S Srinivasa Rao

S Srinivasa Rao

Senior Staff Reporter - TV9 Telugu

srinivasarao.seemala@tv9.com

హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.

Read More
Lok Sabha Election: వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వీల్ చైర్లు

Lok Sabha Election: వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వీల్ చైర్లు

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మే13 తేదీన జరగనున్న పోలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. దీంతో అధికార యంత్రాంగం పోలింగ్ ఏర్పాట్లలో తలమునకలైంది. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇప్పటికే పూర్తి కాగా, సజావుగా పోలింగ్ జరిపేందుకు, ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు తగిన ఏర్పాట్లు కల్పించటంలో నిమగ్నమైంది జిల్లా యంత్రాంగం.

Srikakulam: చంద్రబాబు బస చేసిన చోట ఆసక్తికర ఘటన.. అతన్ని చూసి బయటికి వచ్చేసిన మాజీ మంత్రి

Srikakulam: చంద్రబాబు బస చేసిన చోట ఆసక్తికర ఘటన.. అతన్ని చూసి బయటికి వచ్చేసిన మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. నామినేషన్ల పర్వం మొదలు కానుండటంతో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు బస చేసిన పలాస టీడీపీ కార్యాలయం వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అనుకోని సొంత పార్టీ ప్రత్యర్థులు ఎదురెదురయ్యాయి. అధినేత సమక్షంలో ముఖం చాటేశారు.

భార్య ఆ పని చేస్తోందని తెలిసి బలవన్మరణానికి పాల్పడిన భర్త..

భార్య ఆ పని చేస్తోందని తెలిసి బలవన్మరణానికి పాల్పడిన భర్త..

వివాహేతర సంబoధాలు పచ్చని కాపురాలలో చిచ్చురాజేస్తున్నాయి. పిల్లాపాపలతో నిండు నూరేళ్ళు కలిసుండాల్సిన భార్యాభర్తల బంధాన్ని గుల్ల చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను హరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Janasena Ticket: జనసేన అధినేత చెంతకు టీడీపీ వర్గ పోరు.. పార్టీ మారితే టికెట్ దక్కేనా..?

Janasena Ticket: జనసేన అధినేత చెంతకు టీడీపీ వర్గ పోరు.. పార్టీ మారితే టికెట్ దక్కేనా..?

టికెట్ కోసం నియోజకవర్గ ఆశావాహ నేతలు చేస్తోన్న రాజకీయ వ్యూహాలు రక్తి కట్టిస్తున్నాయి. అసలు సిసలైన అవకాశవాద రాజకీయాన్ని చూపిస్తున్నాయి. మొన్నటి వరకు టికెట్ కోసం టీడీపీలో ఉండి గ్రూపులు కట్టి.. జనసేనకు టికెట్ ఇస్తున్నారని తెలిసి ఇపుడు అదే నేతలు జనసేన అధినేతకు టచ్ లోకి వెల్లారట.

Andhra Pradesh: పోలీసులకే చుక్కలు చూపిన మందుబాబులు.. పోలీస్ స్టేషన్‌లో విధ్వంసం!

Andhra Pradesh: పోలీసులకే చుక్కలు చూపిన మందుబాబులు.. పోలీస్ స్టేషన్‌లో విధ్వంసం!

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో తాగిన మైకoలో రుద్రమంతి మణికంఠ అనే మందుబాబు వీరంగం సృష్టించాడు. కాశీబుగ్గలోనీ చౌదరి బార్ అండ్ రెస్టారెంట్ లో తప్పతాగిన మణికంఠ బార్ సిబ్బందితో, బార్‌కు వచ్చిన కస్టమర్లతోనూ గొడవకు దిగాడు. బార్ లోని టేబుల్స్ ధ్వంసం చేసి అడ్డుకున్న సిబ్బందిపై దాడికి దిగాడు మందుబాబు మణికంఠ. బార్ లో ఉన్నవారిని భయబ్రాంతులకు గురిచేసి పరుగులు పెట్టించాడు.

Watch Video: జాతరలో సింగర్‎గా మారిన మంత్రి సీదిరి అప్పలరాజు..

Watch Video: జాతరలో సింగర్‎గా మారిన మంత్రి సీదిరి అప్పలరాజు..

ఎన్నికల సమయంలో రాజకీయపార్టీల నాయకుల చేష్టలు కొన్నిసార్లు వింతగా, ఆసక్తికరoగా ఉంటాయి. ప్రజలలో మమేకం అయ్యేందుకు వారు ఏ అవకాశాన్నీ వదులుకోరు. కొంతమంది కూలీగా అవతారం ఎత్తుతారు. మరి కొంతమంది రాజకీయ నాయకులు దోబీ దగ్గరకెళ్ళి బట్టలు ఇస్త్రీ చేస్తూ దోబిలా మారతారు.

Watch Video: రైల్వే స్టేషన్‎లో తేనెటీగల దాడి.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..

Watch Video: రైల్వే స్టేషన్‎లో తేనెటీగల దాడి.. పరుగులు పెట్టిన ప్రయాణికులు..

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం అంటే కిడ్నీ రోగుల సమస్యలతో పాటు వన్య ప్రాణులు గుర్తుకు వస్తూ ఉంటాయి. కోతులు, ఎలుగుబంట్లు ఎప్పటికప్పుడు స్వైర విహారం చేస్తూ ఉంటాయి. పంట పొలాలు, తోటల్లో తిష్ట వేస్తూ రైతుల పంటలను ధ్వంసం చేస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య పగలు, రాత్రి అన్న తేడా లేకుండా జనావాసలపై కూడా పడుతూ ఎదురు పడితే మనుషులపై దాడులకు సైతం దిగుతున్నాయి ఎలుగుబంట్లు.

