AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: బడ్జెట్‌కు ఒక్క రోజే సమయం.. బడ్జెట్ ప్రసంగాన్ని చూడండిలా..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, శనివారం కేంద్ర బడ్జెట్ 2025 పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఆమె వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలి బడ్జెట్ల మాదిరిగానే కేంద్ర బడ్జెట్ 2025-26 పేపర్లెస్ ఫార్మాట్‌లోనే సభ్యులకు అందుబాటులో ఉంచుతారు.

Budget 2025: బడ్జెట్‌కు ఒక్క రోజే సమయం.. బడ్జెట్ ప్రసంగాన్ని చూడండిలా..!
Nikhil
|

Updated on: Jan 30, 2025 | 3:55 PM

Share

కేంద్ర బడ్జెట్ అనేది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు కొనసాగే రాబోయే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం అంచనా వేసే ఆదాయాలు, వ్యయాలను వివరించే వార్షిక ఆర్థిక నివేదిక. ప్రభుత్వ ఆర్థిక విధానాలు, వ్యయ ప్రణాళికలు, ఆదాయ అంచనాలు, ఆర్థిక వ్యూహాల గురించిన వివరాలను ఇందులో పేర్కొంటారు. ఆర్థిక మంత్రి సీతారామన్ ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2025 కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. కేంద్ర బడ్జెట్ 2025కు సంబంధించిన ప్రత్యక్ష ప్రదర్శనను  దూరదర్శన్, సంసద్ టీవీలతో పాటు ప్రభుత్వ అధికారిక యూట్యూబ్ ఛానెల్సల్ ద్వారా చూడవచ్చు. 

యూనియన్ బడ్జెట్ 2025 డాక్యుమెంట్లను బడ్జెట్ సమర్పించిన తర్వాత సంబంధిత పత్రాలు అధికారిక యూనియన్ బడ్జెట్ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. వార్షిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్, గ్రాంట్స్ డిమాండ్, ఫైనాన్స్ బిల్లుతో సహా బడ్జెట్ పత్రాలను సులభంగా యాక్సెస్ చేయడానికి ప్రభుత్వం “యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్”ను కూడా అందిస్తుంది. ఈ బడ్జెట్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటాయి. 

హల్వా వేడుక అంటే?

హల్వా వేడుక, 1980 నుంచి భారతదేశ బడ్జెట్ తయారీ ప్రక్రియలో దీర్ఘకాల సంప్రదాయం, బడ్జెట్ తయారీ చివరి దశకు ప్రతీక. ఈ ఈవెంట్ ఫైనాన్స్ బృందం ముద్రణ ప్రక్రియను ప్రారంభించే పాయింట్‌ను సూచిస్తుంది. 

ఇవి కూడా చదవండి

2025 బడ్జెట్ కు సన్నాహాలు  ఇలా

రాబోయే ఆర్థిక సంవత్సరానికి వారి ఆర్థిక అవసరాలు, అంచనాలను వివిధ శాఖలతో ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపడంతో కేంద్ర బడ్జెట్ 2025 కోసం సన్నాహాలు అక్టోబర్ 2024లో ప్రారంభమయ్యాయి. 2017 నుంచి భారతదేశ బడ్జెట్ సంప్రదాయాలకు గణనీయమైన మార్పులు చేశారు. వీటిలో రైల్వే బడ్జెట్ను యూనియన్ బడ్జెట్‌తో విలీనం చేయడం, ప్రెజెంటేషన్ తేదీని ఫిబ్రవరి 1కి పెంచడంతో పాటు 2021లో పూర్తిగా బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో డిజిటల్ ఫార్మాట్‌లోనే అందిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి