Budget 2025: తాయిలాల తీపి కబురు కోసం సామాన్యుడి నిరీక్షణ.. నిర్మలమ్మ మ్యాజిక్ చేసేనా..?
ఫిబ్రవరి 1నే మన కేంద్ర బడ్జెట్. ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు.. ఇంకెన్నో సంకేతాలతో బడ్జెట్ 2025 రాబోతోంది. ఏరంగానికి ఎంత కేటాయిస్తారో ఇప్పటికే నిపుణులు ఓ అంచనాకొస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం.. ఆమెప్రకటించే తాయిలాల కోసం సగటి భారతీయుడు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు..!

ఫిబ్రవరి 1 వస్తోంది.. ప్రతి రైతులోనూ ఏదో ఆశ.. ఈసారైనా తన కలఫలించకపోతుందా అని.. ప్రతి మద్యతరగతి జీవిలో ఏదో తెలియని ఉద్వేగం.. ఈసారైనా తన కోరిక తీరే దారి దొరుకుందేమోనని.. ప్రతి ఉద్యోగిలోనూ ఏదో విశ్వాసం.. ఈసారైనా తన కష్టానికి కోత పడకూడదు అని.. ప్రతి పారిశ్రామిక వేత్తలోనూ ఏదో నిరీక్షణ.. ఈదఫా తన లక్ష్యం నెరవేరకుండా ఉంటుందా..అని.. ప్రతి కార్మికుడిలోనూ ఏదో ఆశావాదం.. ఈసారైనా తమ వాగ్దానాలు నిలబెట్టుకోరా అని.. ఇలా ప్రతి రంగం..ప్రతి వర్గం….ఎంతో ఆశగా.. ఉత్కంఠగా…ఉద్వేగంగా ఎదురు చూస్తోంది. దేనికోసం.. ఫిబ్రవరి ఒకటి కోసం.. పార్లమెంట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పే మాటల కోసం.. ఆమె ప్రకటించే తాయిలాల కోసం.. ఆమె అందించే తీపి కబురు కోసం…! మన పెద్దలు చెప్పినట్టు…ఒక దేశం గొప్పతనం…పరిమాణంతో రాదు. ఆదేశ ప్రజల సంకల్పం, ఐక్యత, సత్తువ, క్రమశిక్షణ, పటిష్టమైన నాయకత్వం ఆ దేశాన్ని చరిత్రలో గౌరవ స్థానంలో నిలుపుతాయి. అంటే – దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం కలగజేయడం, వారి జీవన ప్రమాణాలు పెంచడం. పేదలకు గృహనిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుదల, పేద కుటుంబాలన్నింటికీ కూడు, గూడు, గుడ్డ, ఉపాధి కల్పించడం, వృద్ధాప్య పెన్షన్లు, ఆయుష్మాన్ భారత్, పరిశ్రమలకు ఊతం.. వ్యవసాయరంగానికి పెద్దపీట వేయడం.. బీజేపీ మాటల్లో చెప్పాలంటే సబ్ కా సాత్…సబ్కా వికాస్.. మరి మన కేంద్ర బడ్జెట్లో ఆ మాటలు...




