హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తిచేశాను. 2007 లో టీవీ9 తో నా జర్నలిజం కెరీర్ ప్రారంభమయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 16 ఏళ్లుగా టీవీ9 తో నా ప్రయాణం కొనసాగుతోంది.2007 నుండి 2013 వరకు హైదరాబాద్, 2013 సెప్టెంబర్ నుండి 2018 వరకు విజయనగరం, 2018 మే నుండి 2022 ఆగస్ట్ వరకు విశాఖపట్నం లలో స్టాఫ్ రిపోర్టర్ గా, సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేశాను. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాను.
Dharmana Prasad: మౌనం వీడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు!
కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని.. టీడీపీ ప్రభుత్వమేనన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఈ కూటమి పార్టీలన్ని మళ్లీ వైసీపీ ఖాతాలోకే వస్తాయన్నారు. ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ రోల్ ఏమీ లేదని.. అభద్రతాభావంతో ఆయనకు మైక్ దొరికినప్పుడల్లా చంద్రబాబును పొగిడే కార్యక్రమం పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేసారు.
- S Srinivasa Rao
- Updated on: Jul 12, 2025
- 11:42 pm
Watch Video: మా నాన్న ఏరోజు రాలేదు.. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లో కేంద్రమంత్రి భావోద్వేగం!
స్కూల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఉంటే ఎవరు వెళ్తారు.. పిల్లలు చదివే స్కూల్కు తల్లిదండ్రులు వెళ్తారు. కానీ ఇక్కడో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఈ పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా తన తల్లిదండ్రులు చదువకున్న స్కూల్కు వెళ్లారు. టీచర్స్, పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని, తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
- S Srinivasa Rao
- Updated on: Jul 11, 2025
- 4:48 pm
ఒకరిని మించి మరొకరు.. భర్త సౌదీలో ఉద్యోగం.. ఊరులో ఆడపడుచు భర్తతో భార్య వివాహేతర సంబంధం..కట్చేస్తే..
నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు పెను ప్రమాదంగా మారుతున్నాయి. పడక సుఖంతో మొదలవుతున్న ఈ సంబంధాలు చివరకు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇద్దరు వ్యక్తుల మద్య జరిగే ఈ చీకటి వ్యవహారం.. తర్వాత జరిగే తీవ్ర పరిణామాలతో అటు అత్తవారు, ఇటు పుట్టింటివారి పరువు మర్యాదలను రోడ్డున పడేస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులను అనాదులను చేస్తున్నాయి.
- S Srinivasa Rao
- Updated on: Jul 5, 2025
- 10:00 pm
Lord Hanuman Puja: అంజనీపుత్రునికి 10 వేల వడలతో అభిషేకం.. ఎక్కడంటే…?
దేవుడికి జలాభిషేకం, పాలాభిషేకం, పుష్పఅభిషేకం చేయడం చూసాం కానీ శ్రీకాకుళం జిల్లాలో భక్తులు వడలతో అభిషేకం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లోగల ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ ఆంజనేయ ట్రాలీ రిక్షా యూనియన్ కార్మికులు అంజనీసుతునికి నోరూరించే 10,116 (పదివేల నూటపదహారు) వడలతో అభిషేకం చేసి పట్టణంలో హాట్ టాపిక్ గా నిలిచారు.
- S Srinivasa Rao
- Updated on: Jul 2, 2025
- 7:29 am
కుమార్తె హాఫ్ సారీ ఫంక్షన్లో డ్యాన్స్తో దుమ్మురేపిన దువ్వాడ, మాధురి జంట! ఒక్కో స్టెప్.. ఒక్కో డైమండ్..
దివ్వెల మాధురి గారి పెద్ద కుమార్తె వాణి గారి ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఈ వేడుకలో సందడి చేశారు. భారీ స్టేజ్, అద్భుతమైన డెకరేషన్స్, అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక శ్రీకాకుళం హైదరాబాద్ ప్రముఖులతో సందడిగా సాగింది.
- S Srinivasa Rao
- Updated on: Jun 11, 2025
- 4:41 pm
పాము కాటుకు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమమం..!
రెండు వాన చుక్కలు పడ్డాయంటే చాలు.. పాములు సంచారం పెరుగుతాయి. అంతవరకు పుట్టలలో, చిన్న చిన్న రంధ్రాల్లో, ఇటుకులు, చెక్కల ఇరుకున దాగి ఉండే పాములు.. వాన నీటికి ఆవాసం చెదిరి బయట సంచరిస్తూ ఉంటాయి. తమకు అనువైన కొత్త ఆవాసాలు కోసం అక్కడ.. ఇక్కడ తిరుగుతూ అన్వేషిస్తూ ఉంటాయి.
