Jobs: బీటెక్ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలు జీతం పొందే అవకాశం.
సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రిసెర్చ్ (సమీర్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు...

సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రిసెర్చ్ (సమీర్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సైంటిస్ట్-బీ (18), సైంటిస్ట్-సీ (03) పోస్టులు ఉన్నాయి.




* సైంటిస్ట్-బీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సైంటిస్ట్-సీ: బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్డిగ్రీ/ ఎంటెక్/ ఎంఈ చేసిన వారు అర్హులు. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ టెక్నికల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* సైంటిస్ట్-బీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 56100 నుంచి రూ.177500 చెల్లిస్తారు. అలాగే సైంటిస్ట్ – సీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.67700-రూ.208700 చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 08-04-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..




