AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manasantha Nuvve: ‘మనసంతా నువ్వే’లో హీరో ఉదయ్‌ కిరణ్‌ చెల్లెలు గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

ఉదయ్ కిరణ్ తో పాటు మనసంతా నువ్వే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో చంద్ర మోహన్ కూతురిగా, ఉదయ్ కిరణ్ చెల్లెలిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా? చూడడానికి పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆ నటి పేరు శిరీష

Manasantha Nuvve: 'మనసంతా నువ్వే'లో హీరో ఉదయ్‌ కిరణ్‌ చెల్లెలు గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Manasantha Nuvve Movie
Basha Shek
|

Updated on: Aug 29, 2024 | 2:41 PM

Share

దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. 2001లో విడుదలైన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వీఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలో రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఉదయ్ కిరణ్ తో పాటు మనసంతా నువ్వే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమాలో చంద్ర మోహన్ కూతురిగా, ఉదయ్ కిరణ్ చెల్లెలిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా? చూడడానికి పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఆ నటి పేరు శిరీష. మనసంతా నువ్వేతో పాటు పలు సినిమాల్లో సిస్టర్స్ క్యారెక్టర్స్ పోషించిందామె. అందమైన రూపం, ఆకట్టుకునే నటన.. ఇలా ఓ హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నా సిస్టర్స్ గానే మెప్పించింది శిరీష. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, రవితేజ తదితర స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా నటిగా కెరీర్ పీక్స్ లో ఉండగానే శిరీష పెళ్లి చేసుకుంది. దీంతో అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం పిల్లల పెంపకంలో బిజీగా ఉన్న శిరీష మళ్లీ సినిమాలవైపు మెల్లిగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది శిరీష. ఊర్వశివో, రాక్షసివో సీరియల్లో హీరోకు తల్లిగా నటిస్తోంది. అలాగే సీతా రాముడి కట్నం ధారావాహికలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోది. అన్నట్లు శిరీష కేవలం నటినే కాదు.. యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. గతంలో టీవీ ప్రజెంటర్ గా కూడా వ్యవహరించింది. ఇక ఇప్పుడు వెండితెరపై కూడా మెరిసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం మన్మయి అనే ఓ సినిమాలో నటిస్తోందట శిరీష. దీంతో పాటు మరో రెండు సినిమాలు తన చేతిలో ఉన్నాయని ఇటీవల ఒక వీడియోలో చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

నటి శిరీష లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోలు..

ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే శిరీష నిత్యం తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

 త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.