AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma : ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సార్లు..తొలి బంతికే సిక్సర్ కొట్టి రికార్డు క్రియేట్ చేసిన శర్మ జీ కా లడ్కా

Abhishek Sharma : భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 18 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

Abhishek Sharma : ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సార్లు..తొలి బంతికే సిక్సర్ కొట్టి రికార్డు క్రియేట్ చేసిన శర్మ జీ కా లడ్కా
Abhishek Sharma
Rakesh
|

Updated on: Dec 15, 2025 | 5:01 PM

Share

Abhishek Sharma : భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 18 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే తన బ్యాటింగ్‌ను సిక్సర్‌తో ప్రారంభించి లుంగి ఎంగిడి వేసిన తొలి బంతిని బౌండరీ దాటించడంతో, అభిషేక్ శర్మ ఒక సరికొత్త వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అభిషేక్ శర్మ టీ20 ఇంటర్నేషనల్‌లలో తొలి బంతిని సిక్సర్‌గా మలచడం ఇది మూడోసారి. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటగాడు అభిషేక్ శర్మ. మొదటిసారి బంగ్లాదేశ్‌పై ఈ అద్భుతం చేశాడు. రెండోసారి పాకిస్తాన్‌పై ఇదే విధంగా సిక్సర్‌తో తన ఖాతా తెరిచాడు. మూడోసారి అది ఇప్పుడు దక్షిణాఫ్రికాపై తొలి బంతికే సిక్సర్ కొట్టి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.

అభిషేక్ శర్మ ఇప్పటివరకు కేవలం 21 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు, కానీ ఇప్పటికే 58 సిక్సర్లు కొట్టాడు. దీని ప్రకారం అతను ప్రతి 6.83 బంతులకు ఒక సిక్సర్ కొడుతున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సుమారు 200 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తూ, ప్రస్తుతం అతను ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మెన్గా కూడా ఉన్నాడు. అయితే గత ఆరు ఇన్నింగ్స్‌లలో అభిషేక్ బ్యాట్ నుంచి హాఫ్ సెంచరీ రాలేదు. అతనికి మంచి ప్రారంభం లభిస్తున్నప్పటికీ, కీలక సమయంలో వికెట్ పారేసుకుంటున్నాడు. రాబోయే లక్నో టీ20లో అతని హాఫ్ సెంచరీల కరువు తీరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ధర్మశాల టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో మంచి కమ్ బ్యాక్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ ఈ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించింది. అయితే ఈ విజయం సాధించినా, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడం జట్టుకు ఇంకా ఆందోళన కలిగిస్తున్న విషయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..