AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తల్లి మరణవార్త విని ఆగిపోయిన కొడుకు గుండె.. తల్లీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదం..

కన్నీరు మున్నిరైన బందువులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో అంటోన్న స్వయం ప్రభ ఒక్కగానొక్క కుమారుడు వెంకటేష్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు. త్వరగా బయలుదేరి రమ్మన్నారు. అంతే.. ఇలా ఫోన్ కట్ చేసారో లేదో హైదరాబాద్ నుండి కొట్టుగుమ్మడ లోని బంధువులకు తిరిగి ఫోన్ వచ్చింది. తల్లి మరణ వార్త విన్న వెంటనే వెంకటేష్ కుప్ప కూలి పోయి మృతి చెందాడని అతని భార్య పావని ఏడుస్తూ ఫోన్ చేసి చెప్పింది.

Andhra Pradesh: తల్లి మరణవార్త విని ఆగిపోయిన కొడుకు గుండె.. తల్లీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదం..
Mother And Son Dead
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Jul 06, 2023 | 12:57 PM

Share

పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కొట్టు గుమ్మడ గ్రామం. సమయం సోమవారం ఉదయం ఏడు గంటలు. అప్పటి వరకు ఇంట్లో టీవీ చూస్తూ ఉన్న గుడివాడ స్వయం ప్రభ(68యేళ్లు) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన బందువులు ముఖంపై నీళ్లు చల్లి లేపే ప్రయత్నం చేశారు. అయిన ఆమెలో చలనం లేదు. డాక్టర్ ను పిలిపించి చూపించారు. అప్పటికే ఆమె గుండె పోటుతో మృతి చెందినట్లు డాక్టర్ ధృవీకరించారు. కన్నీరు మున్నిరైన బందువులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో అంటోన్న స్వయం ప్రభ ఒక్కగానొక్క కుమారుడు వెంకటేష్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు. త్వరగా బయలుదేరి రమ్మన్నారు. అంతే.. ఇలా ఫోన్ కట్ చేసారో లేదో హైదరాబాద్ నుండి కొట్టుగుమ్మడ లోని బంధువులకు తిరిగి ఫోన్ వచ్చింది. తల్లి మరణ వార్త విన్న వెంటనే వెంకటేష్ కుప్ప కూలి పోయి మృతి చెందాడని అతని భార్య పావని ఏడుస్తూ ఫోన్ చేసి చెప్పింది. తల్లిని కడసారి చూసి తలకొరివి పెడతాడనీ వెంకటేష్ రాక కోసం ఎదురు చూస్తున్న బంధువులు, గ్రామస్తులు అతని మరణ వార్త విని షాక్ అయ్యారు. పావుగంట వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి చెందారన్న వార్త అందరినీ కలిచి వేసింది. గ్రామములో తీవ్ర విషాదాన్ని నింపింది.

బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏమిటి ఈ విధి రాత అంటూ ఆ నోట ఈ నోట ఇప్పుడు ఈ వార్త చర్చకు దారి తీస్తుంది. వెంకటేష్, స్వయం ప్రభలకు ఒకరంటే ఒకరికి ఎంతో మమకారం. వెంకటేష్ 20 ఏళ్లుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్వగ్రా మంలో ఉన్న తల్లికి ప్రతినెలా డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అయితే ఒక్కసారిగా తల్లి మరణ వార్త విన్న వెంకటేష్ తీవ్ర మనో వేదనకు గురై వెంటనే కుప్పకూలిపోయాడు. వెంకటేష్ కి భార్య పావని, రవితేజ, రాకేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తీవ్ర విషాదం నడుమ వెంకటేష్, స్వయం ప్రభ మృతదేహాలకు మంగళవారం స్వగ్రామమైన కొట్టు గుమ్మడలో అంత్యక్రి యలు నిర్వహించారు.వెంకటేష్ కుమారుడు రవితేజ తన తండ్రికి, నాన్నమ్మకు తలకొరివి పెట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?