Gold, Silver: కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి అమ్ముతోంది..? కొనుగోలు చేయడం ఎలా..?

బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అలాంటిది బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. పెళ్లిళ్లు, ఇతర పండగ సీజన్‌లో అయితే బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. బంగారాన్ని సురక్షితమైన స్వర్గంగా భావించే దేశం అనేక శతాబ్దాల నాటి లోహం పట్ల దీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉంది. బంగారం..

Gold, Silver: కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి అమ్ముతోంది..? కొనుగోలు చేయడం ఎలా..?
Gold And Silver
Follow us

|

Updated on: Apr 23, 2023 | 4:12 PM

బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అలాంటిది బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. పెళ్లిళ్లు, ఇతర పండగ సీజన్‌లో అయితే బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. బంగారాన్ని సురక్షితమైన స్వర్గంగా భావించే దేశం అనేక శతాబ్దాల నాటి లోహం పట్ల దీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉంది. బంగారం, వెండి లోహాల కొనుగోలును సులభతరం చేయడానికి, భారత ప్రభుత్వం ఒక ఆప్షన్‌ను రూపొందించింది.

ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయాలంటే షాపుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా బంగారాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ప్రజలు ఇప్పుడు నేరుగా భారత ప్రభుత్వ మింట్ నుంచి బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చు. 2.5 గ్రాములు, 5 గ్రాములు, 8 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు మొదలైన వివిధ విలువలను కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి గల కస్టమర్‌లు ఈ నాణేల కోసం ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్‌లు చేయవచ్చు. అలాగ భారతదేశంలోని ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, నోయిడా, కోల్‌కతాలోని ఐదు ప్రదేశాలలో ఉన్న మింట్ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

భారతీయ ప్రభుత్వ మింట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి వినియోగదారులు బంగారం లేదా వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చు. భారత ప్రభుత్వ మింట్ ప్రకారం.. డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నగదు వంటి సదుపాయాల ద్వారా చెల్లింపులు చేసి కొనుగోలు చేయవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ మింట్‌లో ముద్రించిన, భారతదేశంలో విక్రయించబడే నాణేలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ ప్రకారం ధృవీకరించబడ్డాయి. నాణేలు 24-క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛంగా ఉంటాయి. బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తుంది. బంగారంపై పెట్టిన పెట్టుబడి స్థిరంగా ఉంటుంది.

మింట్‌ అంటే ఎమిటి?

మింట్‌ అంటే కొందరికి తెలిసినా మరి కొందరికి తెలియకపోవచ్చు. దేశంలో డబ్బులను తయారు చేసే కేంద్రాలను మింట్‌ కేంద్రాలు అని పిలుస‍్తారు. ఈ కేంద్రాలు దేశ వ్యాప్తంగా 5 మెట్రో నగరాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

1. ఢిల్లీలో జవహార్‌ వాయిపర్‌ భవన్‌ జన్‌పథ్‌

2. నోయిడాలో డీ-2 సెక్టార్‌ 1

3. హైదరాబాద్‌లో ఐడీఏ ఫేజ్‌ 2, చర్లపల్లి

4. ముంబైలో షాహిద్‌ భగత్‌సింగ్‌ రోడ్‌

5. కోల్‌కతాలోని అలిపోరి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే