AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేక్ సర్టిఫికెట్‌తో ఒకరు.. చేతి వాటంతో మరో ఉద్యోగి.. చివరకు జరిగింది ఇదే..

Prakasam District: ఒకరేమో ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్ పొందిన ఉద్యోగి అయితే మరొకరేమో ఏకంగా ప్రభుత్వ కంటింజెంట్‌కి సంబంధించి అక్షరాల 21 లక్షలు స్వాహా చేసిన ఉద్యోగి. అయితే ఈ ఇద్దరు ఉద్యోగులపై వరుస ఫిర్యాదులు రావడంతో విచారణ చేసిన సబ్ కలెక్టర్ వారిని సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు.సస్పెండ్ అయిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదు అయి ఉండగా మరోసారి క్రిమినల్ కేసులు పెట్టేందుకు..

ఫేక్ సర్టిఫికెట్‌తో ఒకరు.. చేతి వాటంతో మరో ఉద్యోగి.. చివరకు జరిగింది ఇదే..
R&B Inspection Bungalow, Kanigiri
Ch Murali
| Edited By: |

Updated on: Jul 28, 2023 | 5:18 PM

Share

ప్రకాశం జిల్లా, జూలై 28: ఒకరేమో ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్ పొందిన ఉద్యోగి అయితే మరొకరేమో ఏకంగా ప్రభుత్వ కంటింజెంట్‌కి సంబంధించి అక్షరాల 21 లక్షలు స్వాహా చేసిన ఉద్యోగి. అయితే ఈ ఇద్దరు ఉద్యోగులపై వరుస ఫిర్యాదులు రావడంతో విచారణ చేసిన సబ్ కలెక్టర్ వారిని సస్పెండ్ చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు.సస్పెండ్ అయిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదు అయి ఉండగా మరోసారి క్రిమినల్ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఓ వైపు క్రిమినల్ కేసులు మరోవైపు ప్రభుత్వ సొమ్ము స్వాహాతో పాటు ఫేక్ సర్టిఫికెట్‌లు పెట్టి ప్రమోషన్ పొందిన ఇరువురిలో ఒకరు ఒంగోలు జిల్లా ఆర్ అండ్ బి శాఖలో పనిచేస్తున్న పొలయ్య.. కాగా మరొకరు గతంలో ఒంగోలులో పనిచేసి ప్రస్తుతం నెల్లూరు ఆర్ అండ్ బి కి బదిలీ అయి విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు.

ఒంగోలు జిల్లా కనిగిరి ఆర్ అండ్ బి డివిజన్‌లో పనిచేస్తున్న వెళ్ళం పొలయ్యతో పాటు ప్రస్తుతం నెల్లూరు ఆర్ అండ్ బి లో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న శ్రీనివాసరావుపై సస్పెండ్ వేటు పడింది. ప్రస్తుతం సస్పెండ్ వేటు పడిన ఇద్దరు ఉద్యోగులు నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వారే. గతంలో ఇద్దరిపై ఆరోపణలు రావడంతో ఆర్ అండ్ బి ఎస్సి విచారణకు ఆదేశించారు.

అయితే విచారణ అధికారిగా ఉన్న ఆర్ అండ్ బి శాఖ అడ్మినిస్ట్రేషన్ సూపరింటెండెంట్ ఇరువురి ఉద్యోగులకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదనే కారణంగా ఆఫీస్లోనే బయటి వ్యక్తుల సాయంతో సూపరింటెండెంట్‌పై దాడి చేయించడంతో ఫాల్స్ ఎస్సి, ఎస్టీ కేసులు పెట్టించారని సూపరింటెండెంట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇక మరోసారి విచారణ చేసిన సబ్ కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ చేసిన ఆ అనంతరం పొలయ్య, శ్రీనివాసులు ఇద్దరిపై సస్పెండ్ వేటుకు ఆదేశించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?