AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S Srinivasa Rao

S Srinivasa Rao

Senior Staff Reporter - TV9 Telugu

srinivasarao.seemala@tv9.com

హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.

Read More
పోయే వయసులో పైశాచికం.. 7 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడి..

పోయే వయసులో పైశాచికం.. 7 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడి..

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం గుంజిలోవ గ్రామంలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో 75 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి న్యాయస్థానం ఏడు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, పోలీసులు శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు.

అయ్యో..  ఆఖరి మజిలీకి  కూడా ఇన్ని కష్టాలా?

అయ్యో.. ఆఖరి మజిలీకి కూడా ఇన్ని కష్టాలా?

స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అన్నారు ఓ సినీకవి. ఆయన ఏ సందర్భంలో అన్నారో కాని కొందరి విషయంలో బతికి ఉన్నన్నాళ్ళు కష్టాలు తప్పవు తీరా చనిపోయాక కూడా వారిని అవి వెంటాడుతూనే ఉంటాయి. చనిపోయాక కూడా ప్రశాంతత కరువే. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం అలాంటి ఘటనే ఎదురయింది.

Andhra Pradesh: అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు.. ఏమైందో వీడియోలో చూడండి..

Andhra Pradesh: అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు.. ఏమైందో వీడియోలో చూడండి..

అది రాత్రి 9 గంటల సమయం. పల్లెటూరి వాతావరణంలో ప్రశాంతంగా ఉన్న ఆ రహదారిపై వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. అంతలోనే దారికి అడ్డంగా ఒక భారీ స్పీడ్ బ్రేకర్ లాంటిది కనిపించింది. కట్ చేస్తే.. అది స్పీడ్ బ్రేకర్ కాదు, సడన్‌గా చూస్తే గుండె ఆగినంత పని చేసే భారీ కొండచిలువ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

4 కోట్ల విలువైన భూమి కబ్జా.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, భార్య, కుమారుడిపై కేసు నమోదు

4 కోట్ల విలువైన భూమి కబ్జా.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, భార్య, కుమారుడిపై కేసు నమోదు

శ్రీకాకుళంలో రూ.3-4 కోట్ల విలువైన భూమిని నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలతో కాజేయాలన్న భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడితో సహా 13 మందిపై కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో నకిలీ పత్రాల సృష్టి, బతికున్నవారిని చనిపోయినట్లు చూపడం వంటి అక్రమాలు బయటపడ్డాయి.

రాత్రి, పగలు ఒకటే దడ.. మంత్రగాళ్లు వచ్చినా మారని తీరు.. ఆత్మ భయంతో ఆఫ్యామిలీ ఏం చేసిందంటే?

రాత్రి, పగలు ఒకటే దడ.. మంత్రగాళ్లు వచ్చినా మారని తీరు.. ఆత్మ భయంతో ఆఫ్యామిలీ ఏం చేసిందంటే?

కొద్ది నెలల కిందట చనిపోయిన ఇంటి పెద్ద ఆత్మ.. ఆ కుటుంబాన్ని వెంటాడిందా? కంటిమీద కునుకు లేకుండా చేసిన భయమే వారి పాలిట శాపమైందా? శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వేళల్లో వెంటాడుతున్న భయం, దానికి తోడు చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు తట్టుకోలేకపోయిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

ఎంత తాగావ్‌రా..! మద్యం మత్తులో కాలేజీ బస్సు కిందకు దూరి ఏం చేశాడో తెలుసా..?

ఎంత తాగావ్‌రా..! మద్యం మత్తులో కాలేజీ బస్సు కిందకు దూరి ఏం చేశాడో తెలుసా..?

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రైవేట్ కాలేజీ బస్సు కిందకు దూరి నడి రోడ్డుపై హంగామా చేశాడు. అతడిని బయటకు రప్పించేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనతో పాత జాతీయ రహదారిపై అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జలుబు, జ్వరంతో బాధపడుతున్న జగన్నాధుడు.. 15 రోజులు దర్శనం బంద్.. అంతుచిక్కని రహస్యం!

