AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S Srinivasa Rao

S Srinivasa Rao

Senior Staff Reporter - TV9 Telugu

srinivasarao.seemala@tv9.com

హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.

Read More
చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!

చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!

విద్యాబుద్ధులు నేర్పే చదువుల నిలయం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. విద్యార్థినిల మార్ఫింగ్, అశ్లీల ఫోటోలు ఆ కాలేజీలో కలకలం రేపాయి. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, అదే కాలేజీకి చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థిని ఫోటోను మార్ఫింగ్ చేశాడు. అంతేకాదు ఆ ఫోటోలను అదే విద్యార్థినికే చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు.

Andhra: రెండు పెళ్లిళ్లు.. అక్కడేమో ఆడిట్ ఆఫీసర్.. ఇక్కడేమో బ్యాంకు బోర్డ్ మెంబర్.. చివరకు..

Andhra: రెండు పెళ్లిళ్లు.. అక్కడేమో ఆడిట్ ఆఫీసర్.. ఇక్కడేమో బ్యాంకు బోర్డ్ మెంబర్.. చివరకు..

నేటి సమాజంలో మోసగాళ్ళకు కొదవ లేకుండా పోతుంది. అవతల వ్యక్తి అత్యాశ మోసగాళ్ళకు వరం లాగా మారుతోంది. దీంతో మాయమాటలు చెప్పి నమ్మిన వాళ్ళను నట్టేట ముంచేస్తున్నారు ఈ మాయగాళ్లు. తాజాగా ఇలాంటి మోసగాడినే పట్టుకొని అరెస్ట్ చేశారు శ్రీకాకుళం రూరల్ పోలీసులు..

Arasavalli: అరసవల్లిలో కనిపించని సూర్యుడు.. నిరాశలో భక్తులు…

Arasavalli: అరసవల్లిలో కనిపించని సూర్యుడు.. నిరాశలో భక్తులు…

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో నేడు జరగాల్సిన అరుదైన సూర్యకిరణాల ఘట్టం భక్తులను నిరాశపరిచింది. ఆనవాయితీ ప్రకారం సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్టును తాకాల్సి ఉన్నా, ఆకాశం మేఘావృతంగా ఉండటంతో ఈ అద్భుత దృశ్యం కనిపించలేదు. స్వామివారి దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు.

Amdhra: గుండె ధైర్యం ఎక్కువగా ఉన్నవారే ఏపీలోని ఈ యాక్సిడెంట్ వీడియో చూడండి..

Amdhra: గుండె ధైర్యం ఎక్కువగా ఉన్నవారే ఏపీలోని ఈ యాక్సిడెంట్ వీడియో చూడండి..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జర్జంగి వద్ద జాతీయ రహదారి–16పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖకు వెళ్తున్న ఆటోను అతి వేగంతో వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

హైటెన్షన్: విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు.. అసలేం జరిగిందంటే

హైటెన్షన్: విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు.. అసలేం జరిగిందంటే

విశాఖపట్నం నుండి హౌరా వెళ్తున్న HPCL గ్యాస్ గూడ్స్ రైలు శ్రీకాకుళం జిల్లా తిలారు వద్ద లీక్ అయ్యింది. సిబ్బంది సకాలంలో గుర్తించి, రైలును నిలుపుదల చేశారు. రైల్వే, పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మరమ్మత్తులు చేపట్టారు. అధికారుల సమన్వయంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

Andhra: చంద్రగ్రహణం రోజున వింత ఘటన.. రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో

ఓ వైపు డోలి పౌర్ణమి, మరోవైపు చంద్ర గ్రహణం రోజున శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇచ్చాపురం మండలం మండపల్లి పంచాయతీ, ఎం.తోటూరు గ్రామంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు రెండు తలలు ఉండటంతో గ్రామం ఒక్కసారిగా వార్తలలోకి ఎక్కింది.

శాంపిల్స్ కల్చర్ టెస్ట్ రిపోర్ట్‌లో భయంకరమైన వాస్తవాలు.. డయేరియాకి కారణం అదేనా..!

