AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukhalingeswara Swamy Temple: మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం!

దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో శ్రీ ముఖలింగం ఒకటి. వంశధార నదీ తీరాన కొలువుతీరిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచింది. శ్రీ ముఖలింగేశ్వర స్వామి కొలువుతీరిన ఈ క్షేత్రం వాస్తు శైలి, శిలా సంపద అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రం విశేషాలు, మహిమలు ఎన్నో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతియేట మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది ఆదివారం ప్రారంభమైన శివరాత్రి మహోత్సవాలు బుధవారం స్వామివారి త్రిశూల చక్రతీర్థ స్నానంతో ముగిసాయి.

Mukhalingeswara Swamy Temple:  మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం!
Srimukhalingam Temple
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Feb 18, 2026 | 11:23 PM

Share

బుధవారం జరిగిన నిర్వహించిన త్రిశూల్ చక్రతీర్థ స్నానం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.పార్వతి, పరమేశ్వరుల ఉత్సవ మూర్తులు శ్రీముఖలింగం క్షేత్రం నుండి భారీ ఊరేగింపుగా నంది వాహనంపై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధారనదీ తీరంలోని మిర్యాపల్లి రేవుకు చేరుకున్నాయి. అక్కడ వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ఉత్సవ మూర్తులకు నదిలో త్రిశూల చక్రతీర్థ స్నానం ఆచరించారు.నదీ గర్భం మధ్యలో ఎగువున ఆది దంపతులైన ఆ పార్వతి పరమేశ్వరులు స్నానమాడగా నదిలో దిగువ బాగాన ఆ నీటిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.

ఇలా పవిత్ర స్నానాలు చేయటం ద్వారా తమ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. నదిలో నీరు తక్కువగా ఉండటంతో ఈ ఘట్టం కోసం ఎగువున హిరమండలం వద్ద ఉన్న గొట్టా బ్యారేజ్ నుండి నదిలోకి కొంత మేర నీటిని విడిచిపెట్టారు. ఈ పవిత్ర స్నానాలకు ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగున ఉన్న ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. సుమారు 2కిలోమీటర్ల మేర జలమా.. జనమా అన్నట్టు నదీ తీరమంతా జనసంద్రమైంది. భక్తుల శివనామ స్మరణతో వంశధార నదీ తీరం పులకరించింది.

భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యి మందితో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కమెండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి జిల్లా SP మహేశ్వర రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. వంశధార నదిలో జరిగిన శ్రీ ముఖలింగేశ్వరుడి త్రిశూల చక్రతీర్థ స్నాన ఘట్టం నది పుష్కరాలను, కుంభ మేళాను తలపించేలా జరిగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us