జలుబు, జ్వరంతో బాధపడుతున్న జగన్నాధుడు.. 15 రోజులు దర్శనం బంద్.. అంతుచిక్కని రహస్యం!

మనుషులు సీజనల్ వ్యాధుల బారిన పడటం సహజం. కానీ మనుషులకే కాదు జీవ కోటిని, ముక్కోటి లోకాలను శాసించే ఆ దేవదేవుడు సైతం ఈ సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారన్న విషయం మీకు తెలుసా? సాక్షాత్తు ఆ దేవదేవుడు అయిన జగన్నాధుడే గత కొద్ది రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. 15 రోజుల పాటు భక్తులకు దర్శనాలు కూడా ఇవ్వకుండా చీకటి గదిలో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ పదిహేను రోజులు రహస్యంగా ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారట అర్చక స్వాములు. దైవానికి జలుబు, జ్వరము ఏంటి అని ఆశ్చర్యపుతున్నారా? అయితే స్టోరీ చదవాల్సిందే..!

AP News: ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం

AP News: ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం

AP News: పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం DSP వివేకానంద సైతం ఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే అత్త లక్ష్మీ వేధింపులే ఘటనకు కారణం అని వరలక్ష్మి సోదరులు, సవతి తల్లి ఆరోపిస్తున్నారు. వరలక్ష్మికి ఇద్దరు..

అటు ఆమెతో.. ఇటు ఇమెతో.. కట్ చేస్తే, పల్పీ ఆరంజ్ ఇచ్చి కారులో తీసుకెళ్లారు.. భువనేశ్వర్, కృపారాణి మామూలోళ్లు కాదు..

అటు ఆమెతో.. ఇటు ఇమెతో.. కట్ చేస్తే, పల్పీ ఆరంజ్ ఇచ్చి కారులో తీసుకెళ్లారు.. భువనేశ్వర్, కృపారాణి మామూలోళ్లు కాదు..

పార్వతీపురం మన్యం జిల్లాలో సంచలనం రేపిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి హత్య కేసును పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. ప్రేమ వ్యవహారంలో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు భువనేశ్వర్, అతనికి సహకరించిన స్టాఫ్ నర్స్ కృపారాణి, మరో యువకుడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిద్రమాత్రలు కలిపిన పానీయం ఇచ్చి, అనంతరం ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఏపీలో సంచలన ఘటన.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి…

ఏపీలో సంచలన ఘటన.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి…

పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగ దరఖాస్తు కోసం ఇంటి నుంచి వెళ్లిన ఆమె కనిపించకుండా పోగా, తుమరాడ సమీపంలోని చెరువులో చేతులు, కాళ్లు కట్టి మృతదేహంగా లభ్యమైంది. కేసును హత్యగా నమోదు చేసిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

మేనమామతో పెళ్లి.. 4ఏళ్ల కుమారుడు.. గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి మరో యువకుడితో ప్రేమ.. చివరకు

మేనమామతో పెళ్లి.. 4ఏళ్ల కుమారుడు.. గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి మరో యువకుడితో ప్రేమ.. చివరకు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన హరిణి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్న వివాహిత హరిణిని స్వగ్రామానికి రప్పించి, ఆమె తల్లి, తాత, భర్త కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. గుండెపోటుతో మరణించినట్లు నమ్మబలికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించినప్పటికీ, హరిణి ముందుగానే రికార్డు చేసిన సెల్ఫీ వీడియో కేసును ఛేదించడంలో కీలక ఆధారంగా మారింది.

Andhra Pradesh: పొలం పక్కన కాలువ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసిన రైతులకు గుండెలు గుభేల్.. వీడియో చూడండి..

Andhra Pradesh: పొలం పక్కన కాలువ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసిన రైతులకు గుండెలు గుభేల్.. వీడియో చూడండి..

పంట కాలువ నుండి మనిషి ఈల వేసినట్టు వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లిన రైతులకు అక్కడ గడ్డి కదులుతూ కనిపించింది. ఇంకాస్త నిశితంగా చూడగా గుండె ఒక్కసారిగా గుభేల్‌మంది. ప్రాణభయంతో గట్టుపైకి పరుగులు తీశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.