RBI: ఈ ఐదు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా.. కారణం ఏంటంటే..!
RBI Action: ఈ చర్య ఆర్బీఐ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 47A(1)(c), సెక్షన్ 46(4)(i), సెక్షన్ 56 కింద తీసుకుంది. ఈ జాబితాలో బీహార్, పశ్చిమ బెంగాల్ నుండి రెండు బ్యాంకులు, ఒడిశా నుండి ఒక బ్యాంకు ఉన్నాయి..

RBI Action: దీపావళికి ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి చర్యలు చేపట్టింది. కేవైసీతో సహా బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐదు సహకార బ్యాంకులకు ఆర్బీఐ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 47A(1)(c), సెక్షన్ 46(4)(i), సెక్షన్ 56 కింద ఒకేసారి జరిమానా విధించింది ఆర్బీఐ. ఈ చర్య ఆర్బీఐ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 47A(1)(c), సెక్షన్ 46(4)(i), సెక్షన్ 56 కింద తీసుకుంది. ఈ జాబితాలో బీహార్, పశ్చిమ బెంగాల్ నుండి రెండు బ్యాంకులు, ఒడిశా నుండి ఒక బ్యాంకు ఉన్నాయి.
ఈ చర్యను ఆర్బిఐ అక్టోబర్ 16 గురువారం ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించింది. బ్యాంకుల ఆర్థిక స్థితిని తనిఖీ చేయడానికి మార్చి 31, 2024న తనిఖీ నిర్వహించింది. తనిఖీ సమయంలో బ్యాంకులు కొన్ని మార్గదర్శకాలను సరిగ్గా పాటించడం లేదని తేలింది. ఈ ఉల్లంఘనలను కనుగొన్న తర్వాత ఆర్బిఐ అన్ని బ్యాంకులకు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు వచ్చిన సమాధానాలు, వ్యక్తిగత విచారణ సమయంలో చేసిన ప్రజెంటేషన్ల ఆధారంగా ఆరోపణలు నిర్ధారించింది. దీని తర్వాత ఈ బ్యాంకులన్నింటిపై జరిమానాలు విధించాలని నిర్ణయం తీసుకుంది.
రెండు బీహార్ బ్యాంకులకు జరిమానాలు:
బీహార్లోని గోపాల్గంజ్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కస్టమర్ల KYC రికార్డులను నిర్ణీత గడువులోపు సెంట్రల్ KYC రికార్డ్స్ రిజిస్ట్రీకి అప్లోడ్ చేయడంలో విఫలమైనందుకు, అలాగే ఇతర నిబంధనలు ఉల్లంఘించినందున రూ.5.50 లక్షల జరిమానా విధించింది ఆర్బీఐ. బీహార్లోని బెగుసరాయ్లో ఉన్న బెగుసరాయ్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కూడా తన KYC రికార్డులను సెంట్రల్ KYC రికార్డ్స్ రిజిస్ట్రీకి సకాలంలో అప్లోడ్ చేయడంలో విఫలమైంది. అందువల్ల ఇప్పుడు రూ.1.40 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
పశ్చిమ బెంగాల్లో రెండు బ్యాంకులు, ఒక కంపెనీకి జరిమానా
నిర్ణీత గడువులోపు కస్టమర్ KYC రికార్డులను సెంట్రల్ KYC రికార్డ్స్ రిజిస్ట్రీకి అప్లోడ్ చేయడంలో విఫలమైనందుకు రాణాఘాట్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఘటల్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కూడా కొన్ని బ్యాంకింగ్ కాని ఆస్తులను నిర్ణీత వ్యవధిలో పారవేయడంలో విఫలమైంది. కనీసం ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన ఖాతాల రిస్క్ వర్గీకరణను సమీక్షించడంలో విఫలమైంది. అలాగే కేవైసీ రికార్డులను అప్లోడ్ చేయడంలో విఫలమైంది. ఆరోపణలు నిరూపించిన తర్వాత, దానికి రూ.5.50 లక్షల జరిమానా విధించింది.
పశ్చిమ బెంగాల్లోని సహారా హౌసింగ్ఫినా కార్పొరేషన్ లిమిటెడ్కు నిర్ణీత గడువులోపు కస్టమర్ KYC రికార్డులను సెంట్రల్ KYC రికార్డ్స్ రిజిస్ట్రీకి అప్లోడ్ చేయడంలో విఫలమైనందుకు ఆర్బీఐ రూ.50,000 జరిమానా విధించింది.
ఒడిశాలో ఈ బ్యాంకుకు జరిమానా:
బౌధ్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్కు రూ.10,000 జరిమానా విధించింది. మూడు క్రెడిట్ సమాచార కంపెనీలలో దేనికీ కస్టమర్ రుణ సమాచారాన్ని సమర్పించడంలో అది విఫలమైంది. ఈ చర్య కస్టమర్లు, బ్యాంకుల మధ్య ఎటువంటి లావాదేవీలు లేదా ఒప్పందాలను ప్రభావితం చేయదని ఆర్బీఐ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








