AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaktikanta Das: ద్రవ్యోల్బణం నియంత్రణ విషయంలో రిజర్వు బ్యాంక్ పై విమర్శలు.. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే..

Shaktikanta Das: ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్‌బీఐ సకాలంలో చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు తోసిపుచ్చారు.

Shaktikanta Das: ద్రవ్యోల్బణం నియంత్రణ విషయంలో రిజర్వు బ్యాంక్ పై విమర్శలు.. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే..
Rbi
Ayyappa Mamidi
|

Updated on: Jun 17, 2022 | 5:06 PM

Share

Shaktikanta Das: ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్‌బీఐ సకాలంలో చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు తోసిపుచ్చారు. ద్రవ్యోల్బణ నిర్వహణపై సెంట్రల్ బ్యాంక్ ముందుగానే దృష్టి సారించి ఉంటే.. దాని పర్యవసానాలు ఆర్థిక వ్యవస్థకు వినాశకరంగా ఉండేవని ఆయన విధాన చర్యలను సమర్థించారు. దాదాపు రెండేళ్ల తర్వాత మేలో ఆర్‌బీఐ రెపో రేటును మెుదటగా 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆ తర్వాత జూన్ 8న మరో సారి 50 బేసిస్ పాయింట్ల మేర రేటును పెంచింది. ఈ విధంగా రెండు విడతలుగా బ్యాంకు 90 బేసిస్ పాయింట్లను పెంచింది.

అధిక ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడం అవసరమని శక్తికాంత దాస్ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కార్యక్రమంలో చెప్పారు. తాము నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఆర్థిక మార్పుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వృద్ధి సంబంధిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణాన్ని నిర్వహించాలని ఆర్‌బిఐ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొనబడింది. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి నేపథ్యంలో.. ఆర్‌బిఐ వృద్ధిపై దృష్టి సారించింది. సాఫీగా లిక్విడిటీ పరిస్థితులను అనుమతించింది. అయినప్పటికీ, 2022-21లో ఆర్థిక వ్యవస్థ 6.6 శాతం క్షీణించింది.

కేంద్ర బ్యాంకు తన వైఖరిని ముందుగానే మార్చుకుని ఉంటే.. అది 2021-22లో వృద్ధిని ప్రభావితం చేసి ఉండేదని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు మూడు, నాలుగు నెలల క్రితమే ఆర్‌బీఐ దృష్టి సారించలేకపోయిందని ఆర్‌బీఐ గవర్నర్‌ స్పష్టం చేశారు. మార్చిలో, ఆర్థిక కార్యకలాపాలు ప్రపంచ మహమ్మారి కంటే ముందు స్థాయిని అధిగమించాయని RBI భావించినప్పుడు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే దిశగా పని చేయాలని నిర్ణయించుకుంది.

సెంట్రల్ బ్యాంక్ తక్షణమే రేట్లను పెద్దగా పెంచలేకపోయిందని శక్తికాంత దాస్ అన్నారు. 2022 ఫిబ్రవరిలో 2022-23లో ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉండవచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. అది ఆశాజనకమైన అంచనా కాదు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లుగా అంచనా వేయడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గణన కూడా జరిగింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడితో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముడి చమురు ధరలో గణనీయమైన పెరుగుదలకు కారణమైంది. ఒక సమయంలో బ్యారెల్ ధర 139 డాలర్లకు చేరుకుంది. ఇది 2008 నుండి అత్యధిక స్థాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.