హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.
అటు ఆమెతో.. ఇటు ఇమెతో.. కట్ చేస్తే, పల్పీ ఆరంజ్ ఇచ్చి కారులో తీసుకెళ్లారు.. భువనేశ్వర్, కృపారాణి మామూలోళ్లు కాదు..
పార్వతీపురం మన్యం జిల్లాలో సంచలనం రేపిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి హత్య కేసును పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. ప్రేమ వ్యవహారంలో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు భువనేశ్వర్, అతనికి సహకరించిన స్టాఫ్ నర్స్ కృపారాణి, మరో యువకుడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిద్రమాత్రలు కలిపిన పానీయం ఇచ్చి, అనంతరం ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
- S Srinivasa Rao
- Updated on: Jun 14, 2026
- 9:31 am
ఏపీలో సంచలన ఘటన.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి…
పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగ దరఖాస్తు కోసం ఇంటి నుంచి వెళ్లిన ఆమె కనిపించకుండా పోగా, తుమరాడ సమీపంలోని చెరువులో చేతులు, కాళ్లు కట్టి మృతదేహంగా లభ్యమైంది. కేసును హత్యగా నమోదు చేసిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
- S Srinivasa Rao
- Updated on: Jun 12, 2026
- 8:29 am
మేనమామతో పెళ్లి.. 4ఏళ్ల కుమారుడు.. గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి మరో యువకుడితో ప్రేమ.. చివరకు
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన హరిణి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్లో ఉంటున్న వివాహిత హరిణిని స్వగ్రామానికి రప్పించి, ఆమె తల్లి, తాత, భర్త కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. గుండెపోటుతో మరణించినట్లు నమ్మబలికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించినప్పటికీ, హరిణి ముందుగానే రికార్డు చేసిన సెల్ఫీ వీడియో కేసును ఛేదించడంలో కీలక ఆధారంగా మారింది.
- S Srinivasa Rao
- Updated on: Jun 10, 2026
- 9:22 pm
Andhra Pradesh: పొలం పక్కన కాలువ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసిన రైతులకు గుండెలు గుభేల్.. వీడియో చూడండి..
పంట కాలువ నుండి మనిషి ఈల వేసినట్టు వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లిన రైతులకు అక్కడ గడ్డి కదులుతూ కనిపించింది. ఇంకాస్త నిశితంగా చూడగా గుండె ఒక్కసారిగా గుభేల్మంది. ప్రాణభయంతో గట్టుపైకి పరుగులు తీశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- S Srinivasa Rao
- Updated on: Jun 9, 2026
- 8:16 am
Andhra Pradesh: రోజూ తాగొచ్చి నరకం చూపిస్తున్న భర్త.. భార్య చేసిన పనికి అంతా షాక్..
పచ్చని సంసారంలో మద్యం ఎంతటి ఘోరానికి కారణమవుతుందో చెప్పడానికి శ్రీకాకుళం ప్రకాష్ నగర్లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ప్రతిరోజూ తాగి వచ్చి భార్యతో గొడవపడే అలవాటే ఆ భర్త ప్రాణాల మీదకు తెచ్చింది. డబ్బుల కోసం మొదలైన చిన్న వివాదం కాస్తా.. చివరకు కత్తిపీట దాడితో రక్తం ఏరులై పారేలా చేసింది. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- S Srinivasa Rao
- Updated on: Jun 5, 2026
- 2:22 pm
ఏం మనుషులురా..? వైద్యం కోసం వచ్చిన రోగిని వదలకుండా.. చేతివాటం చూపించారుగా!
దొంగలకు కనీసం మానవత్వం, జాలి అనేవి లేకుండా పోతున్నాయి. ఇళ్లు, దుకాణాలు, బ్యాంకులు దోచుకోవడమే కాకుండా, చివరకు ప్రాణాపాయ స్థితిలో ఉండి చికిత్స పొందే ఆసుపత్రులను కూడా వదలడం లేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. అసలే అనారోగ్యంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడుతూ హాస్పిటల్కు వస్తే, అక్కడ కూడా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించడం పట్ల ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘోరమైన చోరీ కలకలం రేపింది.