శాంపిల్స్ కల్చర్ టెస్ట్ రిపోర్ట్‌లో భయంకరమైన వాస్తవాలు.. డయేరియాకి కారణం అదేనా..!

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గత ఆరు రోజులుగా డయేరియా విజృంభిస్తోంది. నగరంలోని మంగువారి తోట, దమ్మల వీధి, గోల్కొండ రేవు, కంపోస్టు కాలనీ, బోడమ్మ గుడి వీధి, మొండేటి వీధులలో డయేరియా పంజా విసిరింది. డయేరియా బారిన పడి నగరంలోని మంగువారి తోటలోనీ మండల సురేష్ (43)అనే వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరో ఇద్దరు మృతికి కూడా డయేరియానే కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్

Diarrhea: శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్

శ్రీకాకుళంలో డయేరియా కేసుల సంఖ్య 54కు చేరింది, ఒకరు మృతి చెందారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ 49 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. రోడ్ల పనుల కారణంగా నీరు కలుషితమైందని అనుమానిస్తున్నారు. సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించగా, వ్యాప్తి నియంత్రణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Mukhalingeswara Swamy Temple:  మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం!

Mukhalingeswara Swamy Temple: మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం!

దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో శ్రీ ముఖలింగం ఒకటి. వంశధార నదీ తీరాన కొలువుతీరిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. శ్రీ ముఖలింగేశ్వర స్వామి కొలువుతీరిన ఈ క్షేత్రం వాస్తు శైలి, శిలా సంపద అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రం విశేషాలు, మహిమలు ఎన్నో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతియేట మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది ఆదివారం ప్రారంభమైన శివరాత్రి మహోత్సవాలు బుధవారం స్వామివారి త్రిశూల చక్రతీర్థ స్నానంతో ముగిసాయి.

Viral: అయ్య బాబోయ్.. ఆ మహిళా దొంగ మేకప్‌ ఖర్చు నెలకు రూ. 5 లక్షలు

Viral: అయ్య బాబోయ్.. ఆ మహిళా దొంగ మేకప్‌ ఖర్చు నెలకు రూ. 5 లక్షలు

బెంగళూరులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న దొంగ జంట గాయత్రి, శ్రీకాంత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గాయత్రి నెలకు రూ.5 లక్షలు మేకప్‌, ఖరీదైన చీరల కోసం ఖర్చు చేసేదని దర్యాప్తులో వెల్లడైంది. వీరి నుండి రూ.60 లక్షల విలువైన 398 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Andhra: గూగుల్ మ్యాప్‌లో ఆలయాలను సెర్చ్ చేస్తారు.. అక్కడి నుంచే అసలు ప్లాన్ మొదలైద్ది..!

Andhra: గూగుల్ మ్యాప్‌లో ఆలయాలను సెర్చ్ చేస్తారు.. అక్కడి నుంచే అసలు ప్లాన్ మొదలైద్ది..!

దొంగలు ఇప్పుడు రెండు రకాలు.. చదువు అబ్బక, చెడు తిరుగులు, చెడు సాహసాలతో చిన్నప్పటి నుంచి పిక్ పాకిటింగ్, ఇళ్ళు, ఆలయాలు, దుకాణాలలో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడేవారు ఒకరైతే.. పెద్దపెద్ద చదువులు చదువుకొని హ్యాకింగ్‌లు, డిజిటల్ అరెస్టులు, యాప్ లు ద్వారా జనాలను మోసం చేసి వైట్ కాలర్ నేరాలకు పాల్పడేవారు ఇంకొందరు.

నిరుద్యోగులకు సూపర్ న్యూస్…ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 27

నిరుద్యోగులకు సూపర్ న్యూస్…ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 27

నిరుద్యోగులకు శుభవార్త! శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4 ఖాళీలున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు డిగ్రీ/SSC పాసై ఉండాలి. ఆసక్తి గలవారు మే 27వ తేదీలోపు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.