- S Srinivasa Rao
- Updated on: Jun 4, 2025
- 9:06 pm
Andhra: ఆ రాగి పాత్ర రూ. 25 లక్షలే.. లచ్చలు.. లచ్చలు తెచ్చిపెడుతుందన్నారు.. సీన్ కట్ చేస్తే
మోసపోయేవాడు ఉన్నంతవరకు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. రైస్ పుల్లింగ్ మోసాల విషయంలో ఇది అక్షరాలా నిజమనే చెప్పాలి. పోలిసులు ఎంతగా చెబుతున్న, ఎంత మందిని అరెస్ట్ చేస్తున్నా రైస్ పుల్లింగ్ పేరిట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఈ మోసం వెలుగు చూసింది.
- S Srinivasa Rao
- Updated on: Jun 2, 2025
- 8:09 am
నమ్మిన తుపాకి తూటాకే నేలకొరిగిన మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు..!
ఆపరేగన్ కగార్తో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే, వందల మందిని కోల్పోయిన మావోయిస్ట్ పార్టీకి.. ఇప్పుడు మరో అతిపెద్ద నష్టం వాటిల్లింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును కోల్పోయింది.
- S Srinivasa Rao
- Updated on: May 22, 2025
- 9:19 am
Andhra Pradesh: తీర్థ యాత్రలో విషాదం.. కాశీ, అయోధ్య టూర్ వెళ్లిన చిత్తూరు జిల్లా వాసులకు అవస్థత..
పుణ్యం కోసం వెళితే పాపం ఎదురైనట్టు అయింది చిత్తూరు జిల్లాకి చెందిన టూరిస్టులు పరిస్థితి. ఈనెల 8న చిత్తూరు జిల్లా, పెద్ద పంజాని మండలం, గోను మాకులపల్లి గ్రామం దాని చుట్టుపక్కల రెండు గ్రామాలకు చెందిన 46మంది భక్తులు ఓ ప్రైవేటు బస్ బుక్ చేసుకుని తీర్థయాత్రలకు బయలుదేరారు. ఏపీ,ఒరిస్సాతో పాటు ఉత్తర భారతదేశంలోని కాశీ, అయోధ్య
- S Srinivasa Rao
- Updated on: May 16, 2025
- 8:44 pm
Manyam district: డ్యాన్స్ చేస్తూ తూలి పడిపోయాడేమో అనుకున్నారు.. కానీ లేవకపోవడంతో..
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో విషాదం నెలకొంది. ఘనంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. పెళ్లి వేడుక ఊరేగింపులో స్నేహితులతో డాన్స్ చేస్తూ బంగారు నాయుడు అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. డీజే సౌండ్కు బంగారు నాయుడు గుండె ఆగిపోయింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- S Srinivasa Rao
- Updated on: May 16, 2025
- 10:51 am
వేసవి తాపంతో అల్లాడిపోతోన్న మూగజీవాలు.. జనారణ్యంలోకి చేరి తిప్పలు..
తాగునీటి కోసం భామిని ,కొత్తూరు మండలాల్లో ఏనుగులు గుంపు పొలాల్లో సంచరిస్తూ వ్యవసాయ పంపు సెట్లను, పైప్ లను తరచూ ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా శనివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ కృష్ణ జింక దారితప్పి పట్టణంలోకి ప్రవేశించింది. సమీపంలోని కొండలపై నుండి వచ్చి ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోకి చొరబడింది. మున్సిపల్ కార్యాలయంలో సంచరిస్తూ స్థానికుల కంట పడింది. దీంతో
- S Srinivasa Rao
- Updated on: May 3, 2025
- 5:02 pm
Andhra: ఈదురుగాలులకు ఎగిరిపోయిన పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారం తలుపు
చట్టం ముందు అందరూ సమానులే....తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. పోలిసుల పని తీరు గురించి మాట్లాడే సందర్భంలో సినిమాల్లోనూ, వాస్తవిక జీవితంలోనూ మనం తరచూ వినే డైలాగ్ ఇది. అయితే ఇది కేవలం పోలీసులకు ,న్యాయ వ్యవస్థకు మాత్రమే పరిమితం కాదు. ప్రతృతి విపత్తులదీ ఇదే తీరు. తుఫానులు, ఈదురు గాలులు, భూకంపాలు, సునామీలు, టోర్నడోలు ఇలా ప్రకృతి విపత్తులు ఏవైనా అవి రాకుండా ఉండాలి కానీ.. వచ్చాయంటే మాత్రం వాటిని ఎదుర్కొని నిలబడటం ఎవరితరము కాదు. వాటి ముందు ఎంతటి వారైనా బలాదూరే.
- S Srinivasa Rao
- Updated on: May 3, 2025
- 8:35 am