- S Srinivasa Rao
- Updated on: Jun 3, 2026
- 8:34 am
Andhra Pradesh: ప్రేమించుకున్నారు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.. కట్చేస్తే ఊహించని నిర్ణయం.. దేవుడిలా వచ్చిన పోలీసులు..
వారిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ భవిష్యత్ వారిని భయపెట్టింది. ఊరు వెళ్తే అందరూ ఏమనుకుంటారో.. ఇక్కడే ఉండి ఎలా బతకాలి అనే ప్రశ్నలు వారిని సతమతం చేశాయి. దీంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కానీ అక్కడే ట్విస్ట్ నెలకొంది.
- S Srinivasa Rao
- Updated on: May 25, 2026
- 4:58 pm
Watch Video: దొంగ అనుకొని స్థంభానికి కట్టేసి చితకబాదారు.. అసలు సంగతి తెలిసి అంతా షాక్!
శ్రీకాకుళం జిల్లా.. పలాస.. కాశీబుగ్గ మున్సిపాల్టీ పరిధిలో 'ఇదిగో తోక అంటే అదిగో పులి' అన్న చందంగా ఉంది పరిస్థితి. ఇటీవల తరచూ జరుగుతోన్న దొంగతనాలు, దోపిడీలతో పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. దొర ఎవరో.. దొంగ ఎవరో... తెలియనీ అయోమయ పరిస్థితినీ ఇక్కడి వారు ఫేస్ చేస్తున్నారు..
- S Srinivasa Rao
- Updated on: May 8, 2026
- 6:20 pm
అంబేద్కర్ యూనివర్సిటీలో వివాదం.. ప్రొఫెసర్-స్టూడెంట్ ఫోన్ కాల్ వైరల్
Srikakulam university controversy: విశ్వవిద్యాలయాలు అంటే సరస్వతీ నిలయాలు.ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దే విజ్ఞాన కేంద్రాలు. అటువంటి విశ్వవిద్యాలయాల ప్రతిష్ట ఇటీవల కొంత మసకబరుతున్నాయి. కంచే చేను మేస్తే అన్న చందంగా స్టూడెంట్స్ కి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకులే కొన్ని చోట్ల కీచకులుగా మారుతున్నారు.
- S Srinivasa Rao
- Updated on: May 4, 2026
- 10:34 am
Andhra Pradesh: సినిమా స్టైల్లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా సాల్వ్ చేశారో తెలుసా..?
జీఎస్టీ అధికారులమంటూ ఎంట్రీ ఇచ్చారు.. కళ్లముందే పిస్టల్స్తో బెదిరించారు.. సీసీ కెమెరాలకు చిక్కకుండా బ్లాక్ స్ప్రే కొట్టి, యజమాని చేతులకు బేడీలు వేసి పట్టపగలే భారీ దోపిడీకి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో సంచలనం సృష్టించిన ఈ సినిమా లెవల్ దొంగతనం వెనుక ఉన్న అసలు గుట్టును పోలీసులు రట్టు చేశారు.
- S Srinivasa Rao
- Updated on: May 3, 2026
- 7:52 am
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా లేదుగా..
సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన దివ్వెల మాధురి ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. బుల్లితెరపై బిగ్ బాస్ కంటెస్టెంట్గా అందరినీ అలరించిన ఆమె, ఇప్పుడు చీన్ టపాక్ డుం డుం అనే వెరైటీ టైటిల్తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- S Srinivasa Rao
- Updated on: Apr 27, 2026
- 10:51 pm
అప్పు ఇచ్చే బ్యాంక్ కాదు.. ప్రాణం నిలిపే బ్యాంక్! శ్రీకాకుళం పోలీసుల వినూత్న ప్రయత్నం..!
సాధారణంగా బ్యాంకులు అంటే డబ్బులు దాచుకోవడానికో లేదా అప్పులు తీసుకోవడానికో వేదికలు. కానీ, శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ఆలోచనతో "హెల్మెట్ బ్యాంకులను" అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ వినూత్న కాన్సెప్ట్, వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలవబోతోంది.
- S Srinivasa Rao
- Updated on: Apr 26, 2026
- 11:37 am