AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 OTT: పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్.. ఏకంగా అన్ని వందల కోట్లా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగులో బిజీ బిజీగా ఉంటున్నారు. సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ పుష్పకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 15నే విడుదల కావాల్సిన పుష్ప 2 కొన్ని కారణాలతో డిసెంబర్ 6కు వాయిదా పడింది.

Pushpa 2 OTT: పుష్ప 2 సినిమాకు కళ్లు చెదిరే ఓటీటీ డీల్.. ఏకంగా అన్ని వందల కోట్లా?
Pushpa 2 Movie
Basha Shek
|

Updated on: Aug 31, 2024 | 9:22 PM

Share

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగులో బిజీ బిజీగా ఉంటున్నారు. సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ పుష్పకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 15నే విడుదల కావాల్సిన పుష్ప 2 కొన్ని కారణాలతో డిసెంబర్ 6కు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. దీనికి సంబంధించి ఈ మధ్యనే చిత్ర నిర్మాత రవిశంకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబరు-అక్టోబరు కల్లా మరో రెండు సాంగ్స్ రిలీజ్ అవుతాయని,ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ అధినేత చెప్పుకొచ్చారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు 6న థియేటర్లలో పుష్ప 2 రిలీజ్ పక్కాగా ఉంటుందని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. ఇదిలా ఉండగానే పుష్ప 2 సినిమా ఓటీటీ హక్కుల గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఒకటి తెగ వైరల్ అవుతోంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు ఏ మూవీకి లేనంతగా ఏకంగా రూ.270 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ పుష్ప 2 డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. ఇప్పుడీ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

కాగా పుష్ప 2 లో రష్మిక మందన్నా పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. అలాగే భన్వర్ సింగ్ షెకావత్ వర్సెస్ పుష్పరాజ్ మధ్య నడిచే యాక్షన్ డ్రామా మరో లెవెల్ లో ఉంటుందని టాక్. ఈ సినిమాలో ఫహద్‌ ఫాజిల్, సునీల్‌, అనసూయ, జగదీశ్‌ ప్రతాప్‌, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. కాగా మొదటి పార్ట్ కంటే మించి ఉండేలా సుమారు రూ. 500 కోట్లతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ . త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. మరోవైపు ‘పుష్ప’ పార్ట్ 3 కూడా ఉండొచ్చని మొన్నీమధ్యే ఓ ఇంటర్వ్యూలో రావు రమేశ్ చెప్పుకొచ్చారు.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక