Budget 2025: జాతీయ అభివృద్ధికి బ్లూప్రింట్ రెఢి.. కొత్తబడ్జెట్ ఊపునిస్తుందా.. ఉసూరుమనిపిస్తుందా..?
ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. కేంద్ర బడ్జెట్ అనేది భారత ప్రభుత్వం ఆర్థిక నివేదిక. కేంద్ర బడ్జెట్ కేవలం ఆర్థిక పత్రం మాత్రమే కాదు, ఇది జాతీయ అభివృద్ధి కోసం ఒక బ్లూప్రింట్ను అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలతో తక్షణ అవసరాలను సమతుల్యం చేస్తుంది. ఇది స్థిరమైన అభివృద్ధి, సామాజిక సంక్షేమం, వ్యూహాత్మక జాతీయ అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధత గురించి కూడా తెలియజేస్తుంది.

దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. బడ్జెట్ సమయంలో, ప్రజలు స్టాక్ మార్కెట్పై కూడా నిఘా ఉంచారు. మన కేంద్రబడ్జెట్.. ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు.. ఇంకెన్నో సంకేతాలతో బడ్జెట్ 2025 రాబోతోంది. ఏ రంగానికి ఎంత కేటాయిస్తారో ఇప్పటికే నిపుణులు ఓ అంచనాకొస్తున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం చాలా ముఖ్యమైన మార్పుల దిశగా పయనించవచ్చని తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్సైంది. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత సమావేశాలను దాదాపు నెల రోజుల విరామం తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు. మొదటి విడత సమావేశాల తొలిరోజు జనవరి 31న లోక్సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. నిర్మల సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్పై కేంద్రం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈసారి పార్లమెంట్ సెషన్ మధ్యలోనే...




