AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Lionel Messi: కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో జరిగే 'GOAT టూర్'లో భాగంగా మెస్సీ సందడి చేశాడు. అయితే, మెస్సీ కేవలం పర్యటనకే పరిమితం కానున్నాడు తప్ప, మైదానంలో దిగి ఫుట్‌బాల్ ఆడే అవకాశం లేదు. అందుకు గల కారణం చూస్తే కచ్చితంగా షాక్ అవుతారంతే..

మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Lionel Messi
Venkata Chari
|

Updated on: Dec 15, 2025 | 9:47 AM

Share

అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత పర్యటనకు రావడం అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో జరిగే ‘GOAT టూర్’లో భాగంగా మెస్సీ సందడి చేశాడు. అయితే, మెస్సీ కేవలం పర్యటనకే పరిమితం కానున్నాడు తప్ప, మైదానంలో దిగి ఫుట్‌బాల్ ఆడే అవకాశం లేదు. ఫ్యాన్స్‌ను నిరాశపరిచే ఈ వార్త వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదే అతని “ఎడమ కాలు”.

రూ. 7600 కోట్ల బీమా (Insurance):

మెస్సీ ఎడమ కాలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. దీని విలువ ఏకంగా 900 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 7600 కోట్లు). ఇది కేవలం అంకె మాత్రమే కాదు, అతని కెరీర్‌కు సంబంధించిన అతిపెద్ద ఆర్థిక భద్రత.

ఎందుకు ఆడలేడు?

ఈ బీమా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. మెస్సీ కేవలం ఇంటర్ మియామి (అతని క్లబ్) లేదా అర్జెంటీనా జాతీయ జట్టు అధికారికంగా ఆడే మ్యాచ్‌లలో మాత్రమే పాల్గొనాలి.

అనధికారిక మ్యాచ్‌లు లేదా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లకు ఈ ఇన్సూరెన్స్ వర్తించదు.

ఒకవేళ ఇండియాలో జరిగే సరదా మ్యాచ్‌లో మెస్సీకి ఏదైనా గాయమైతే, ఇన్సూరెన్స్ డబ్బులు రావు. అది అతని కెరీర్‌కు, ఆర్థిక ఒప్పందాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది.

ఈ రిస్క్ కారణంగానే, మెస్సీ ఇండియాలో ఫుట్‌బాల్ ఆడటానికి అనుమతి లేదు.

మైఖేల్ జోర్డాన్‌తో పోలిక:

బాస్కెట్‌బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ విషయంలో ఇది భిన్నంగా ఉండేది. అతని కాంట్రాక్టులో “Love of the Game” అనే క్లాజ్ ఉండేది. దీని వల్ల అతను ఎక్కడైనా, ఎప్పుడైనా బాస్కెట్‌బాల్ ఆడే స్వేచ్ఛను కలిగి ఉండేవాడు. కానీ మెస్సీ విషయంలో ఆర్థిక భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

పర్యటన విశేషాలు..

మెస్సీ ఆడకపోయినా, అతనిని దగ్గరగా చూసే అవకాశం దక్కడమే అభిమానులకు పెద్ద పండుగ. తన పర్యటనలో భాగంగా మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నట్లు సమాచారం. ఈ టూర్ కేవలం మీట్-అండ్-గ్రీట్ (Meet and Greet), ప్రచార కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కానుంది.