Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravana Masam 2023: పూల మార్కెట్‌కు శ్రావణ శోభ.. జోరందుకున్న అమ్మకాలు.. కిలో ఏకంగా రూ.1100

ఆషాడం, అధిక శ్రావణమాసాలతో పూల రైతులు, వ్యాపారులు గత కొన్ని రోజులుగా అమ్మకాలు లేక నిరుత్సాహంతో ఉన్నారు. అయితే శ్రావణమాసం రావడంతో వివాహాది శుభకార్యాలు,పూజలు,వ్రతాలు అధికమవ్వడంతో ఈ పూల అమ్మకాలు జోరు అందుకున్నాయి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్లో..

Shravana Masam 2023: పూల మార్కెట్‌కు శ్రావణ శోభ.. జోరందుకున్న అమ్మకాలు.. కిలో ఏకంగా రూ.1100
Flower Market
Follow us
Pvv Satyanarayana

| Edited By: Srilakshmi C

Updated on: Aug 25, 2023 | 2:36 PM

అమరావతి, ఆగస్టు 25: ఆషాడం, అధిక శ్రావణమాసాలతో పూల రైతులు, వ్యాపారులు గత కొన్ని రోజులుగా అమ్మకాలు లేక నిరుత్సాహంతో ఉన్నారు. అయితే శ్రావణమాసం రావడంతో వివాహాది శుభకార్యాలు,పూజలు,వ్రతాలు అధికమవ్వడంతో ఈ పూల అమ్మకాలు జోరు అందుకున్నాయి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మార్కెట్‌కు దూరప్రాంతాల నుంచి పూల కొనుగోలుదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఇక్కడ పూలదిగుబడులు అంతగా లేనందున తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి టన్నుల కొలది బంతి, చామంతి, గులాబీ వంటి పూలను దిగుమతి చేసుకుంటున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నుంచి కొనుగోలుదారులు తరలివచ్చి కావలసిన పూలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు.

ఇతర రాష్ట్రాల నుంచి పూల దిగుమతులు చేసుకోవడం వల్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని చెప్పాలి. ఇటీవల వచ్చిన వరదలకు లంక గ్రామాల్లో కొన్ని పూల తోటలు పాడైపోయాయి. కడియం మండలంతో పాటు కోనసీమ జిల్లాలో ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో ఈ పూల సాగు అధికంగా ఉంటుంది. ఈ మూడు మండలాల్లోనే సుమారు 2,500 నుంచి 3 వేల ఎకరాల్లో వివిధ రకాల పూలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం లిల్లీ, మల్లి, జాజులు, కనకాంబరాలు, దేశవాళీ గులాబీలు మాత్రమే ఈ ప్రాంతాల్లో దిగుబడులు ఉన్నాయి. మిగిలిన పువ్వులు ఇతర రాష్ట్రాలు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కడియపులంక మార్కెట్ కేంద్రంగానే కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయి.

ఇవి కూడా చదవండి

వరలక్ష్మి వ్రతం సందర్భంగా కడియం పూల మార్కెట్లో పూల ధరలు కిలో ధర ఈ విధంగా ఉన్నాయి..

  • చామంతి పూలు కిలో రూ.300 నుంచి రూ.400
  • పసుపు బంతి పూలు కిలో రూ.50 నుంచి రూ.60
  • ఆరంజ్ బంతి పూలు కిలో రూ.60 నుంచి రూ.70
  • లిల్లీ పూలు కిలో రూ.250 నుంచి రూ.300
  • మల్లి పూలు కిలో రూ.1000 నుంచి రూ.1100
  • జాజులు పూలు కిలో రూ.700 నుంచి రూ.750
  • కాగడాలు పూలు కిలో రూ.700 నుంచి రూ.750
  • స్టార్ గులాబీ పూలు కిలో రూ.350 నుంచి రూ.400
  • కనకాంబరాల పూలు కిలో రూ.200 నుంచి రూ.250

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్
Viral Video: వడాపావ్‌కు పడిపోయిన హాంకాంగ్ ప్రియురాలు...
Viral Video: వడాపావ్‌కు పడిపోయిన హాంకాంగ్ ప్రియురాలు...
అవకాశాలు లేక స్పెషల్ సాంగ్.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ రిస్క్..
అవకాశాలు లేక స్పెషల్ సాంగ్.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ రిస్క్..