Watch Video: మూడేళ్లకు ఒక్కసారే పెళ్లి ముహూర్తాలు.. వరుడికి తాళి కడుతున్న వధువు.. ఎక్కడో తెలుసా..

Watch Video: మూడేళ్లకు ఒక్కసారే పెళ్లి ముహూర్తాలు.. వరుడికి తాళి కడుతున్న వధువు.. ఎక్కడో తెలుసా..

ఊరంతా పందిరి. ఇంటింటా పెళ్లి బాజాలు. మూడు రోజుల పాటు జరిగే పెళ్లి తంతు. ఒకే రోజు, ఒకే ముహూర్తానికి ఏకమైన 62 జంటలు. అమ్మాయి మెడలో అబ్బాయి తాళి కట్టడం ఎక్కడా ఉండేదే. కానీ ఇక్కడ మాత్రం ముందు అబ్బాయి.. అమ్మాయి మెడలో తాళి కడితే.. తర్వాత అమ్మాయి కూడా అబ్బాయి మెడలో తాళి కడుతుంది. ఈ వింతలు విశేషాలు ఎక్కడో కాదు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మత్స్యకార గ్రామం నువ్వులరేవు గ్రామంలోనిది. అబ్బో ఇలా చెబుతూ పోతే ఆ గ్రామంలో పెళ్లిల్లకు ఎన్నో ప్రత్యేకతలు.

తన అనుచరుల వద్ద కన్నీరు పెట్టుకున్న మాజీ మహిళా ఎమ్మెల్యే..

తన అనుచరుల వద్ద కన్నీరు పెట్టుకున్న మాజీ మహిళా ఎమ్మెల్యే..

ఇప్పుడు రాజకీయ పార్టీలలో ఎక్కడ చూసినా టికెట్ల గోలే వినిపిస్తోంది. వైసిపి శనివారం 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఆ పార్టీ నేతలలో ఇంతవరకు ఉన్న ఉత్కంఠకు తెర దింపితే. ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపిలు మాత్రం ఇంకా విడతలు విడతలుగా అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నాయి. దీంతో ఆయా పార్టీల నేతలలో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతునే ఉంది. తమకు టికెట్ వస్తుందా లేదా అనే ఆందోళనతో నియోజకవర్గ సమన్వయకర్తలు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు. తమకు గిట్టని వారికి టికెట్ రాకూడదని రాజకీయాలు చేసే సొంతపార్టీలోని నేతలు కొందరు ఉన్నారు.

దోపిడీ దొంగ అన్న అనుమానంతో ఓ యువకుడిని స్థానికులు ఏంచేశారంటే..

దోపిడీ దొంగ అన్న అనుమానంతో ఓ యువకుడిని స్థానికులు ఏంచేశారంటే..

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో శుక్రవారం అర్దరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తికి దేహ శుద్ధి చేశారు స్థానికులు. మున్సిపాలిటీ పరిధిలోని అన్నపూర్ణ ఆశ్రమం వీధిలోని బడ్డి పొలమ్మ గుడి సమీపంలో గుడియా సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. అది గమనించిన ఇంటి యజమాని సంతోష్ కుమార్ స్థానికుల సాయంతో ఆ వ్యక్తిని పట్టుకొని బంధించారు.

Andhra Pradesh: బీచ్‌లో సేద తీరేందుకు వచ్చిన సందర్శకులు.. ఏంట్రీ ఇచ్చిన భల్లూకం.. పరుగో పరుగు!

Andhra Pradesh: బీచ్‌లో సేద తీరేందుకు వచ్చిన సందర్శకులు.. ఏంట్రీ ఇచ్చిన భల్లూకం.. పరుగో పరుగు!

ఎలుగుబంటి ఎదురుపడితే చావు కళ్లముందు కనిపించినట్లే. అందుకే బంటిని చూస్తే ఎవరైనా బెదరాల్సిందే. శ్రీకాకుళం జిల్లాలో అచ్చంగా అదే జరిగింది. సముద్ర తీరంలో సేద తీరేందుకు వచ్చిన సందర్శకుల కంటపడింది భల్లూకం. జనాన్ని చూడగానే, చంపేస్తాను అనేలా పరిగెత్తుకొచ్చింది. ఎలుగు పరుగు చూసి, అక్కడున్న వారు జంప్‌ అయ్యారు. తృటిలో వారి ప్రాణాలు దక్కాయి.

Viral Video: పట్టపగలు జనావాసాల్లోకి భల్లూకం.. పరుగులు పెట్టిన జనం.. ఎక్కడంటే..?

Viral Video: పట్టపగలు జనావాసాల్లోకి భల్లూకం.. పరుగులు పెట్టిన జనం.. ఎక్కడంటే..?

పట్టపగలు ప్రధాన రహదారిపై ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గడూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం గడూరు గ్రామం వద్ద అకస్మాత్తుగా ప్రధాన రహదారిపై ఎలుగుబంటిని చూసి వాహనదారులు హడలెత్తిపోయారు. అటుగా వస్తున్న వాహణదారుడిపై ఎలుగుబంటి దాడికి పాల్పడ్డానికి ప్రయత్నించడంతో.. వాహనదారుడు బ్రతుకుజీవుడా అంటూ పరుగులు తీశాడు. ఇదంతా రహదారికి వేరొకవైపున ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు.