సృష్టించిన బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు టీమ్ ఇండియా అండర్-19 జట్టు పగ్గాలను చేపట్టబోతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలకమైన వన్డే సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) జూనియర్ క్రికెట్ కమిటీ వైభవ్ సూర్యవంశీని కెప్టెన్‌గా ప్రకటించింది.

వైభవ్ కెప్టెన్‌గా ఎందుకు?

నిజానికి అండర్-19 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టుకు ఆయుష్ మ్హత్రే కెప్టెన్‌గా, విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం మణికట్టు గాయాలతో బాధపడుతున్నారు. ప్రపంచకప్ నాటికి వారు కోలుకోవాల్సి ఉండటంతో, ముందుగా జరిగే దక్షిణాఫ్రికా పర్యటనకు వీరిద్దరూ దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీకి జట్టు నాయకత్వ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. ఆరోన్ జార్జ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

రికార్డుల వీరుడు సూర్యవంశీ: వైభవ్ సూర్యవంశీ పేరు ఇటీవల క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతోంది.

ఐపీఎల్ రికార్డ్: ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్‌ను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. దీనితో ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్సులో కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాడిగా అతను నిలిచాడు.

బాల పురస్కారం: క్రికెట్ రంగంలో అతని ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’తో అతడిని గౌరవించింది.

సచిన్‌తో పోలిక: చిన్న వయస్సులోనే అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యం కనబరుస్తున్న వైభవ్‌ను చూసి విశ్లేషకులు అతడిని ‘మరో సచిన్ టెండూల్కర్’ అని అభివర్ణిస్తున్నారు.

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వంశ్ సింగ్ (కీపర్), ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, మహమ్మద్ ఏనన్, హెనిల్ పటేల్, డి దీపేష్, కిషన్ కుమార్ సింగ్, ఉద్ధవ్ మోహన్, యువరాజ్ గోహిల్, రాహుల్ కుమార్.

వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికలుగా అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు దక్షిణాఫ్రికా సిరీస్ భారత కుర్రాళ్లకు మంచి సన్నద్ధతను ఇస్తుంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ తన నాయకత్వ పటిమను నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..